AP: కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించామని టీటీడీ అదనపు ఈవో వెంకయ్యచౌదరి తెలిపారు. ఏడాదికి నాలుగుసార్లు ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశికి ఆలయం శుద్ధి చేస్తామన్నారు. ఆలయ మూలమూర్తికి వస్త్రం కప్పి ఉప ఆలయాలను శుద్ధి చేశామన్నారు. శుద్ధి అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు, నివేదనలు సమర్పిస్తామన్నారు. అనంతరం భక్తులకు దర్శనం కల్పిస్తామన్నారు.