బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ IPL మ్యాచ్కు హాజరయ్యాడు. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా పంజాబ్, కోల్కతా మధ్య జరుగుతున్న పోరును ఆయన తన కుమార్తె సుహానాతో కలిసి వీక్షించాడు. KKR యజమాని అయిన షారుఖ్.. తన జట్టు క్యాప్ను ధరించి గ్యాలరీ నుంచి ఆటగాళ్లను ఉత్సాహపరుస్తూ కనిపించాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.