మానసిక ఒత్తిడి నేడు అందరినీ వేధిస్తున్న సమస్య. నిరంతర ఆలోచనలు రక్తపోటును పెంచి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రతిరోజూ 10 నిమిషాలు ధ్యానం చేయండి. మీకు ఇష్టమైన సంగీతం వినడం లేదా పుస్తకాలు చదవడం వల్ల మెదడు రిలాక్స్ అవుతుంది. ప్రతి చిన్న విషయానికి ఆందోళన చెందడం మానేసి, ప్రస్తుత క్షణాన్ని ఆస్వాదించడం అలవాటు చేసుకుంటే మనసు తేలికపడి ఆయుష్షు పెరుగుతుంది.