KMR: ఎల్లారెడ్డి MPDO కార్యాలయంలో రేపు ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు MPDO ప్రకాష్ తెలిపారు. మండలంలోని 31 గ్రామాల్లో 2024-25 ఆర్థిక సంవత్సరంలో జరిగిన పనులపై ఈనెల 4వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఆడిట్ బృందాలు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టాయని అన్నారు. ఈ తనిఖీలకు సంబంధించిన నివేదికలపై రేపు ఉ.10 గంటలకు MPDO కార్యక్రమం ఉందన్నారు.