SRD: రాష్ట్ర పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ డా.రవీందర్ నాయక్కు జాగృతి రాష్ట్ర కార్యదర్శి మురళీకృష్ణకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పటాన్చెరులో CSR నిధులతో నిర్మించనున్న నూతన దవాఖానకు డా. కిషన్రావు పేరు పెట్టాలని కోరారు. కాలుష్యానికి వ్యతిరేకంగా పోరాటాలు చేసి రూ.567 కోట్ల CSR నిధులు తీసుకురావడంలో డాక్టర్ కిషన్ రావు కీలక పాత్ర పోషించారని త...
MLG: మంగపేట మండలం రాజుపేట సబ్స్టేషన్ పరిధిలో మరమ్మత్తుల కారణంగా సోమవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. పనులు పూర్తయ్యాక వెంటనే విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని అధికారులు వెల్లడించారు. వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.
ADB: ఆదిలాబాద్లో ఆదివాసీల ఆరాధ్య దైవం, గోండీ ధర్మగురువు హీరాసుక జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ రాజర్షి షా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. హీరాసుక చిత్రపటానికి పూజలు నిర్వహించి, ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు దేశానికే గర్వకారణమని కొనియాడారు. అనంతరం ఆదివాసి సాంప్రదాయ నృత్యంలోనూ పాల్గొన్నారు.
MDCL: ఉప్పల్ జోన్ పరిధిలో రోడ్లకు మరమ్మతులు చేస్తున్నట్లు ZC రాధిక గుప్తా తెలిపారు. నాచారం సహా అనేక ప్రాంతాల్లో ఒక్క ఫిర్యాదుతో వెంటనే రంగంలోకి దిగి నిన్న రోడ్డుకు మరమ్మతులు పూర్తి చేశారు. మీ ప్రాంతంలోనూ రోడ్డు మరమ్మతులు అవసరం పడితే ‘MYCURE’ యాప్ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు. లొకేషన్, ఫొటో, కాంటాక్ట్ డీటెయిల్స్ నమోదు చేస్తే సరిపోతుందన్నారు.
JGL: ప్రకృతి విపత్తులైన భారీ వర్షాలు, ఈదురు గాలులు, సాంకేతిక కారణాలతో విద్యుత్ సరఫరాలో ఏర్పడే అంతరాయాలను తగ్గించి వినియోగదారులకు త్వరితగతిన సేవలు అందించేందుకు జగిత్యాల జిల్లాలో ప్రత్యేక చర్యలు చేపట్టామని SE బి. సుదర్శనం తెలిపారు. సర్కిల్లో 3 ఎమర్జెన్సీ వాహనాలు, టీంలను, సబ్ డివిజన్లలో 9 వాహనాలు ఏర్పాటు చేశామన్నారు.
నిర్మల్ పట్టణంలో ప్రముఖ కవి అంబటి నారాయణ రచించిన ‘పుడమిని ముద్దాడిన పొద్దు’ పుస్తకాన్ని ఘనంగా ఆవిష్కరించారు. ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రముఖ కవి గుడిపాటి పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ పుస్తకం సామాజిక, మానవీయ, నైతిక విలువల సమాహారమని వక్తలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో కవులు, కళాకారులు పాల్గొన్నారు.
MHBD: మరిపెడ మండలం అబ్బాయిపాలెం గ్రామ శివారులో అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్నారానే పక్క సమాచారం మేరకు SI వీరభద్రం ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఇద్దరు యువకులు గంజాయి విక్రయిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి రూ. 50 వేల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వారి పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
MDCL: ఉప్పల్ నుంచి ఘట్కేసర్ వెళ్లే మార్గంలోని వరంగల్ జాతీయ రహదారి ప్రమాదాలకు నిలయంగా మారుతుంది. గత 5 సంవత్సరాల్లో ఏకంగా 24 మందిని బలికొంది. ఉప్పల్, మేడిపల్లి, పోచారం, ఘట్కేసర్ ఏరియాల్లో ఈ ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఉప్పల్ నుంచి నారపల్లి వెళ్లే మార్గంలో రోడ్డు ఇరుకుగా, ప్రమాదకరంగా ఉండటం, నిర్లక్ష్యమైన డ్రైవింగ్, అధిక వేగమే ఈ ప్రమాదాలుకు కారణాలుగా తెలుస్తోంది.
NZB: మోపాల్ మండలం నర్సింగ్పల్లి ఇందూరు తిరుమల క్షేత్ర బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం స్వామి వారికి చక్ర స్నానం, రథోత్సవం జరిపారు. సాయంత్రం పుష్ప యాగం నిర్వహించారు. ఈ వేడుకల్లో సినీ దర్శకుడు, నటుడు బలగం వేణు, సినీ నిర్మాత దిల్ రాజు, శిరీశ్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. దేవనాథ జీయర్ స్వామి ప్రవచించారు.
సూర్యాపేట పట్టణంలో రెండు రోజులు పాటు నిర్వహించిన TUCI రాష్ట్రస్థాయి రాజకీయ శిక్షణా తరగతులు ఆదివారం సాయంత్రం ముగిశాయి. ఈ సందర్భంగా నాయకులు కార్మిక ఉద్యమాలు, ప్రస్తుత రాజకీయ అంశాలపై కార్యకర్తలకు అవగాహన కల్పించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు కార్మికులకు ప్రయోజనకరంగా ఉండాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
KNR: చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను ఆదివారం కరీంనగర్లోని ఆయన నివాసంలో చొప్పదండి ఎలక్ట్రానిక్ మీడియా నూతన కార్యవర్గ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియా సభ్యులకు శాలువాలు కప్పి శుభాకాంక్షలు తెలిపారు. విలేకరుల సమస్యలను ఎమ్మెల్యేకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు బొక్కెన కృష్ణకుమార్ పాల్గొన్నారు.
MDCL: HIV-AIDSపై అనుమానం ఉందా..? భయాందోళన చెందకుండా ఘట్కేసర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ రావాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఇక్కడ మీ సమాచారం గోప్యంగా ఉంచి, పరీక్షలు నిర్వహించి, వైద్యం అందజేసి కౌన్సిలింగ్ సైతం అందిస్తామన్నారు. ఘట్కేసర్, అన్నోజిగూడ, పోచారం ప్రాంతాల్లో పాజిటివ్ నిర్ధారణ జరిగిన నేపథ్యంలో ఈ సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. అక్రమ సంబంధాలకు దూరంగా ఉండాలని సూచించారు.
వనపర్తి మండలం ఏదుట్ల గ్రామంలో ఇందిరమ్మ ఇంటి నూతన గృహప్రవేశ కార్యక్రమంలో ఎమ్మెల్యే మేఘారెడ్డి పాల్గొన్నారు. గ్రామ సర్పంచ్ సునీత రాజవర్ధనరెడ్డి పాటు గ్రామ కాంగ్రెస్ కార్యకర్తలు హాజరయ్యారు. లబ్ధిదారుడి కుటుంబానికి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే, ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిరుపేదల జీవితాల్లో మార్పు తెస్తున్నాయని అన్నారు.
MLG: పెద్ద వెంకటాపురం గ్రామానికి చెందిన రఫియా (28) వారం రోజుల క్రితం ఇంటి నుండి వెళ్లిపోయింది. కుటుంబ సభ్యులు గాలింపు చర్యలు చేపట్టిన ఆచూకీ దొరకకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆమె ఆచూకీ తెలిసినవారు PS నెంబర్ 8712670091కు సమాచారం ఇవ్వాలని CI కోరారు. ఆచూకీ తెలిపిన వారికి పారితోషకం అందజేస్తామన్నారు.
PDPL: అంతర్గాం మండలం పెద్దంపేటలో ఆదివాసీల ఆధ్వర్యంలో లక్ష్మీదేవి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. జిల్లా ఓబీసీ సెల్ అధ్యక్షుడు మహేష్ పాల్గొని నిర్వాహకులకు కండువాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వనవాస సమయంలో పంచపాండవులు ఈ గ్రామానికి వచ్చారని చారిత్రక నేపథ్యాన్ని గుర్తుచేశారు. ప్రతి ఏటా ఉగాది సందర్భంగా ఈ వేడుకలు నిర్వహించడం అభినందనీయమన్నారు.