TG: రైతుల కోరిక మేరకు ఆధునిక సాంకేతిక వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు వ్యవసాయ డ్రోన్లు సబ్సిడీపై అందజేస్తామని మంత్రి తుమ్మల తెలిపారు. రాష్ట్రంలో యాంత్రికరణను వేగవంతం చేయడం కోసం ప్రభుత్వం 2025-26 సంవత్సరానికి సబ్ మిషన్ అగ్రికల్చర్ మెకనైజేషన్ పథకం కింద పలు వ్యవసాయ యంత్రాలను సబ్సిడీపై చిన్న, సన్నకారు, ఎస్సీ, ఎస్టీ, మహిళా రైతులకు అందజేస్తున్నట్లు పేర్కొన్నారు.