బాపట్ల ఏరియా వైద్యశాలలోని సెంటినెల్ సర్వేలెన్స్ కేంద్రాన్ని జిల్లా మలేరియా అధికారి నాగార్జునరావు తనిఖీ చేశారు. డెంగీ నిర్ధారణ పరీక్షల విధానాన్ని పరిశీలించి, రోగుల వివరాలను సమయానికి నమోదు చేయాలని సూచించారు. అనంతరం ఆసుపత్రి అధికారులతో పనితీరుపై సమీక్ష నిర్వహించారు.