NGKL: జిల్లా కేంద్రంలో సోమవారం నిర్వహించిన ఎస్టీయూ (STU) సభలో ప్రభుత్వం తీరుపై ఉపాధ్యాయ సంఘం నేతలు మండిపడ్డారు. జీవో 25ను సవరించి, నిలిచిపోయిన ఉపాధ్యాయుల సర్దుబాటు, బదిలీల ప్రక్రియను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర నేత సదానందం గౌడ్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల పెండింగ్ బెనిఫిట్స్ కోసం ప్రభుత్వం నెలకు రూ.5 వేల కోట్లు కేటాయించాలని కోరారు.