HYD: ఎన్నో కులాలు, ఎన్నో మతాలు, ఎన్నో భాషలకు నెలవైన ఈ భారతదేశంలో ప్రతి వ్యక్తికి సమానమైన హక్కులున్నాయని షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. వారు మాట్లాడుతూ.. కొంతమంది మానవత్వాన్ని మరచి ఇష్టానుసారంగా సోషల్ మీడియాలో ప్రవర్తిస్తున్నారని, అలాంటి వారిని కట్టడి చేయాలంటే ఇలాంటి కఠినమైన చట్టాలు అవసరమన్నారు. యావత్ రాష్ట్రం ఈ చట్టాన్ని స్వాగతిస్తుందన్నారు