AP: దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి మార్చి 7న అనకాపల్లి జిల్లాలో శంకుస్థాపన చేస్తున్నట్లు AMNS యాజమాన్యం ‘X’లో ప్రకటించింది. ఇది చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆనందకరమైన విషయమంటూ పేర్కొంది. కంపెనీ చిత్రం, సమగ్ర వివరాలను పోస్టుకు జత చేసింది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, CM చంద్రబాబు, కేంద్ర, రాష్ట్రమంత్రులు వస్తారనే సమాచారంతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.