AP: శ్రీశైల క్షేత్రానికి రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది. 30 రోజుల వ్యవధిలోనే రూ.7.19 కోట్లకు పైగా కానుకలు లభించాయని ఆలయ అధికారులు పేర్కొన్నారు. తాజాగా నిర్వహించిన హుండీ లెక్కింపులో రూ.7,19,58,064 నగదు లభించినట్లు వెల్లడించారు. నగదుతో పాటు 122 గ్రా. బంగారం, 6 కిలోల 550 గ్రా. వెండిని భక్తులు సమర్పించారు. వీటితో పాటు పలు దేశాలకు చెందిన విదేశీ కరెన్సీ కూడా హుండీలో లభించాయి.