మైక్రో ఫైనాన్స్ కేసుతో తనకు సంబంధం లేదని ప్రముఖ సింగర్ మంగ్లీ అన్నారు. ఓ కార్యక్రమం ద్వారా రమావత్ మధును తన తమ్ముడు శివతో కలిశానని ఆమె పేర్కొన్నారు. మధు వ్యాపారాల గురించి తనకేమి తెలియదని, మైక్రో ఫైనాన్స్ వ్యవహారంలో తాను కూడా బాధితురాలినే అని చెప్పారు. ఆ కేసు విషయం తన దృష్టికి వచ్చిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశానని వెల్లడించారు. తప్పు చేసిన మధుపై చర్యలు తీసుకోవాలని కోరారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యాక్షన్ డ్రామా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఓటీటీ ప్రియుల ముందుకు వచ్చేసింది. నెట్ఫ్లిక్స్ వేదికగా ఈరోజు నుంచి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది. హరీశ్ శంకర్ దర్శకత్వంలో శ్రీలీల, రాశీ నటించిన ఈ సినిమా మార్చిలో థియేటర్లలో సందడి చేసింది. మరి ఇంకెందుకు ఆలస్యం, PSPK సినిమాను నెట్ఫ్లిక్స్లో చూసేయండి.
యువ దర్శకుడు సుజిత్ తన తదుపరి చిత్రాన్ని నాచురల్ స్టార్ నానితో తెరకెక్కించబోతున్నాడు. ఈ చిత్రానికి ‘బ్లడీ రోమియో’ అనే టైటిల్ను ఖరారు చేశారు. కేవలం ఆరు నెలల్లోనే ఈ సినిమాను పూర్తి చేయాలని సుజిత్ ప్లాన్ చేస్తున్నాడు. ఇది పూర్తయిన వెంటనే పవన్ కళ్యాణ్తో ‘OG 2’ ప్రారంభించడానికి అతడు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సమాచారం.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అట్లీ కాంబోలో తెరకెక్కుతున్న ‘రాకా’ చిత్రంపై నెట్టింట ఆసక్తికర వార్త వైరల్ అవుతోంది. సినిమాలో బన్నీ రెండు పాత్రల్లో కనిపిస్తాడని టాక్. పగలు మనిషిలా, రాత్రి మృగంలా అల్లు అర్జున్ మారిపోతాడని తెలుస్తోంది. హాలీవుడ్ రేంజ్లో సరికొత్త గెటప్లో బన్నీని చూడబోతున్నట్లు సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.
హీరోలు నాని, దుల్కర్ సల్మాన్లు తనకు మంచి స్నేహితులని బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ తెలిపింది. చిత్ర పరిశ్రమలో వారు తనకు ఎంతో అండగా నిలుస్తారని, తమ మధ్య మంచి అనుబంధం ఉందని ఆమె పేర్కొంది. గతంలో ‘సీతారామం’లో దుల్కర్తో, ‘హాయ్ నాన్న’లో నానితో మృణాల్ కలిసి నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్లుగా నిలిచిన సంగతి తెలిసిందే.
సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ హీరోగా వరుస చిత్రాలతో దూసుకుపోతున్నాడు. తాజాగా, క్రికెట్ నేపథ్యంలో సాగే ఓ రొమాంటిక్ డ్రామాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. హరిహరణ్ రామ్ ఈ ప్రాజెక్ట్కు దర్శకత్వం వహించబోతున్నాడు. ఇందులో మాళవిక మనోజ్ హీరోయిన్గా నటించబోతుంది. ఈ మూవీ కోసం జీవీ ప్రకాష్ ప్రత్యేకంగా క్రికెట్ ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నట్లు సమాచారం.
మెగా హీరో వరుణ్ తేజ్ తన కొత్త సినిమా ‘బరి’ షూటింగ్ సందర్భంగా కాలికి గాయమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వరుణ్కు సర్జరీ జరిగినట్లు ఆయన సోదరి నిహారిక కొణిదెల వెల్లడించింది. ప్రస్తుతం వరుణ్ వైద్యుల పర్యవేక్షణలో విశ్రాంతి తీసుకుంటున్నాడని తెలిపింది. త్వరలోనే కోలుకుని మళ్లీ షూటింగ్లో పాల్గొంటాడని పేర్కొంది.
నటి విష్ణుప్రియ వివాదాలు, పోలీస్ కేసులు ఆమె ఆర్థిక స్థితిని అమాంతం పెంచినట్లు కనిపిస్తోంది. ఆమె వివాదానికి కంటే ముందు దాదాపు 1,892 మంది పెయిడ్ సబ్ స్కైబర్లు ఉండేవారు. ఒక్కో సబ్ స్క్రిప్షన్ విలువ రూ. 380 చొప్పున.. నెలకు రూ.7లక్షల వరకు ఆదాయం వచ్చేది. కానీ ఇప్పుడు ఆమె సబ్ స్క్రైబర్ల సంఖ్య 4,832కు పెరిగింది. దీంతో ఆమె నెలకు రూ. 18 లక్షల కంటే ఎక్కువ ఆదాయాన్ని ఆర్జిస్తోంది.
కన్నడ నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్కు సెన్సార్ కష్టాలు తప్పడం లేదు. ‘జన నాయగన్’ సెన్సార్ సమస్యలతో ఇప్పటికే నిలిచిపోగా.. ఇప్పుడు ‘కేడీ ది డెవిల్’ చిత్రానికీ అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఇందులో రక్తపాతం ఎక్కువగా ఉండటంతో సెన్సార్ ‘A’ సర్టిఫికెట్ ఇచ్చింది. ఐటమ్ సాంగ్ వివాదంతో పాటు పలు మార్పులు సూచించడంతో ఈ సంస్థ మరోసారి ఇబ్బందుల్లో పడింది.
హీరో కవిన్, నయనతార తొలిసారి జంటగా నటిస్తున్న మూవీ ‘హాయ్’. విష్ణు ఎడవన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై కోలీవుడ్లో భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ చిత్ర మ్యూజికల్ జర్నీని ప్రారంభిస్తూ.. ఫస్ట్ సింగిల్ ‘కన్నకుజియా’ అప్డేట్ను నయనతార ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. ఈ మెలోడీ సాంగ్ను ఏప్రిల్ 21న విడుదల చేయనున్నట్లు వెల్లడించింది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పెద్ది’ సినిమా విడుదల వాయిదా పడింది. ఏప్రిల్ 30న విడుదల కావాల్సిన ఈ చిత్రాన్ని, పోస్ట్ ప్రొడక్షన్ పనుల కారణంగా జూన్కు వాయిదా వేస్తున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా మేకర్స్ ఒక ప్రత్యేక పోస్ట్ను షేర్ చేశారు.
మలయాళ చిత్ర పరిశ్రమలో ‘వాలా 2’ సంచలనం సృష్టిస్తోంది. 13 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.176.05 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. దీంతో అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ చిత్రాల జాబితాలో టాప్-6లోకి చేరింది. పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ‘ది గోట్ లైఫ్’ (రూ.158.50 కోట్లు) కలెక్షన్లను ఈ సినిమా కేవలం 10 రోజుల్లోనే దాటేయడం విశేషం.
మలయాళ సెన్సేషన్ ‘వాలా’ సిరీస్ నుంచి 3వ భాగం సిద్ధమవుతోంది. ‘బయోపిక్ ఆఫ్ బిలియన్ గర్ల్స్’ ట్యాగ్లైన్తో వస్తున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ను విపిన్ దాస్ విడుదల చేశాడు. గత భాగాల్లో అబ్బాయిల కథలను చూపగా, ఈసారి పూర్తిగా మహిళా ప్రధాన తారాగణంతో రావడం విశేషం. విపిన్ దాస్ కథను అందించగా, విశ్వన్ శ్రీజిత్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.
విజయ్ దేవరకొండ, దర్శకుడు రవికిరణ్ కోలా కాంబోలో వస్తున్న ‘రౌడీ జనార్ధన’ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్ర మూడవ షెడ్యూల్ ఏప్రిల్ 16 నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్లో విజయ్తో పాటు కీర్తి సురేష్ కూడా పాల్గొననున్నట్లు టాక్. ఈ నెల చివరి వరకు HYD పాతబస్తీ పరిసరాల్లోని పలు లొకేషన్లలో కీలక సన్నివేశాలను చిత్రీకరించేందుకు మేకర్స్ ప్లాన్ చేశారట.