AP: రాయలసీమ ఎత్తిపోతల పథకంపై మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. సీమ ప్రాంతానికి ఈ ప్రాజెక్ట్ అత్యంత ప్రాధాన్యమైనదని, దీనిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు వాస్తవమా.. కాదా? అని ఆయన నిలదీశారు. ప్రాజెక్ట్ పనులు నిలిపివేతపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని అసులు ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించి.. ఎప్పుడు పూర్తి చేస్తారో చెప్పాలంటూ డిమాండ్ చేశారు.