JGL: ప్రజా సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని భీమారం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సింగిరెడ్డి నరేష్ రెడ్డి అన్నారు. రంగాపూర్ గ్రామంలో జరిగిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో ఆయన పాల్గొని లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. పేదలందరికీ సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. సర్పంచ్ కావేరి, ఉప సర్పంచ్ పాల్గొన్నారు.