NLG: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా కరెంట్ కోతలు విధిస్తోందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్య నారాయణ గుప్తా విమర్శించారు. ఎండలు పెరుగుతున్న సమయంలో అప్రకటిత విద్యుత్ కోతలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితిపై ప్రభుత్వం స్పందించాలని ట్వీట్ ద్వారా తెలిపారు.