HNK: మధ్యాహ్న భోజన కార్మికులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం రూ.10,000 చెల్లించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాగుల రమేష్ అన్నారు.పెండింగ్లో ఉన్న బిల్లులను విడుదల చేయాలని హానుమకొండ కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. మధ్యాహ్న భోజనం పథకం నిర్వహణకు అవసరమైన గ్యాస్లను అన్ని పాఠశాలలకు ఉచితంగా ఇవ్వాలని రమేష్ కోరారు.