NGKL: పెద్దకొత్తపల్లి మండలంలోని తాళ్ల వెంకటస్వామి కోళ్ల ఫారంలో నాలుగు రోజుల్లో 4,500 కోళ్లు మృతి చెందాయి. దీంతో రైతుకు రూ.10.50 లక్షల భారీ నష్టం వాటిల్లింది. అధికారులు సరైన మార్గదర్శకాలు ఇవ్వడం లేదని, తక్షణమే ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కోళ్లకు వచ్చే వ్యాధులపై అవగాహన సదస్సులు నిర్వహించాలని కోరుతున్నారు.
KNR: ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా చొప్పదండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం హెచ్పీవీ వ్యాక్సినేషన్ క్యాంపు నిర్వహించారు. డాక్టర్ రాజగోపాల్ మాట్లాడుతూ.. 14 నుంచి 15 ఏళ్ల బాలికలకు ఉచితంగా ఈ టీకాలు వేస్తున్నామని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డా. కీర్తన, డా. రమణారావు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
MBNR: నగరంలో ‘డ్రగ్స్ రహిత మహబూబ్ నగర్’ లక్ష్యంతో జిల్లా పోలీసులు నిర్వహించిన అవగాహన సదుస్సులో మేయర్ గుమ్మల మమత శ్రీనివాస్, డెప్యూటీ మేయర్ ఎం. సురేందర్ రెడ్డి పాల్గొన్నారు. మాదకద్రవ్యాల మహమ్మారి నుంచి యువతను, విద్యార్థులను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని వారు పిలుపునిచ్చారు. సమాజాన్ని పట్టి పీడిస్తున్న ఈ వ్యసనానికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ పోరాడాలని కోరారు.
MDK: జిల్లా కలెక్టరేట్ ప్రధాన గేటు వద్ద బస్ షెల్టర్లు, తాగునీటి సౌకర్యం కల్పించాలని రామాయంపేట పట్టణానికి చెందిన ఫిర్యాదుదారుడు ‘చిన్న’ సోమవారం ప్రజావాణిలో విన్నవించారు. గత రెండేళ్లుగా ఈ సమస్యపై విన్నవిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయాడు. షెల్టర్లు లేక దివ్యాంగులు, వృద్ధులు ఎండలో ఇబ్బందులు పడుతున్నారన్నారు. కలెక్టరేట్ స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు.
SRPT: నడిగూడెం మండల పరిధిలోని కాగిత రామచంద్రాపురంలో సోమవారం ఉచిత పశువైద్య శిబిరం నిర్వహించారు. సర్పంచ్ ఉమా పిచ్చయ్య ప్రారంభించిన ఈ శిబిరంలో పశువైద్యాధికారులు డాక్టర్ బీ. అఖిల, డాక్టర్ ఎం. రవికుమార్ మొత్తం 52 పశువులకు గర్భకోశ వ్యాధుల చికిత్స, చూడి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గోపాల మిత్రలు, సిబ్బంది పాల్గొన్నారు.
BHNG: తెలంగాణ రాష్ట్ర దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర కౌన్సిల్ సభ్యురాలు ఇంజ హేమలత ఆధ్వర్యంలో సోమవారం దళిత హక్కుల పోరాట సమితి బొమ్మలరామారం మండల కమిటీ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలోని వివిధ మండల గ్రామాలలో కమిటీలు జరపాలన తెలుపుతూ కరపత్రం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ అధ్యక్షులు పీ.శంకర్, ప్రధాన కార్యదర్శి నరేందర్ పాల్గొన్నారూ
GDWL: జిల్లాలో ఆశా కార్యకర్తలు తమ సమస్యల పరిష్కారం కోసం సోమవారం భారీ ధర్నా నిర్వహించారు. జిల్లా కార్యదర్శి కె. సునీత మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ప్రభుత్వం విస్మరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస వేతనం రూ. 18,000 అమలు చేయాలని, బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. చర్చలకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
SDPT: అంతర్జాతీయ జీరో వేస్ట్ డే సందర్భంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ‘మై భారత్’ కార్యాలయంలో ప్లాస్టిక్ రహిత సమాజంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రోగ్రాం అధికారి జి. కిరణ్ కుమార్ చేతుల మీదుగా అవగాహన కరపత్రాన్ని ఆవిష్కరించారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని పిలుపునిచ్చారు.
KMR: రామారెడ్డి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం HPV వాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించినట్లు మండల వైద్యాధికారి డా.సురేష్ తెలిపారు. 14 సం.రాల వయసున్న బాలికలకు గర్భాశయ క్యాన్సర్ సోకకుండా అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు వ్యాక్సినేషన్ వేయించాలని పేర్కొన్నారు.
WNP: రాజ్యాంగం ద్వారా కల్పించిన పౌర హక్కుల పై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని పెబ్బేర్ మున్సిపల్ ఛైర్మన్ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. సోమవారం పెబ్బేరు మండలంలో పౌర హక్కుల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఛైర్మన్ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. హక్కులకు ఎలాంటి భంగం కలిగినా చట్టపరమైన చర్యలు చేపట్టి హక్కు సాధనకు కృషి చేయాలన్నారు.
HYD: పికెట్ గాంధీ నగర్కు చెందిన ఇందిర, లాలాపేట్కు చెందిన జకారి బాబులకు చికిత్స నిమిత్తం వైద్య ఖర్చులకు ఎమ్మెల్యే శ్రీగణేశ్ను సంప్రదించారు. ప్రభుత్వం ద్వారా వైద్యం చేయించి, చెరో రూ.2 లక్షల చొప్పున LOCలను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వారిరువురూ త్వరగా కోలుకుని మనసారా కోరుకున్నారు.
BDK: వేసవి తీవ్రత దృష్ట్యా మణుగూరు నుంచి హైదరాబాద్ వరకు ఆర్టీసీ ఏసీ బస్సులను నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు. ప్రస్తుతం మణుగూరు నుంచి నాన్-ఏసీ బస్సులు మాత్రమే అందుబాటులో ఉండటంతో ఎండల సమయంలో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ యాజమాన్యం స్పందించి, ప్రయాణికుల సౌకర్యార్థం ఏసీ సర్వీసులను అందుబాటులోకి తేవాలని ప్రయాణికులు కోరుతున్నారు.
WGL: వరంగల్లో కేంద్ర ఉన్నత విద్యాసంస్థల ఆవశ్యకతపై లోక్ సభలో ఎంపీ డాక్టర్ కడియం కావ్య ప్రశ్నించారు. వరంగల్ నియోజకవర్గంలో ఒక్క NIT మాత్రమే ఉందని, NIT వరంగల్కు కేటాయించిన రూ.64.38 కోట్ల నిధులు సరిపోవని, కొత్త కేంద్ర విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలు, నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఎంపీ కడియం కావ్య కోరారు.
BHPL: ఐపీఎల్ మ్యాచ్ల నేపథ్యంలో క్రికెట్, ఆన్లైన్ బెట్టింగ్లకు యువత దూరంగా ఉండాలని ఎస్సై పోచంపల్లి సతీష్ హెచ్చరించారు. బెట్టింగ్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని, దీనివల్ల భవిష్యత్తులో ఉద్యోగ వెరిఫికేషన్లకు ఆటంకం కలుగుతుందని స్పష్టం చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లల ఫోన్ వినియోగంపై నిరంతరం నిఘా ఉంచాలని, వారి భవిష్యత్తును కాపాడుకోవాలని అన్నారు.
VKB: మర్పల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఏటా నిర్వహించే తై బజార్ బహిరంగ వేలం పాట ఇవాళ నిర్వహించారు. గ్రామ పంచాయతీ కార్యాలయ ప్రాంగణంలో సర్పంచ్ రామేశ్వర్, పంచాయతీ కార్యదర్శి లక్ష్మీకాంత్ ఆధ్వర్యంలో నిర్వహించగా, వ్యాపారస్తులు పోటాపోటీగా పాల్గొన్నారు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన కర్నె పెంటయ్య అత్యధికంగా రూ.6,77,000లకు పాడి తై బజార్ ఈ ఏడాది నిర్వహణ హక్కులను దక్కించుకున్నాడు.