బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న భారీ చిత్రం ‘పెద్ది’ విడుదలపై క్లారిటీ వచ్చేసింది. తాజాగా జరిగిన ధనుష్ ‘కర’ మూవీ ఈవెంట్లో బుచ్చిబాబు మాట్లాడుతూ.. ప్రస్తుతం సినిమా పనులు వేగంగా జరుగుతున్నాయని, జూన్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపాడు. ప్రస్తుతం స్పెషల్ సాంగ్ చిత్రీకరణ జరుగుతోందని సమాచారం.
‘ఏక్ దిన్’ సినిమాతో బాలీవుడ్లోకి అడుగుపెడుతున్న సాయిపల్లవి.. ప్రమోషన్లలో బిజీగా మారింది. తాజాగా, ముంబైలో జరిగిన కార్యక్రమంలో హీరో జునైద్ ఖాన్(ఆమిర్ ఖాన్ కుమారుడు), ఆమిర్ ఖాన్తో కలిసి ఆమె సందడి చేశారు. ఇటీవల విడుదలైన ట్రైలర్కు మంచి స్పందన లభిస్తోంది. జపనీస్ చిత్రం ‘లవ్ లెటర్’ ఆధారంగా రూపొందిన ఈ మూవీ మే 1న థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది.
టాలీవుడ్ హీరోయిన్ మెహ్రీన్ వివాహ బంధంలోకి అడుగు పెట్టింది. పారిశ్రామికవేత్త అర్ష్ ఔలఖ్తో తన వివాహం జరిగినట్లు ఆమె ఇన్స్టా వేదికగా వెల్లడించింది. చండీగఢ్లో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో అభిమానులు, సినీ ప్రముఖులు ఈ నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
సీనియర్ నటి టబు మేనల్లుడు, ఫరా నాజ్-విందు దారా సింగ్ల కుమారుడు ఫతే రంధవా త్వరలో హీరోగా అరంగేట్రం చేయనున్నాడు. లెజెండరీ రెజ్లర్ దారా సింగ్ మనవడైన ఫతే, తన తాత బయోపిక్ ద్వారా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నట్లు సమాచారం. రంధవా లాంచ్ బాధ్యతలను టబు స్వయంగా పర్యవేక్షిస్తుంది. తాజాగా వీరి సెల్ఫీలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తన సినిమాలు తెరకెక్కించడంపై ధనుష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం రాజ్కుమార్ పెరియసామి సినిమాతో పాటు ముగ్గురు దర్శకుల ప్రాజెక్టులు, ‘వడచెన్నై 2’ పూర్తి చేయాల్సి ఉందని తెలిపాడు. ఇవి పూర్తయ్యాకే మళ్లీ మెగా ఫోన్ పడతానని స్పష్టం చేశాడు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా ఆయన ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీ తీయనున్నారనే వార్తల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
బోయపాటి శ్రీను, క్లాస్ హీరో కార్తీ కాంబోలో సినిమా రాబోతుందనే వార్త ఇప్పుడు ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్గా మారింది. మాస్ పల్స్ తెలిసిన బోయపాటి, వైవిధ్యమైన నటనతో ఆకట్టుకునే కార్తీ కోసం ఇప్పటికే ఒక పవర్ఫుల్ కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. క్లాస్, మాస్ ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉన్న వీరిద్దరూ కలిస్తే వెండితెరపై గూస్బంప్స్ ఖాయమని సినీ వర్గాలు తెలిపాయి.
‘కర’ ప్రమోషన్స్లో ధనుష్ తన కెరీర్ టర్నింగ్ పాయింట్ ‘పొల్లాధవన్’ను గుర్తుచేసుకున్నాడు. అప్పట్లో తన బాడీ ఫిట్నెస్పై వచ్చిన విమర్శలను ఛాలెంజ్గా తీసుకుని, ఆ సినిమా కోసం సిక్స్ప్యాక్ సాధించినట్లు తెలిపాడు. తన శరీరాకృతికి ప్రేక్షకుల నుంచి తొలిసారి ప్రశంసలు దక్కడం మర్చిపోలేని అనుభూతి అని ఆనందం వ్యక్తం చేశాడు. ఆ క్షణాలు తనకెంతో స్పెషల్ అని అన్నాడు.
సత్యదేవ్, దర్శకుడు వెంకటేష్ మహా కాంబోలో వస్తున్న మూవీ ‘రావు బహదూర్’. ఈ సైకలాజికల్ డ్రామా రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. ఈ చిత్రాన్ని 2026 జూన్ 5న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు పోస్టర్ షేర్ చేశారు. ఒక విభిన్నమైన కథాంశంతో వస్తున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.
తన తదుపరి చిత్రాలపై నటుడు అడివి శేష్ ఆసక్తికర అప్డేట్స్ ఇచ్చారు. ‘గూఢచారి 2’ త్వరలో అద్భుతమైన కంటెంట్తో రాబోతోందని ధీమా వ్యక్తం చేశాడు. అలాగే, ‘హిట్ 4’ త్వరలోనే పట్టాలెక్కే అవకాశం ఉందని, ప్రస్తుతం దర్శకుడు శైలేష్ కొలను స్క్రిప్ట్ పనుల్లో ఉన్నారని తెలిపాడు. మంచి కథ కుదిరితే మల్టీస్టారర్ చిత్రాల్లో నటించేందుకు కూడా తాను సిద్ధమని వెల్లడించాడు.
జూ.ఎన్టీఆర్, దర్శకుడు సురేందర్ రెడ్డి కాంబోలో తెరకెక్కిన ‘ఊసరవెల్లి’ మూవీ మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తారక్ బర్త్ డే సందర్భంగా మే 20న ఈ మూవీకి సంబంధించిన స్పెషల్ షోలను ప్రదర్శించనున్నారు. ఈ మేరకు పోస్టర్ విడుదలైంది. ఇక తమన్నా కథానాయికగా నటించిన ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు.
తమిళ హీరో విజయ్ దళపతి, దర్శకుడు H. వినోద్ కాంబోలో రూపొందిన మూవీ ‘జన నాయగన్’. జనవరి 9, 2026న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా సెన్సార్ కారణంగా వాయిదా పడింది. తాజాగా ఈ సినిమా విడుదలపై క్రేజీ న్యూస్ ఒకటి బయటకొచ్చింది. 2026 మే 7 లేదా మే 14న దీన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.
‘ది కేరళ స్టోరీ’కి సీక్వెల్గా వచ్చిన ‘ది కేరళ స్టోరీ 2’ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. తాజాగా ఈ సినిమా OTT రిలీజ్ తేదీ మారింది. మొదట ఈ చిత్రం మే 8 నుంచి జీ 5లో స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటన రాగా.. తాజాగా మే 1 నుంచి అందుబాటులోకి రానుంది. లవ్ జిహాద్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాను కామాఖ్యా నారాయణ్ సింగ్ తెరకెక్కించాడు.
తమిళ నిర్మాతల మండలి సంచలన నిర్ణయాలు తీసుకుంది. మే 2న తమిళనాడులో సినిమా షూటింగ్ల బంద్కు పిలుపునిచ్చింది. ఇకపై నటీనటులకు పారితోషకం బదులు లాభాల్లో వాటా(Revenue Share) ఇవ్వాలని ప్రతిపాదించింది. టాలీవుడ్ తరహాలో నిర్మాణాల్లో మార్పులు తేవాలని నిర్ణయించింది. కొన్ని ఓటీటీ సంస్థలు నిర్మాతలను బెదిరిస్తున్నాయని మండలి తీవ్ర ఆరోపణలు చేసింది.
బిగ్ బాస్ ఫేమ్ అషురెడ్డి వివాదంపై ఆమె తండ్రి కొయ్య వెంకటకృష్ణారెడ్డి స్పందించారు. అషురెడ్డి అమాయకురాలని, తనకేమీ తెలియదని, అన్నీ ఆమె తల్లే చూసుకుంటుందని తెలిపారు. ధర్మేంద్ర కుటుంబానికి కాల్ మనీ కేసుతో సంబంధం ఉందని, ఆయన విడాకుల వ్యవహారం వల్ల వారితో సంబంధం వద్దనుకున్నామని పేర్కొన్నారు. ఆధారాలు లేకుండా అభియోగాలు చేయవద్దని, ఆర్థిక లావాదేవీల గురించి తనకు తెలియదని స్పష్టం చేశారు.