ఈ సంవత్సరం మొదటి ఖగోళ అద్భుతం ముగిసింది. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాలతో పాటు భారతదేశంలోనూ చంద్రగ్రహణం ఏర్పడింది. ఈ అరుదైన దృశ్యాన్ని ఖగోళ ప్రేమికులు ఆసక్తిగా తిలకించారు. ఎరుపు రంగులో చంద్రుడు కనువిందు చేశాడు. చాలా ప్రాంతాల్లో గ్రహణం చివరి దశలో ఉండగా చంద్రోదయం జరిగింది. గ్రహణం ఏర్పడుతున్న నేపథ్యంలో భారతదేశంలో ఆధ్యాత్మికంగా ‘సూతక కాలం’ ప్రాధాన్యత సంతరించుకుంది.