భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ‘ధురందర్ 2’ సినిమాపై ప్రశంసల జల్లు కురిపించాడు. ఈ మూవీ తన జీవితంలోనే అత్యుత్తమ సినిమాటిక్ అనుభూతిని ఇచ్చిందని SM వేదికగా వెల్లడించాడు. ‘దర్శకుడు ఆదిత్య ధర్ జీనియస్. రణవీర్ సింగ్ నటన అద్భుతానికి మించి ఉంది. భారత్లో ఇలాంటి అద్భుతాన్ని నేను ముందెన్నడూ చూడలేదు. సినిమా చూస్తున్నంత సేపు భావోద్వేగానికి గురయ్యాను’ అని రాసుకొచ్చాడు.
కోలీవుడ్ హీరో విష్ణు విశాల్, మమితా బైజు నటిస్తున్న చిత్రం ‘ఇరందు వానం’. రామ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ రొమాంటిక్ ఫాంటసీ మూవీ వేసవి సందర్భంగా థియేటర్లలోకి రానుంది. ఈ విషయాన్ని తెలుపుతూ SMలో చిత్ర బృందం పోస్టర్ షేర్ చేసింది. ఆ పోస్ట్కు ‘నీకు తెలుసు కదా.. అది కేవలం ఒక ఆకాశం మాత్రమే కాదని’ అనే కామెంట్ను జోడించింది.
స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్ తన ప్రేమ గురించి కీలక వ్యాఖ్యలు చేసింది. గతంలో శాంతను హజారికాతో ప్రేమలో ఉన్న ఈ భామ, ఇటీవల అతనితో విడిపోయినట్లు స్పష్టం చేసింది. తాను ఇప్పటివరకు ఆరు సార్లు ప్రేమలో పడ్డానని, ప్రతిసారీ ఆ బంధాలు చేదు అనుభవాలనే మిగిల్చాయని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం తన దృష్టి మొత్తం నటనపైనే ఉందని, ఇకపై సింగిల్గానే ఉండాలనుకుంటున్నట్లు వెల్లడించింది.
స్టార్ హీరోయిన్ త్రిష సినిమాలకు గుడ్ బై చెప్పనుందనే వార్తలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. దీనిపై దర్శకుడు చిత్ర లక్ష్మణన్ స్పందిస్తూ.. త్రిష ఇకపై నటించాలని అనుకోవడం లేదని, కొత్త అవకాశాలను కూడా తిరస్కరిస్తున్నట్లు కొందరు నిర్మాతలు తెలిపారని పేర్కొన్నాడు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే, త్రిష టీమ్ నుంచి దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
బ్రేకప్ గురించి హీరో అడవి శేష్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘నాకు బ్రేకప్ కథలంటే చాలా ఇష్టం. నా జీవితంలోనూ అలాంటి బ్రేకప్ కథలున్నాయి. 19ఏళ్ల వయసులో తొలిసారి ప్రేమలో విఫలమైనప్పుడు నాకేం అర్థం కాలేదు. దాని నుంచి కోలుకోవడానికి పదేళ్లు పట్టింది. నేను రాసే ప్రతి కథలోనూ నా బ్రేకప్స్ ప్రభావం కచ్చితంగా కనిపిస్తుంది’ అని చెప్పుకొచ్చాడు.
హీరో నాగ శౌర్య, రామ్ దేశినా దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’. తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో నాగ శౌర్య మాట్లాడుతూ.. హారిస్ జయరాజ్తో పని చేయాలన్న తన కల ఈ సినిమాతో నెరవేరిందని తెలిపాడు. సముద్రఖని, సాయికుమార్ వంటి నటులతో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నాడు. ఈ మూవీ APR 17న విడుదల కానుంది.
దర్శకుడు ఇంతియాజ్ అలీ, దిల్జీత్ దోసాంజ్ కాంబినేషన్లో వస్తున్న సరికొత్త చిత్రం ‘మై వాపస్ ఆఊంగా’. జూన్ 12న విడుదల కానున్న ఈ సినిమా గురించి ఇంతియాజ్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఇది 1947 నాటి దేశ విభజన నేపథ్యంలో సాగే కథ అయినప్పటికీ, నేటి యువత దృష్టికోణంలో తొలి యవ్వనపు ప్రేమను, జ్ఞాపకాలను చూపిస్తుందని తెలిపాడు. దిల్జీత్ ఈ పాత్రకు సరిగ్గా సరిపోతారని పేర్కొన్నాడు.
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ IPL మ్యాచ్కు హాజరయ్యాడు. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా పంజాబ్, కోల్కతా మధ్య జరుగుతున్న పోరును ఆయన తన కుమార్తె సుహానాతో కలిసి వీక్షించాడు. KKR యజమాని అయిన షారుఖ్.. తన జట్టు క్యాప్ను ధరించి గ్యాలరీ నుంచి ఆటగాళ్లను ఉత్సాహపరుస్తూ కనిపించాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
KKR ఆల్రౌండర్ కామెరూన్ గ్రీన్ ఈ సీజన్ IPLలో ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాడు. ఆడిన మూడు మ్యాచ్ల్లో కలిపి కేవలం 24 పరుగులు (18, 2, 4) మాత్రమే చేశాడు. రూ.25.20 కోట్ల ధర పెట్టి కొనుగోలు చేసినప్పటికీ, గ్రీన్ విఫలమవడంతో SMలో అభిమానులు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఈ మాత్రం దానికి ఇంత డబ్బు పెట్టి కొనడం దండగంటూ నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు.
ధనుష్ హీరోగా, విఘ్నేష్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కారా’. ఈ సినిమాలో మమితా బైజు కథానాయికగా నటిస్తోంది. ఈనెల 30న ఈ చిత్రం విడుదల కాబోతుండటంతో, మూవీ యూనిట్ ప్రమోషన్స్లో వేగం పెంచింది. ఇప్పటికే ఫస్ట్ సింగిల్ను విడుదల చేసిన మేకర్స్, ఈ నెల 8న రెండో పాటను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రానికి జి.వి. ప్రకాష్ సంగీతాన్ని అందిస్తున్నాడు.
అల్లు అర్జున్ హీరోగా, అట్లీ దర్శకత్వంలో ‘AA22’ అనే వర్కింగ్ టైటిల్తో ఓ చిత్రం తెరకెక్కుతోంది. రూ.800 కోట్ల బడ్జెట్తో రూపొందిస్తున్న ఈ సినిమా టైటిల్ను రేపు ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. అలాగే, 8న బన్నీ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ను కూడా విడుదల చేయబోతున్నట్లు సమాచారం. కాగా, వచ్చే ఏడాది వేసవి నాటికి షూటింగ్ పూర్తి కానుంది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ముందు ‘TN 2026’ సినిమాపై దుమారం రేగుతోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్లో TVK అధినేత విజయ్ తరహా వేషధారణ, ‘మొహానికి రంగు వేసుకునే వాడికి రాజకీయాలు ఎందుకు?’ అనే డైలాగుతో పాటు, ఓ ప్రముఖ నటితో సన్నిహితంగా ఉన్న దృశ్యాలు వివాదాస్పదంగా మారాయి. విజయ్ని టార్గెట్ చేస్తూ ఈ మూవీని తీశారని TVK నేతలు ఆరోపిస్తున్నారు. ఈ మూవీ ఈనెల 10న విడుదల కానుంది.
నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబోలో వస్తున్న సినిమా ‘ది ప్యారడైజ్’. ఆగస్టు 21, 2026న రిలీజ్ కావాల్సిన ఈ మూవీ మరోసారి వాయిదా పడనున్నట్లు టాక్. క్వాలిటీ కోసం మేకర్స్ ఈ మూవీని డిసెంబర్కు మార్చాలని చూస్తున్నారట. ఒకవేళ ఇదే నిజమైతే, క్రిస్మస్ బరిలో ఉన్న ఇతర పెద్ద సినిమాలకు నాని గట్టి పోటీ ఇవ్వడం ఖాయం. ‘దసరా’ వంటి హిట్ తర్వాత వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, కళ్యాణ్ రామ్ కాంబోలో ఓ భారీ మల్టీస్టారర్ రూపుదిద్దుకుంటోంది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ మూవీపై తాజాగా క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ సరసన ‘ఉప్పెన’ బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్గా నటిస్తున్నట్లు అనిల్ రావిపూడి స్వయంగా తెలిపాడు. అయితే వెంకటేష్ పక్కన ఎవరు నటించనున్నారనే సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది.
సంతోష్ శోభన్, ‘స్వాతిముత్యం’ ఫేమ్ లక్ష్మణ్ కె కృష్ణ కాంబోలో మూవీ రాబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి ‘సత్తిబాబు పరలోకయాత్ర’ అనే టైటిల్ను ఖరారు చేసినట్లు సమాచారం. UV క్రియేషన్స్, AR ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించే ఈ చిత్రం ఫుల్ లెన్త్ కామెడీ ఎంటర్టైనర్గా ఉండనుందట. ఇప్పటికే కథ లాక్ అవ్వగా, త్వరలోనే ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన రాబోతున్నట్లు టాక్.