రవితేజ కెరీర్లో బ్లాక్బస్టర్ హిట్గా నిలిచిన ‘కృష్ణ’ మే 8న థియేటర్లలో గ్రాండ్గా రీ-రిలీజ్ కానుంది. వి.వి.వినాయక్ దర్శకత్వంలో త్రిష హీరోయిన్గా నటించిన ఈ యాక్షన్ కామెడీ, రవితేజ ఎనర్జీకి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. బ్రహ్మానందంతో వచ్చే కామెడీ సీన్స్ ఇప్పటికీ ఎవర్ గ్రీన్. బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన ఈ మూవీ మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
మలయాళ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో దర్శకుడు జీతూ జోసెఫ్ తెరకెక్కించిన మూవీ ‘దృశ్యం 3’. 2026 మే 21న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రమోషన్స్లో భాగంగా ఈ మూవీ టీజర్ రిలీజ్ డేట్ వచ్చేసింది. ఏప్రిల్ 29న సాయంత్రం 5 గంటలకు టీజర్ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తన పెద్ద కుమారుడు యాత్ర సినీ అరంగేట్రంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 16 ఏళ్లకే తాను బాధ్యతలతో ఇండస్ట్రీకి వచ్చానని, కానీ 19 ఏళ్ల యాత్ర తనకు ఇంకా చిన్నపిల్లాడిలానే కనిపిస్తాడని పేర్కొన్నాడు. యాత్ర భవిష్యత్తులో నటుడవుతాడా లేదా అనేది ఇప్పుడే చెప్పలేనని, అది తన ఇష్టమని స్పష్టం చేశాడు. ప్రస్తుతం ధనుష్ నటించిన మూవీ ‘కర’ విడుదలకు సిద్ధంగా ఉంది.
ఫేక్ న్యూస్, పెయిడ్ PRపై నటి ప్రీతి జింటా ఆగ్రహం వ్యక్తం చేసింది. తాను రూ.18 కోట్ల అప్పు తీసుకున్నాననే వార్తల్లో నిజం లేదని, కొందరు కావాలనే ఇలాంటి పుకార్లను ప్రచారం చేస్తున్నారని స్పష్టం చేసింది. తాను పెయిడ్ మీడియాను ప్రోత్సహించనని, సోషల్ మీడియా ద్వారా నేరుగా అభిమానులతో టచ్లో ఉంటానని వెల్లడించింది. లైకులు, ఫాలోవర్లను కొనడం వ్యాపారంగా మారిందని అసహనం వ్యక్తం చేసింది.
బాలీవుడ్ నటుడు భరత్ కపూర్(80) గుండెపోటుతో కన్నుమూశారు. ముంబైలోని ఓ ఆస్పత్రిలో నిన్న సాయంత్రం తుదిశ్వాస విడిచారు. 1970లో నట జీవితాన్ని ప్రారంభించిన ఆయన ‘భాగ్య విధాత’, ‘పరంపర’ వంటి సీరియళ్లు, దేశ్ పరదేశ్, నూరీ, రామ్ బలరామ్, లవ్ స్టోరీ, ఆఖ్రీ రాస్తా, రామ్ శాస్త్ర, సాజన్ చలే ససురాల్ వంటి 80కి పైగా సినిమాల్లో నటించారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
నాగార్జున, రా. కార్తీక్ కాంబోలో ‘కింగ్ 100’ మూవీ తెరకెక్కుతోంది. ఈ మూవీలో టబు కీలక పాత్రలో నటించబోతున్నట్లు కథనాలు వచ్చాయి. అయితే, తాజాగా వీటిపై టబు స్పందించింది. తాను ఈ సినిమాలో నటిస్తున్నట్లు స్పష్టం చేసింది. దాదాపు 28 ఏళ్ల విరామం తర్వాత నాగ్తో ఆమె కలిసి నటిస్తుండటంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. చివరిగా వీరిద్దరూ కలిసి ‘ఆవిడ మా ఆవిడే’ చిత్రంలో నటించారు.
దర్శకుడు లోకేష్ కనగరాజ్ హీరోగా పరిచయమవుతున్న ‘DC’ మూవీ షూటింగ్ పూర్తయింది. అరుణ్ మథేశ్వరన్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ రివేంజ్ డ్రామాలో లోకేష్ దేవదాస్గా, వామికా గబ్బి చంద్రగా నటిస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. 2026 వేసవిలో ఈ క్రైమ్ యాక్షన్ మూవీ విడుదల కానుంది.
సాయి పల్లవి ‘ఏక్ దిన్’ చిత్రంతో బాలీవుడ్కు పరిచయం కానుంది. మే 1న రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రమోషన్స్లో ఆమె మాట్లాడుతూ.. గొప్ప ప్రతిభావంతులతో పనిచేయడం తన అదృష్టమని తెలిపింది. సినిమా చూసి అమీర్ ఖాన్ ఎమోషనల్ అయ్యారని, తాను కూడా కన్నీళ్లు ఆపుకున్నానని చెప్పింది. అందరి ముందు భావోద్వేగాన్ని ప్రదర్శించడానికి ఎంతో ధైర్యం కావాలని తెలిపింది.
బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్ముఖ్ స్వీయ దర్శకత్వంలో నటించిన మూవీ ‘రాజా శివాజీ’. ఈ సినిమా 2026 మే 1న భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమైనట్లు మేకర్స్ ప్రకటించారు. మరాఠా యోధుడు, ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా రూపొందింది.
నటి సంయుక్త మీనన్ ప్రధాన పాత్రలో యోగేష్ KMC దర్శకత్వంలో రాబోతున్న మూవీ ‘ది బ్లాక్ గోల్డ్’. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన లాస్ట్ షెడ్యూల్ పూర్తయినట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు పోస్టర్ షేర్ చేశారు. 2026 సమ్మర్లో ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. ఇక ఈ సినిమాకు సామ్ CS మ్యూజిక్ అందిస్తున్నాడు.
నటి మెహ్రీన్ అర్ష్ ఔలఖ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే అతని గురించి నెటిజన్లు ఆరా తీస్తున్నారు. అతని ఇన్స్టా ఖాతా ప్రైవేట్లో ఉండగా, కేవలం 530 మంది ఫాలోవర్లు ఉన్నారు. బయోలో కార్స్, ట్రావెల్స్, స్పోర్ట్స్ అని ఉండటంతో అతను ఒక వ్యాపారవేత్త లేదా క్రీడా ప్రేమికుడు అయి ఉండవచ్చని అభిమానులు భావిస్తున్నారు.
మనోజ్ బాజ్పాయ్ ప్రధాన పాత్రలో చిన్మయ్ దీపక్ మాండ్లేకర్ దర్శకత్వంలో రాబోతున్న మూవీ ‘గవర్నర్: ద సైలెంట్ సేవియర్’. తాజాగా ఈ మూవీ నుంచి మనోజ్ బాజ్పాయ్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. విపుల్ అమృత్ లాల్ షా నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అదా శర్మ, మధు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ మూవీ సమ్మర్ కానుకగా 2026, జూన్ 12న విడుదల కానుంది.
సూర్య హీరోగా వస్తున్న ‘కరుప్పు’ మూవీ పలు వాయిదాల తర్వాత ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. అయితే ప్రమోషనల్ పోస్టర్లలో రిలీజ్ డేట్ లేకపోవడంపై దర్శకుడు ఆర్జే బాలాజీ క్లారిటీ ఇచ్చాడు. సెన్సార్ పరంగా ఇబ్బందులు రాకూడదనే ఉద్దేశపూర్వకంగా తేదీని ప్రకటించలేదని, అయితే మూవీని 2026 మే 14న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నామని తెలిపాడు. ఫ్యాన్స్ సెలబ్రేషన్స్కు రెడీగా ఉండాలని చెప్పాడు.
విజయ్ దేవరకొండ, నాని కాంబోలో మల్టీస్టారర్ రాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వీరిద్దరూ తమ మూవీలతో బిజీగా ఉన్నా.. ఒక మంచి కథ కోసం ఎదురుచూస్తున్నారట. ఇప్పటికే భారీ బడ్జెట్తో వారి ఇమేజ్కి తగ్గట్టుగా పవర్ఫుల్ స్క్రిప్ట్ సిద్ధమవుతున్నట్లు టాక్. ఇద్దరి పాత్రలకు ఈక్వల్ ప్రయారిటీ ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్నట్లు సమాచారం.