నటి పూనమ్ కౌర్ ఇవాళ వేములవాడలోని భీమేశ్వర స్వామిని దర్శించుకుంది. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, కోడె మొక్కులు చెల్లించుకుంది. అనంతరం వేద పండితులు ఆమెకు ఆశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు అందజేశారు. రాజన్న ఆలయ నిర్మాణ పనులు పూర్తైన తర్వాత మళ్ళీ స్వామివారిని దర్శించుకుంటానని ఆమె తెలిపింది.