డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి తన తదుపరి చిత్రాన్ని ఉగాది పర్వదినం సందర్భంగా ప్రారంభించనున్నాడట. అయితే ఇందులో నలుగురు హీరోలు, నలుగురు హీరోయిన్లు నటించబోతున్నారని, వారంతా కొత్తవారే నని టాక్ నడుస్తోంది. స్నేహం, జీవితం, బలమైన భావోద్వేగాల సమ్మేళనంగా ఈ కథ సాగనుందట. విభిన్నమైన కథాంశాలతో మెప్పించే క్రిష్, ఈసారి యువతను ఆకట్టుకునేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది.