హన్మకొండ హంటర్ రోడ్డులోని ఓ జూనియర్ కాలేజీలో ఇంటర్ చదువుతున్న ఓ విద్యార్థిని అదృశ్యమైంది. సుబేదారి సీఐ రంజిత్ కుమార్ వివరాల ప్రకారం.. ఈ నెల 13న షైన్ జూనియర్ కళాశాలలో ఇంటర్ చివరి పరీక్ష రాసింది. అనంతరం స్నేహితురాలితో కలిసి ఇంటికి వెళ్తానని చెప్పి రోడ్డు దాటింది. ఆ తర్వాత ఆమె కనిపించకుండా పోవడంతో తండ్రి విజయ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.