అనంతపురం: కార్మికులకు బకాయి పడ్డ ఒక నెల జీతం ప్రభుత్వం తక్షణమే చెల్లించాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి మల్లికార్జున డిమాండ్ చేశారు. రాయదుర్గం పట్టణంలో స్థానిక వినాయక కూడలి వద్ద కార్మికులతో కలిసి ధర్నా చేపట్టారు. చాలీచాలని జీతాలతో జీవితాలు నెట్టుకొస్తున్న కార్మికులకు నెల రోజులు అయినప్పటికీ జీతాలు అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.