TG: సీట్ల పెంపులో వివక్ష ఉంటే భవిష్యత్తులో రాష్ట్ర బీజేపీ నేతలైన బండి సంజయ్, కిషన్ రెడ్డికు కూడా విలువ ఉండదని, వారికి ఉద్యోగాలు కూడా ఉండవని సీఎం రేవంత్ ఎద్దేవా చేశారు. ఉత్తరాది ఆధిపత్యం పెరిగితే దక్షిణాది నేతలను ఎవరూ గుర్తించరని అన్నారు. దక్షిణాది హక్కుల కోసం బీజేపీ నేతలు నాయకత్వం వహించినా, పోరాడినా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని సీఎం స్పష్టం చేశారు.