అమలాపురంలోని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ వద్ద ఇవాళ నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమానికి 178 ఫిర్యాదులను స్వీరించారని కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఆ సమస్యలను సకాలంలో పరిష్కరించాలని అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు.