MLG: ములుగు మున్సిపాలిటీ కమిషనర్ ఇచ్చిన ఆర్టీఐ సమాచారంపై జిల్లా అడిషనల్ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. బీసీ జేఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తోటకూరి శ్రీకాంత్ గౌడ్ గ్రీవెన్స్ కార్యక్రమంలో దరఖాస్తు సమర్పించారు. ఆర్టీఐ కింద కోరిన సమాచారానికి తప్పుడు వివరాలు ఇచ్చారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.