AP: మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదప్పై టీడీపీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలతో శంకర్ యాదవ్ లోపాయకారి ఒప్పందం చేసుకున్నారని అన్నారు. కార్యకర్తల దగ్గరే కమీషన్లు వసూలు చేశారని ఆరోపించారు. ములకల చెరువు మద్యం కేసులో నిందితుడిగా ఉన్న జయచంద్రారెడ్డి కొంతకాలంగా అజ్ఞాతంలో ఉన్నారు. అక్రమంగా తన పేరును FIRలో చేర్చారంటూ వీడియో విడుదల చేశారు.