శ్రీరామనవమి వేడుకలకు దేశం ముస్తాబైంది. కొన్నాళ్ల క్రితం రాములోరి కల్యాణం అయ్యే వరకు ఇళ్లలో పెళ్లిళ్లు జరిగేవి కావు. కల్యాణం తర్వాతనే ముహూర్తాలు పెట్టుకునే వారు. అయితే, రామయ్య కల్యాణ తలంబ్రాలను ఇంట్లో వివాహం కాని యువతీ యువకుల శిరస్సు పైన వేసినట్లయితే వారికి వివాహం అవుతుందని నమ్ముతారు. పెళ్లి కానివారు ఈ ఆచారాన్ని పాటిస్తే.. త్వరగా వివాహం అవుతుందట.