కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు శుభవార్త తెలిపింది. నిరుపేదలకు ఇబ్బంది లేకుండా ఏప్రిల్, మే, జూన్ నెలలకు సరిపడా బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఆహార భద్రత కల్పించే లక్ష్యంతో కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విధానాన్ని వెంటనే అమలు చేయాలని అన్ని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.