మఖానా (తామర గింజలు) అద్భుతమైన పోషక విలువలున్న సూపర్ ఫుడ్. ఇందులో ప్రోటీన్లు, ఫైబర్, కాల్షియం, ఐరన్, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి.మఖానాతో ఎముకలు దృఢంగా మారుతాయి. రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. రక్తహీనత తగ్గుతుంది. రక్తపోటు, బరువు నియంత్రణలో ఉంటుంది. ఇందులో ఉండే ఫైబర్ వల్ల మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది.
తలస్నానం తర్వాత జుట్టు విషయంలో జాగ్రత్తలు అవసరం. తడి జుట్టును టవల్తో గట్టిగా రుద్దడం వల్ల చిక్కులు పడి వెంట్రుకలు రాలుతాయి. అలాగే కుదుళ్లు బలహీనంగా ఉన్నప్పుడు దువ్వడం, జడ వేయడం మంచిది కాదు. హెయిర్ స్ప్రేలను నేరుగా జుట్టుపై వాడకూడదు. వాటిలోని ఆల్కహాల్ హాని చేస్తుంది. కాబట్టి స్ప్రేను ముందుగా చేతుల్లోకి తీసుకుని, ఆపై జుట్టుకు రాసుకోవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.
ఆరోగ్యకరమైన మధ్యాహ్న భోజనం కోసం కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. కడుపు నిండా తినకుండా కొంచెం ఖాళీ ఉంచితే బద్ధకం, నిద్ర రావు. అన్నంతో పాటు ప్రోటీన్లు, పీచు పదార్థాలు ఉండేలా చూసుకోవాలి. ఆహారాన్ని బాగా నమిలి తినాలి. టీవీ, మొబైల్ చూస్తూ తినడం మానేయాలి. చివరగా మజ్జిగ తాగితే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. భోజనానికి అరగంట ముందు లేదా తర్వాతే నీళ్లు తాగడం ఉత్తమం.
జీవనశైలిలో చిన్న మార్పులతో డిప్రెషన్ను జయించవచ్చు. నిత్యం వ్యాయామం, యోగా, ధ్యానం చేయడం వల్ల మానసిక స్థితి మెరుగుపడుతుంది. కుటుంబం, స్నేహితులతో సమయం గడుపుతూ భావాలను పంచుకోవాలి. పోషకాహారం తీసుకుంటూ మద్యం, ధూమపానానికి దూరంగా ఉండాలి. ప్రతిరోజూ డైరీ రాసే అలవాటు నెగటివ్ ఆలోచనలను తగ్గిస్తుంది. కంటినిండా నిద్ర మానసిక ప్రశాంతతకు ఎంతో అవసరం.
మనం చదివే వైవిధ్యమైన పుస్తకాలు మన ఆలోచనలు, సంభాషణల్లోని లోతును పెంచుతాయి. మనం పాటించే కఠిన ఆరోగ్య సూత్రాలు మనలోని శక్తిని ఉత్తేజితం చేస్తాయి. సాకులు చెప్పకుండా మనం స్థిరత్వంతో చేసే పని మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. మన సన్నద్ధత ఎంత మెరుగ్గా ఉంటే, మనకొచ్చే ఫలితాలు అంత అద్భుతంగా ఉంటాయి.
అమ్మాయిలు ఎన్నో బ్యూటీప్రొడక్ట్స్ వాడతారు. వాటిలో కొన్నిటిని రోజూ వాడితే ఇబ్బందులొస్తాయని నిపుణులు అంటున్నారు. వాటర్ప్రూఫ్ మస్కారా రోజూ వాడితే కనురెప్పలు పొడిబారిపోతాయి. చర్మాన్ని వారానికి రెండుసార్లే స్క్రబ్ చెయ్యాలి. లేదంటే పొడిబారి నిర్జీవంగా మారుతుంది. డీప్ కండీషనర్స్ రోజూ వాడితే కేశాల్లోని PH స్థాయులపై ప్రభావం చూపి నిర్జీవంగా మారుస్తుంది.
కళ్ల కింద నల్లటి వలయాలను కొన్ని చిట్కాలతో తగ్గించుకోవచ్చు. రోజుకు 7-8 గంటల నిద్ర అవసరం. తగినంత నీరు తాగి శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచుకోవాలి. ఫోన్, ల్యాప్టాప్ వాడకాన్ని తగ్గిస్తే మంచిది. కళ్లపై కీరా ముక్కలు లేదా ఐస్ కంప్రెస్ ఉంచితే ఉపశమనం లభిస్తుంది. శనగపిండి మిశ్రమాన్ని కళ్ల కింద రాసి, ఆరిన తర్వాత కడిగేస్తే మంచి ఫలితం ఉంటుంది. కళ్ల దగ్గర ఐస్ కంప్రెస్ చేయాలి.
మొలకెత్తిన గింజలు పోషకాల గని. వీటిని నిత్యం బ్రేక్ఫాస్ట్లో తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడి, మలబద్ధకం తగ్గుతుంది. ఇవి మధుమేహాన్ని నియంత్రించడమే కాకుండా గుండె ఆరోగ్యాన్ని కాపాడి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి. వీటిలోని పోషకాలు నరాల వ్యవస్థను, మెదడు పనితీరును మెరుగుపరిచి శరీరానికి తక్షణ శక్తినిస్తాయి. సంపూర్ణ ఆరోగ్యానికి మొలకలు ఉత్తమ ఆహారం.
చర్మ సౌందర్యానికి ఆరోగ్యకరమైన ఆహారం, తగినంత నీరు తాగడం ముఖ్యం. జంక్ ఫుడ్, డెయిరీ ఉత్పత్తులకు దూరంగా ఉండాలి. నిత్యం సన్స్క్రీన్, మాయిశ్చరైజర్ రాస్తూ మెడ, కళ్ల కింద మృదువుగా మర్దన చేయాలి. రోజుకు రెండుసార్లు ఫేస్ వాష్ చేసుకోవాలి, కానీ ముఖాన్ని గట్టిగా రుద్దకూడదు. మొటిమలు, మచ్చలను గిల్లడం వంటివి చేయరాదు. ఈ జాగ్రత్తలు పాటిస్తే చర్మం కాంతివంతంగా, ఆరోగ్యంగా ఉంటుంది.
చాలామంది మహిళలు ఇంటి పనులు, ఆఫీస్ వర్క్ వల్లే నీరసపడుతున్నామని అనుకుంటారు. కానీ, దీనికి ప్రధాన కారణం శరీరంలో ఐరన్ లోపం కావచ్చు. ఇది దీర్ఘకాలంలో రక్తహీనతకు దారితీస్తుంది. కాబట్టి కేవలం కడుపు నిండా తినడమే కాదు, ఐరన్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం ముఖ్యం. నిరంతరం అలసటగా అనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి రక్త పరీక్ష చేయించుకోవాలి.
గ్యాస్ స్ట్రబుల్ ఎక్కువగా వచ్చే వాళ్లు వేగంగా తినడం మానేయాలి. ఆహారాన్ని బాగా నమిలి మెల్లగా తినాలి. భారీగా ఒకేసారి తినడం కంటే రోజులో చిన్న చిన్న మోతాదులో తీసుకోవడం మంచిది. రాత్రి భోజనం తిన్న వెంటనే పడుకోకుండా కనీసం కొద్దిసేపు నడవాలి. టీ, కాఫీ ఎక్కువగా తాగడం తగ్గించాలి. బంగాళాదుంప, క్యాబేజీ, బీన్స్ లాంటి గ్యాస్ పెంచే పదార్థాలు పరిమితిలోనే తీసుకుంటే కడుపు ప్రశాంతంగా ఉంటుంది.
చర్మ సౌందర్యానికి శనగపిండి ఒక అద్భుతమైన సహజ సిద్ధమైన ఔషధం. ఇది చర్మంపై ఉన్న మృతకణాలను తొలగించి, రంగును మెరుగుపరుస్తుంది. శనగపిండిలో పెరుగు కలిపి రాస్తే అధిక జిడ్డు తగ్గుతుంది. లేదా శనగపిండిలో చిటికెడు పసుపు, పాలు కలిపి ప్యాక్లా వేస్తే చర్మం మెరుస్తుంది. అంతేకాదు శనగపిండిలో నిమ్మరసంతో కలిపి వాడితే ట్యాన్ తొలగిపోతుంది.
బార్లీ వాటర్తో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. శరీరానికి చలవ చేసి ఎండదెబ్బ నుంచి కాపాడుతుంది. ఇది మూత్రపిండాల్లో రాళ్లను కరిగించడమే కాకుండా, ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది. ఇందులోని పీచు పదార్థం బరువు తగ్గడానికి, మలబద్ధకం దూరం చేయడానికి తోడ్పడుతుంది. అలాగే కొలెస్ట్రాల్, చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని కాంతివంతంగా మారుస్తాయి.
డార్క్ చాక్లెట్లో ఉండే ఫ్లేవనాల్స్ నైట్రిక్ ఆక్సైడ్ విడుదలను ప్రేరేపించి రక్తనాళాలను సడలింపజేస్తాయి. దీని ద్వారా రక్తపోటు తగ్గుతుంది. కోకోలో ఉండే ప్రతి ఆక్సీకరణ పదార్థాలు రక్తనాళాల గోడలను, కొవ్వు అణువులను ఆక్సీకరణ నష్టానికి గురికాకుండా రక్షిస్తాయి. దీంతో గుండె జబ్బులు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. గుండెపోటు, పక్షవాతం వచ్చే ప్రమాదాలు తగ్గుతాయి.
TG: రాష్ట్రంలో HPV వ్యాక్సినేషన్ కాసేపట్లో ప్రారంభం కానుంది. 14 ఏళ్లు నిండిన బాలికలు ఈ వ్యాక్సిన్ వేసుకోవచ్చు. అయితే భారత్లో మహిళల్లో గర్భాశయ క్యాన్సర్ అనేది రెండో అత్యంత సాధారణ క్యాన్సర్గా ఉంది. ఈ క్యాన్సర్ ప్రధానంగా హ్యూమన్ పాపిలోమా వైరస్ దీర్ఘకాలికంగా శరీరంలో ఉండటం వల్ల వస్తుంది. దీన్ని నివారించేందుకు ప్రభుత్వం HPV వ్యాక్సిన్ను ఉపయోగిస్తోంది.