• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

హుజూర్ నగర్‌లో జాతీయ జెండా దిమ్మె ధ్వంసం..!

SRPT: హుజూర్ నగర్ పట్టణంలోని స్థానిక మండల ప్రజా పరిషత్ (MPP) కార్యాలయ ఆవరణలోని జాతీయ జెండా దిమ్మెను గుర్తుతెలియని ఆగంతుకులు ధ్వంసం చేశారు. శనివారం ఉదయం ఈ విషయాన్ని గమనించిన అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ కార్యాలయ ప్రాంగణంలోనే ఈ ఘటన జరగడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.

February 21, 2026 / 11:57 AM IST

దేవాలయంలో మొక్కులు చెల్లించుకున్న నూతన పాలకవర్గం

RR: షాద్‌నగర్ పట్టణంలోని 23వ వార్డు మైసమ్మ దేవాలయంలో నూతన ఛైర్మన్ బసవేశ్వర్, వైస్ ఛైర్మన్ అందేమోహన్, కౌన్సిలర్లు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా సాయి మిత్ర యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అధ్యక్షులు సత్యనారాయణ వారికి అభినందనలు తెలిపారు. వారు మాట్లాడుతూ.. నూతన పాలకవర్గం సమస్యలను పరిష్కరిస్తారని ప్రజలు భావిస్తున్నారన్నారు.

February 21, 2026 / 11:56 AM IST

బాధితులకు CMRF చెక్కు పంపిణీ

BHNG: మోత్కూరు మండలం పనకబండకు చెందిన మారుపాక మమత అనారోగ్యంతో HYDలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న వారి పరిస్థితిని ఉప సర్పంచ్ మల్లేశం, తుంగతుర్తి నియోజకవర్గ ఇంఛార్జ్ కడియం రామచంద్రయ్య దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆయన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవతో CMRF నిధుల కోసం దరఖాస్తు చేయించి చెక్కును అందజేశారు.

February 21, 2026 / 11:53 AM IST

రోడ్ల గండం.. ప్రయాణం నరకం..!

SRPT: నాగారం మండలం పస్తాల, పసునూరు స్టేజి మరియు రావులపల్లి ఎక్స్ రోడ్ రహదారులు గుంతలమయమై వాహనదారులు నిత్యం ప్రమాదాలకు గురవుతున్నారు. ఏళ్లు గడుస్తున్నా, గతంలో నిధులు మంజూరయ్యాయని చెబుతున్నా.. నేటికీ పనులు ప్రారంభం కాలేదు. ప్రజాప్రతినిధులు, అధికారులు వెంటనే స్పందించి ఈ రోడ్ల మరమ్మతులకు ప్రత్యేక నిధులు కేటాయించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.

February 21, 2026 / 11:52 AM IST

రేపు దేవరకొండలో గురుకుల ప్రవేశ పరీక్ష

NLG: దేవరకొండలోని తెలంగాణ గిరిజన మహిళా డిగ్రీ కళాశాలలో VTG-CET 2026, గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి ప్రవేశానికి ఆదివారం అర్హత పరీక్ష నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం.హరిప్రియ తెలిపారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థిని, విద్యార్థులు తమ హాల్ టికెట్‌తో పాటు ఆధార్, తదితర ఐడీ కార్డులతో కళాశాలకు ఉదయం 9 గంటల వరకు చేరుకోవాలని సూచించారు.

February 21, 2026 / 11:51 AM IST

రైతు వేదికలో వార్డు సభ్యులకు పరీక్షలు

MNCL: జన్నారం మండల కేంద్రంలోని రైతు వేదికలో వార్డు సభ్యులకు అధికారులు పరీక్షను నిర్వహించారు. పంచాయతీ రాజ్ చట్టంపై అవగాహన కల్పించేందుకు జన్నారం మండలంలోని అన్ని గ్రామాలలో నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యులకు నిర్వహిస్తున్న శిక్షణ శనివారం కొనసాగింది. పంచాయతీరాజ్ చట్టం, పంచాయతీ విధులు, నిధులు, బాధ్యతలు, తదితర అంశాలపై వారికి శిక్షణ ఇచ్చి పరీక్షను నిర్వహించారు.

February 21, 2026 / 11:50 AM IST

అధికారులను ఎట్టిపరిస్థితుల్లోనూ క్షమించబోం: హరీశ్ రావు

MDK: BRS పార్టీ రెండేళ్లలో మళ్లీ అధికారంలోకి వస్తుందని హరీశ్ రావు ధీమా వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కార్యకర్తల్లా వ్యవహరిస్తూ, BRS నాయకులపై అక్రమ కేసులు బనాయించిన పోలీసులను ఎట్టిపరిస్థితుల్లోనూ క్షమించబోమని హెచ్చరించారు. ఈసారి KCR కాళ్లు మొక్కైనా సరే అతిగా ప్రవర్తించిన అధికారులను వదిలేది లేదని స్పష్టం చేశారు.

February 21, 2026 / 11:50 AM IST

‘విద్యార్థులు సెల్ ఫోన్‌లకు దూరంగా ఉండాలి’

KMR: విద్యార్థులు తప్పనిసరిగా సెల్ ఫోన్‌లకు దూరంగా ఉండాలని ఆప్తాల్మిక్ ఆఫీసర్ హరికిషన్ తెలిపారు. కామారెడ్డిలోని ZPHS పాఠశాలలో నేడు విద్యార్థులకు ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ.. విద్యార్థులు మొబైల్ యొక్క స్క్రీన్ ప్రభావం వల్ల చూపు మందగించడం జరుగుతుంది. తల్లిదండ్రులు ఈ విషయంలో జాగ్రత్త తీసుకోవాలని సూచించారు.

February 21, 2026 / 11:48 AM IST

‘విద్యార్థులు ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయాలి’

KMM: పరీక్షా కేంద్రాల్లోకి ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదని స్పష్టం చేస్తూ విద్యార్థులు ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని డీఐఈవో రవి బాబు ఆకాంక్షించారు. ఈనెల 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతాయని ఇవాళ తెలిపారు. హాల్‌టికెట్లలో ఏవైనా తప్పులుంటే వెంటనే కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.

February 21, 2026 / 11:48 AM IST

మున్సిపల్‌లో ఉర్దూ బోర్డు కోసం డిమాండ్

MBNR: జడ్చర్లలో నూతనంగా నిర్మిస్తున్న మున్సిపల్ కార్యాలయంలో ఉర్దూ భాషలో బోర్డు ఏర్పాటు చేయకపోవడంపై ముస్లిం మైనార్టీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలో ఉర్దూ మాట్లాడే వారు అధికంగా ఉన్నందున రెండో అధికార భాషను విస్మరించడం సరికాదని పేర్కొన్నారు. ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి, మున్సిపల్ ఛైర్‌పర్సన్ వెంటనే ఉర్దూ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

February 21, 2026 / 11:48 AM IST

అంతర్జాతీయ స్థాయి విలువిద్య పోటీల్లో ఆర్టీసీ ఉద్యోగి సత్తా

KNR: యూఏఈలోని అబుదాబిలో ఓపెన్ మాస్టర్ గేమ్స్ విలువిద్య (ఆర్చరీ) పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో ఆర్టీసీ KNR జోనల్ వర్క్ షాప్‌లో మెకానిక్‌గా పనిచేస్తున్న కూన కిషన్ పాల్గొని సత్తా చాటాడు. ఆర్చరీ విభాగంలో 40-50 వయస్సులో 50 మీటర్ల టార్గెట్‌లో కాంస్య పతకం సాధించారు. ఈ సందర్భంగా కూన కిషన్‌ను ఆర్టీసీ వీసీ ఎండి వై.నాగిరెడ్డి బస్ భవన్‌లో శాలువా కప్పి అభినందించారు.

February 21, 2026 / 11:48 AM IST

‘మౌలిక వసతులు కల్పించాలని ఎమ్మెల్యేకు వినతి’

ADB: సోనాల మండలంలోని దేవల్ నాయక్ తాండకు చెందిన గ్రామ పెద్దలు నెరడిగొండలోని MLA నివాసంలో శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గ్రామంలోని అంతర్గత రోడ్లు, డ్రైనేజీ, త్రాగునీరు, పలు మౌలిక వసతులు కల్పించాలని ఎమ్మెల్యేను గ్రామస్తులు కోరారు. గ్రామంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించినట్లు పేర్కొన్నారు.

February 21, 2026 / 11:48 AM IST

కమాండ్ కంట్రోల్ మెయింటెనెన్స్‌కు నిధులు మంజూరు

HYD: బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని ఐకానిక్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమైంది. మూడేళ్ల పాటు ఈ భవనాన్ని అద్దాల మేడలా మెరిపించేందుకు రూ. 8.35 కోట్ల భారీ బడ్జెట్‌ను కేటాయించింది. ఇందులో భాగంగా 24/7 టెక్ సపోర్ట్, మెకనైజ్డ్ క్లీనింగ్, గ్లాస్ ఫెసాడ్ మెయింటెనెన్స్ పనులు చేపట్టనున్నారు. ఈ టవర్ అంతర్జాతీయ స్థాయిలో ఉండేలా అధికారులు రూపొందించారు.

February 21, 2026 / 11:47 AM IST

మున్సిపాలిటీ బాధ్యతలు స్వీకరించిన ఛైర్మన్

SRCL: వేములవాడ మున్సిపాలిటీ నూతన ఛైర్మన్‌గా పుల్కం రాజు శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరై నూతన ఛైర్మన్, వైస్ ఛైర్మన్‌తో పాటు కౌన్సిల్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఛైర్మన్ ప్రమాణస్వీకారం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, రాజు అభిమానులు తెలిపారు.

February 21, 2026 / 11:47 AM IST

మంచినీటి కోసం పైప్ లైన్ ఏర్పాటు

MDK: నిజాంపేట మండల పరిధిలోని షాకత్‌పల్లిలో శనివారం మంచినీటి పైప్‌లైన్ పనులను సర్పంచ్ సునీతబాబు ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ.. రాబోయే వేసవిని దృష్టిలో ఉంచుకుని గ్రామంలో తాగునీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గ్రామస్థులు నీటిని వృథా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని కోరారు.

February 21, 2026 / 11:43 AM IST