NLG: చిట్యాల పట్టణంలో రోడ్డు పనులతో పెరుగుతున్న ప్రమాదాల దృష్ట్యా కీలక ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని మున్సిపల్ ఛైర్మన్, పాలకవర్గానికి సీనియర్ ఉద్యమ నాయకులు పోలేపల్లి సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. ప్రమాదాలకు కారణమైన వాహనాలను గుర్తించలేక బాధితులు ఆర్థికంగా నష్టపోతున్నారని, చోరీల నియంత్రణకు కూడా ఇవి అవసరమని ఆయన పేర్కొన్నారు.