MLG: జిల్లాలో బాల కార్మిక నిర్మూలన కోసం ప్రత్యేక బృందాల తనిఖీలు చేపట్టారు. కన్నాయిగూడెం, ఏటూరునాగారం, మంగపేట మండలాల్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు. 14 ఏళ్లలోపు పిల్లలను పనిలో పెట్టొద్దని, 18 లోపు ప్రమాదకర పనులకు నిషేధం అని తెలిపారు. సుమారు 100 మంది రైతులకు నోటీసులు జారీ చేసి అవగాహన కల్పించారు. నియమాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.