BHPL: ఐపీఎల్ మ్యాచ్ల నేపథ్యంలో క్రికెట్, ఆన్లైన్ బెట్టింగ్లకు యువత దూరంగా ఉండాలని ఎస్సై పోచంపల్లి సతీష్ హెచ్చరించారు. బెట్టింగ్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని, దీనివల్ల భవిష్యత్తులో ఉద్యోగ వెరిఫికేషన్లకు ఆటంకం కలుగుతుందని స్పష్టం చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లల ఫోన్ వినియోగంపై నిరంతరం నిఘా ఉంచాలని, వారి భవిష్యత్తును కాపాడుకోవాలని అన్నారు.