భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రభుత్వ ఐటీఐ, అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్లో ఉచిత శిక్షణ కోర్సులు ప్రారంభమయ్యాయి. యువతకు ఉపాధి అవకాశాలు పెంచే లక్ష్యంతో రోబోటిక్ వెల్డింగ్, ఎలక్ట్రిక్ వెహికిల్, CNC మిషిన్, CAD డిజైనింగ్ వంటి కోర్సులు అందిస్తున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.