తన స్నేహితుడు, సంగీత దర్శకుడు అనిరుధ్ గురించి దర్శకుడు విఘ్నేష్ శివన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ‘నేను రౌడీనే మూవీ షూటింగ్ కోసం నేను పుదుచ్చేరి వెళ్లాలి. అప్పుడు నా దగ్గర బస్సు టికెట్ కోసం రూ.250 మాత్రమే ఉన్నాయి. డబ్బుల్లేక నేను ఇబ్బంది పడుతుంటే, అనిరుధ్ నా బ్యాగులో రూ.50,000 దాచి సాయం చేశాడు. ఆ రోజు అతను లేకపోతే ఇవాళ దర్శకుడిగా ఉండేవాడిని కాదు’ అని అన్నాడు.
బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ తన లక్కీఛార్మ్ అని హీరోయిన్ మృణాల్ ఠాకూర్ చెప్పింది. ఆయన వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నట్లు వెల్లడించింది. తన కెరీర్ మొదట్లో రణ్వీర్తో కలిసి చేసిన యాడ్ను చూసి దర్శకులు తనకు సినీ అవకాశాలు ఇచ్చారని పేర్కొంది. అందుకే తన కెరీర్ క్రెడిట్ ఆయనకే ఇస్తానని తెలిపింది. రణ్వీర్ ఎన్నోసార్లు సాయం చేశాడని చెప్పింది.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాలో మృణాల్ ఠాకూర్ స్పెషల్ సాంగ్ చేయనున్నట్లు వార్తలొస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుంచి ఆమె తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఆమె స్థానంలోకి మానస శర్మ వచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ మేరకు మేకర్స్ మానసను సంప్రదించగా.. ఆమె ఓకే చెప్పినట్లు సమాచారం. అయితే ఈ సాంగ్ కోసం దర్శకుడు బుచ్చిబాబు అదిరిపోయే స్టెప్పులు ప్లాన్ చేశాడట.
బాలీవుడ్ నటి జరీన్ ఖాన్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తల్లి పర్వీన్ ఖాన్ (65) అనారోగ్యంతో ఈరోజు ఉదయం కన్నుమూసింది. గత కొంతకాలంగా ఆమె ఆర్గాన్ ఫెయిల్యూర్తో బాధపడుతుంది. తల్లి మరణంతో జరీన్ ఖాన్ పుట్టెడు దుఃఖంలో మునిగిపోయింది. ఈ వార్త తెలిసిన సినీ ప్రముఖులు, అభిమానులు ఆమెకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ సోషల్ మీడియాలో సంతాపం ప్రకటిస్తున్నారు.
అంజీర పండ్లతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటిలోని పోషకాలు అనేక సమస్యలకు చెక్ పెడతాయి. వీటిలో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడి మలబద్ధకం సమస్య తగ్గుతుంది. పొటాషియం రక్తపోటును నియంత్రించి గుండెను పదిలంగా ఉంచుతుంది. కాల్షియం పుష్కలంగా ఉండటంతో ఎముకలు, కీళ్ల నొప్పులు తగ్గుతాయి. వీటిని తింటే బరువు నియంత్రణలో ఉంటుంది. రక్తహీనత సమస్య తగ్గుతుంది.
రణ్వీర్ నటించిన ‘ధురంధర్ 2’ విజయంపై దీపికా పదుకొణె స్పందించలేదంటూ విమర్శలు వస్తున్నాయి. వాటికి దీపికా కౌంటర్ ఇచ్చింది. ‘మీ అందరికంటే ముందే నేను ఆ మూవీ చూశాను. ఆ విషయం మీకు తెలీదు. ఇప్పుడు చెప్పండి ఎవరు ఎవరిని విమర్శించాలి?’ అని ప్రశ్నించింది. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టనంత మాత్రాన మద్దతు లేదనుకోవడం సరికాదని, సైలెంట్గానే తన భర్తకు మద్దతు తెలిపానని పేర్కొంది.
‘లిటిల్ హార్ట్స్’ సినిమాతో భారీ విజయం అందుకున్న దర్శకుడు సాయి మార్తాండ్ తన తదుపరి ప్రాజెక్టుపై అప్డేట్ ఇచ్చాడు. హీరో అడివి శేష్తో క్రేజీ ప్రాజెక్టు చేయనున్నట్లు ప్రకటించాడు. ‘గూఢచారి 2’ పూర్తయ్యాక ఈ సినిమా స్టార్ట్ అవుతుందని, ఇది ఒక లవ్ స్టోరీ అని తెలిపాడు. అయితే ఈ సినిమాతో జగపతి బాబు, సునీల్ నిర్మాతలుగా మారనున్నారు.
అల్లు అర్జున్, అట్లీ కాంబోలో రాబోతున్న మూవీ నుంచి అప్డేట్ వచ్చేసింది. ఇవాళ బన్నీ బర్త్ డే సందర్భంగా మేకర్స్.. ఆయనకు విషెస్ చెబుతూ మూవీ టైటిల్ను ప్రకటించారు. దీనికి ‘రాక’ అనే టైటిల్ ఖరారు చేసినట్లు తెలుపుతూ పోస్టర్ షేర్ చేశారు. ఈ పోస్టర్లో బన్నీ మునుపెన్నడూ చూడని విధంగా చాలా డిఫరెంట్ అండ్ మాస్ లుక్లో కనిపిస్తూ సోషల్ మీడియాను ఊపేస్తున్నాడు.
నటి కృతి శెట్టి తాజా ఇంటర్వ్యూలో తన పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. తనకు కొన్నేళ్ల క్రితమే బ్రేకప్ అయ్యిందని, ఆ విషయం తన తల్లికి కూడా తెలుసని క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం తాను సింగిల్గానే ఉన్నానని తెలిపింది. అలాగే సోషల్ మీడియాలో వచ్చే నెగెటివిటీని తాను అస్సలు సహించనని, అసభ్యంగా ప్రవర్తించే వారిని వెంటనే బ్లాక్ చేస్తానని వెల్లడించింది.
ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ మూవీ షూటింగ్ ఆగిపోయిందని, హీరో లుక్ బాలేక సీన్లు తొలగించారని వస్తున్న వార్తలపై మైత్రీ మూవీ మేకర్స్ స్పందించింది. ఆ పుకార్లలో నిజం లేదని, కేవలం చిన్న విరామం మాత్రమేనని స్పష్టం చేసింది. సినిమా పక్కా ప్లానింగ్తోనే జరుగుతోందని, అధికారిక సమాచారం వచ్చే వరకు ఇలాంటి వదంతులను నమ్మవద్దని క్లారిటీ ఇచ్చింది.
అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మూవీ 2026 జూన్ 26న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా మరోసారి వాయిదా పడనున్నట్లు తెలుస్తోంది. అదే జూన్లో రామ్ చరణ్ ‘పెద్ది’ రిలీజ్ కానున్నట్లు వార్తలొస్తుండటంతో.. బాక్సాఫీస్ క్లాష్ను తప్పించుకోవడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కాంబోలో రాబోయే మూవీపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే, 2027 వేసవి నాటికి ఈ చిత్ర పనులన్నీ పూర్తి చేయడం పూర్తి చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం సినిమాలో ఉండే విపరీతమైన గ్రాఫిక్స్, VFX వర్క్. ఈ భారీ విజువల్ ఎఫెక్ట్స్ పనుల వల్లే షూటింగ్ సకాలంలో ముగించడం కష్టమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
విజయ్ దేవరకొండ ప్రస్తుతం ‘రణబాలి’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ ఫేమ్ దర్శకుడు అభిషన్ జీవింత్తో ఆయన సినిమా చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అభిషన్ చెప్పిన కథ నచ్చడంతో విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. కాగా, త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు టాక్.
దర్శకుడు అనిల్ రావిపూడి యానిమేషన్ విభాగంలోకి అడుగుపెట్టబోతున్నాడట. రామాయణ గాథను యానిమేటెడ్ వెర్షన్లో తెరకెక్కించేందుకు KVN ప్రొడక్షన్స్ ప్లాన్ చేస్తోంది. ఆధునిక సాంకేతికతతో, భారీ బడ్జెట్తో రూపొందనున్న ఈ మూవీకి అనిల్ దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది. వరుస హిట్లతో ఉన్న ఆయనకు ఇది విభిన్న ప్రయత్నమని సినీ వర్గాలు తెలిపాయి.
జూ.ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబోలో రానున్న ‘డ్రాగన్’ మూవీ షూటింగ్కు తాత్కాలిక బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు తీసిన సీన్లలో ఎన్టీఆర్ లుక్పై దర్శకుడు సంతృప్తిగా లేకపోవడమే దీనికి కారణమని సమాచారం. పాత్రకు మరింత పవర్ఫుల్ లుక్ ఇచ్చేందుకు తారక్ తన ఫిజిక్, స్టైల్ మార్చుకోనున్నాడట. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.