ప్రముఖ అమెరికన్ పాప్ సింగర్ నీల్ సెడకా (86) కన్నుమూశారు. ‘బ్రేకింగ్ అప్ ఈజ్ హార్డ్ టు డూ’, ‘క్యాలెండర్ గర్ల్’ వంటి హిట్లతో ఆయన ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందారు. ఆరు దశాబ్దాల కెరీర్లో మూడు బిల్బోర్డ్ నంబర్ 1 హిట్లు సాధించిన ఆయన, 1983లో ‘సాంగ్ రైటర్స్ హాల్ ఆఫ్ ఫేమ్’లో చోటు దక్కించుకున్నారు. ఆయన మృతి సంగీత ప్రపంచానికి తీరని లోటు.
రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో వస్తున్న భారీ చిత్రం ‘పెద్ది’ ఓవర్సీస్ డీల్ ఖరారైంది. నార్త్ అమెరికా హక్కులను ప్రముఖ సంస్థ ‘ప్రత్యంగిరా సినిమాస్’ సొంతం చేసుకుంది. ఇటీవల ‘OG’ని డిస్ట్రిబ్యూట్ చేసిన వీరు, ఈ సినిమాను ఏప్రిల్ 30న రిలీజ్ చేయనున్నారు. యూఎస్లో ఏప్రిల్ 29 నుంచే ప్రీమియర్స్ ప్రారంభం కానున్నాయి. మెగా ఫ్యాన్స్లో ఈ అప్డేట్ జోష్ నింపింది.
వెంకటేష్, కళ్యాణ్ రామ్ కాంబోలో దర్శకుడు అనిల్ రావిపూడి మూవీ చేయనున్నాడు. తాజాగా ఈ ప్రాజెక్టుపై అనిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నట్లు తెలిపాడు. ఇందులో యాక్షన్ ఉంటుందని, ప్రేక్షకులకు తన నుంచి కావాల్సిన ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుందని చెప్పాడు. 2027 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు మంచి ప్యాకేజ్తో రాబోతున్నట్లు తెలిపాడు.
టాలీవుడ్ అందాల భామ మీనాక్షి చౌదరి బాలీవుడ్ ఆఫర్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. హిందీ స్టార్ హీరో అక్షయ్ కుమార్ సరసన ఆమె నటించనున్నట్లు సమాచారం. 2006లో వచ్చిన అక్షయ్ సూపర్ హిట్ కామెడీ థ్రిల్లర్ ‘భాగమ్ భాగ్’ సీక్వెల్లో ఆమెను కథానాయికగా ఎంపిక చేసినట్లు బాలీవుడ్ వర్గాల టాక్. ప్రస్తుతం ఆమె నాగచైతన్య ‘వృషకర్మ’ చిత్రంలో బిజీగా ఉంది.
తమిళ దర్శకుడు రా. కార్తీక్తో అక్కినేని నాగార్జున తన 100వ మూవీ చేస్తున్నారు. ‘కింగ్ 100’ అనే వర్కింగ్ టైటిల్తో తెరకెక్కుతోన్న ఈ మూవీ కొత్త షెడ్యూల్ మైసూర్లో స్టార్ట్ అయినట్లు తెలుస్తోంది. దాదాపు 2 వారాలకు పైగా సాగే ఈ షెడ్యూల్లో నాగ్తో పాటు కీలక సన్నివేశాలపై చిత్రీకరణ జరగనున్నట్లు టాక్. ఇక 2026 ద్వితీయార్ధంలో ఈ మూవీ రిలీజ్ కానున్నట్లు సమాచారం.
రణ్వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ తెరకెక్కించిన ‘ధురంధర్ 2’ మూవీపై అంచనాలు పెరిగాయి. 2026 మార్చి 19న విడుదల కానున్న ఈ మూవీపై నటి యామీ గౌతమ్ రివ్యూ ఇచ్చింది. ఇది ‘నెక్స్ట్ లెవెల్’ మూవీ అని, ప్రేక్షకులకు మర్చిపోలేని అనుభూతిని ఇస్తుందని తెలిపింది. మూవీ చూశాక తాను వేరే దేనిపై దృష్టి పెట్టలేకపోయానంటూ పేర్కొంది. ప్రతి భారతీయుడు గర్వపడేలా ఈ మూవీ ఉంటుందని ధీమా వ్యక్తం చేసింది.
పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ 2026 మార్చి 26న విడుదల కానుంది. త్వరలో 40 సెకన్ల పవర్ప్యాక్డ్ గ్లింప్స్ను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. సినిమా స్థాయిని ఈ గ్లింప్స్ ద్వారా చూపించబోతున్నట్లు సమాచారం. ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్లో శ్రీలీల, రాశిఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు.
విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి, అదితీ రావు హైదరీ నటించిన సైలెంట్ మూవీ ‘గాంధీ టాక్స్’ ఓటీటీలోకి వచ్చేసింది. JAN 30న థియేటర్లో విడుదలైన ఈ మూవీ ప్రేక్షకులను మెప్పించింది. వెండితెరపై మూకీ చిత్రాల యుగం ఎప్పుడో ముగిసింది. ఇలాంటి తరుణంలో ‘గాంధీ టాక్స్’ పేరుతో ఓ నిశ్శబ్ద చిత్రాన్ని దర్శకుడు కిశోర్ తెరకెక్కించారు. ఇందులో ఒక్క డైలాగ్ కూడా వినిపించదు.
విజయ్ దేవరకొండ, రష్మిక తమ వివాహంపై ఇన్స్టాలో షేర్ చేసిన ఫొటోలు రికార్డు సృష్టించాయి. పోస్టు చేసిన 24 గంటల్లోపు 33 మిలియన్స్ సాధించాయి. గతంలో సిద్ధార్థ్ మల్హోత్రా-కియారా పెళ్లి ఫొటోలకు 23.45 మిలియన్స్ లైక్స్ రాగా ఆ రికార్డు బ్రేకయ్యింది. ప్రస్తుతం ‘VIROSH’ పెళ్లి ఫొటోలు SMలో ట్రెండింగ్లో ఉన్నాయి. ఈ జంట MAR 4న హైదరాబాద్లో రిసెప్షన్ చేసుకోనుంది.
నాచురల్ స్టార్ నాని హీరోగా, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల రూపొందిస్తున్న భారీ చిత్రం ‘ది ప్యారడైజ్’. ఇటీవల ఈ చిత్రం నుంచి విడుదలైన ‘ఆయా షేర్’ సాంగ్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. తాజా లెక్కల ప్రకారం ఈ పాట యూట్యూబ్లో 30 మిలియన్ వ్యూస్ను దాటేసింది. ఇదే జోరు కొనసాగితే త్వరలోనే 50 మిలియన్ మార్క్ను అందుకునే అవకాశం ఉంది.
కన్నడ స్టార్ హీరో యష్ కథానాయకుడిగా, దర్శకురాలు గీతూ మోహన్ దాస్ రూపొందిస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘టాక్సిక్’. ఈ చిత్రం మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్స్లో భాగంగా ఇప్పటికే విడుదలైన టీజర్ సంచలనం సృష్టించింది. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ మరో అప్డేట్ ఇచ్చారు. మార్చి 2న ఈ మూవీ ఫస్ట్ సింగిల్ను విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
శ్రీ విష్ణు, రెబా మౌనికా జాన్ జంటగా నటించిన మృత్యుంజయ్ చిత్రం.. మార్చి 6న రిలీజ్ కానుంది. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ను రేపు విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది. కాగా, మొదటి సారి శ్రీ విష్ణు కామెడీ ఎంటర్ టైనర్ చిత్రాల నుంచి సస్పెన్స్ థ్రిల్లర్ వైపు అడుగులు వేశాడు.
దిగ్గజ దర్శకుడు భారతీరాజా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. ఆయన తీవ్ర అస్వస్థతకు గురవడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. తాజాగా ఆయన ఆరోగ్యం కుదటపడటంతో వైద్యులు డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం భారతీరాజా తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయనకు ఇన్ఫెక్షన్లు సోకకుండా ఉండేందుకు కుటుంబ సభ్యులు ఎవరినీ కలవనివ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ప్రభాస్ హీరోగా, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న హైవోల్టేజ్ యాక్షన్ డ్రామా ‘స్పిరిట్’. ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ ఒక బిగ్ అప్డేట్ ఇచ్చారు. ఇందులో విలన్ పాత్రలో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ నటిస్తున్నట్లు తెలుపుతూ.. చిత్ర బృందం ఆయనకు సంబంధించిన పోస్టర్ను విడుదల చేసింది.
ప్రభాస్ హీరోగా, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న హైవోల్టేజ్ యాక్షన్ డ్రామా ‘స్పిరిట్’. ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ ఒక బిగ్ అప్డేట్ ఇచ్చారు. ఇందులో విలన్ పాత్రలో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ నటిస్తున్నట్లు తెలుపుతూ.. చిత్ర బృందం ఆయనకు సంబంధించిన పోస్టర్ను విడుదల చేసింది.