SRPT: నడిగూడెం మండలం కేశవపురంలో ఇంటి పన్నుతో పాటు గ్రంథాలయ పన్ను వసూలు చేస్తున్న అధికారులు వసతుల కల్పనలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారని బీజేపీ నాయకులు, నిరుద్యోగులు ఆరోపించారు. కనీసం దినపత్రికలు కూడా లేకపోవడంతో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు ఇబ్బంది పడుతున్నారని మండిపడ్డారు. వెంటనే గ్రంథాలయంలో మౌలిక సదుపాయాలు కల్పించాలని వారు కోరుతున్నారు.