AP: అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద ఈనెల 23న ఆర్సెలార్ మిట్టల్ నిప్పన్ స్టీల్ప్లాంట్కు శంకుస్థాపన చేయనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ కూడా హాజరయ్యే అవకాశం ఉంది. దీంతో అధికారులు ముర్మర ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, రూ.1.35 లక్షల కోట్లతో రెండు దశల్లో 5,300 ఎకరాల్లో స్టీల్ప్లాంట్ను నిర్మించనున్న విషయం తెలిసిందే.