WGL: వరంగల్లో కేంద్ర ఉన్నత విద్యాసంస్థల ఆవశ్యకతపై లోక్ సభలో ఎంపీ డాక్టర్ కడియం కావ్య ప్రశ్నించారు. వరంగల్ నియోజకవర్గంలో ఒక్క NIT మాత్రమే ఉందని, NIT వరంగల్కు కేటాయించిన రూ.64.38 కోట్ల నిధులు సరిపోవని, కొత్త కేంద్ర విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలు, నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఎంపీ కడియం కావ్య కోరారు.