TG: ఖమ్మం జిల్లా వెలుగుమట్ల భూదాన్ భూములను BJP చీఫ్ రామచందర్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘భూదన్ బోర్డు పట్టాలున్న పేదల ఇళ్లను కూల్చివేశారు. నోటీసులు ఇవ్వకుండా దౌర్జన్యంగా పేదల ఇళ్లను కూల్చివేశారు. ఇది ప్రజా ప్రభుత్వం కాదు.. పేదల వ్యతిరేక ప్రభుత్వం. పేదల ఇళ్లను కూలగొట్టి ప్రభుత్వం ఏం సాధించింది. బాధితులకు న్యాయం జరిగే వరకు BJP పోరాడుతుంది’ అని అన్నారు.