తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. 27 కంపార్టుమెంట్లలో భక్తులు సర్వదర్శనానికి వేచి ఉన్నారు. నిన్న స్వామివారిని 81,288 మంది భక్తులు దర్శించుకున్నారు. 34,892 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.43 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. వారంతపు సెలవులు, విద్యార్థులకు హాలిడేలు ఉండటంతో భక్తులు భారీగా తరలొస్తున్నారు.