తమిళనాడు సీఎం విజయ్ దళపతి తనయుడు జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయమవుతున్న ‘సిగ్మా’ విడుదల తేదీ ఖరారైంది. ఈ సినిమాను 2026, జూలై 31న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు పోస్టర్ షేర్ చేశారు. ఇక ఈ సినిమాలో సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా బుచ్చిబాబు సానా తెరకెక్కించిన మల్టీ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’పై భారీ అంచనాలు ఉన్నాయి. జూన్ 4న విడుదల కానున్న ఈ సినిమాకి ఏపీలో ఆల్రెడీ టికెట్ రేట్ల హైక్స్, షో టైమింగ్స్కి అనుమతులు వచ్చాయి. ఇప్పుడు నైజాం మార్కెట్లోనూ జూన్ 1 నుంచి బుకింగ్స్ షురూ కానున్నట్లు టాక్. ఇక్కడ కూడా భారీగా టికెట్ రేట్లు పెరిగే ఛాన్స్ ఉందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన తాజా హారర్ కామెడీ చిత్రం ‘భూత్ బంగ్లా’ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. దీని డిజిటల్ రైట్స్ను నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. జూన్ 12 నుంచి సదరు OTTలో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. కాగా, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
మొదట్లో వరుస ఫ్లాప్లు చూశానని, అందుకే పరాజయాలను పట్టించుకోనని నటుడు జగపతి బాబు అన్నాడు. 2011-13 వరకు ఎన్నో కష్టాలు, బాధలు అనుభవించానని.. వాటి నుంచి కొత్త పాఠాలు నేర్చుకున్నానని తెలిపాడు. ప్రతి కష్టానికి తగిన ప్రతిఫలం, బాధ వెనుక సంతోషం కచ్చితంగా ఉంటాయని నమ్ముతానని, తన కష్టానికి తగ్గ సంతోషం ఇప్పుడు దక్కిందన్నాడు. తన అసలు టైమ్ ఇప్పుడే స్టార్ట్ అయిందని తెలిపాడు.
తమిళ స్టార్ హీరో నుంచి తమిళనాడు సీఎం అయిన సి. జోసెఫ్ విజయ్ మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. ఢిల్లీ పర్యటన ముగించుకుని వస్తుండగా విమానంలో ఓ ఎయిర్ హోస్టెస్తో ఆయన దిగిన ఫొటో నెట్టింట హల్చల్ చేస్తోంది. సీఎం హోదాలో ఉన్నా విజయ్ చూపిన సాదాసీదా తనం అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ టూర్లో ఆయన పీఎం మోదీని కలసి రాష్ట్ర నిధులు, అభివృద్ధి ప్రాజెక్టులపై చర్చించారు.
యాంకర్ అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియాలో షేర్ చేసిన కొన్ని ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి. సూపర్ స్టార్ రజినీకాంత్తో కలిసి దిగిన ఫొటోలను పంచుకుంటూ, ఆయనే నా ఫేవరెట్ హీరో అని క్యాప్షన్ ఇచ్చింది. దీంతో రజినీ తదుపరి సినిమాలో అనసూయకు క్రేజీ ఛాన్స్ దక్కిందని, అందుకే ఈ ఫొటోలు షేర్ చేస్తూ హింట్ ఇచ్చిందని నెటిజన్లు భావిస్తున్నారు.
వ్యాపారవేత్త నుంచి నటుడిగా మారిన లెజెండ్ శరవణన్ నటించిన ‘లీడర్’ మూవీ OTTలోకి వచ్చేసింది. దురై సెంథిల్కుమార్ తెరకెక్కించిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక తండ్రీకూతుళ్ల సెంటిమెంట్తో రూపొందిన ఈ మూవీ ఏప్రిల్ 3న రిలీజై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.
విజయ్ దేవరకొండ ప్రస్తుతం ‘రణబాలి’, ‘రౌడీ జనార్ధన’ చిత్రాలతో బిజీగా ఉంటూనే, శౌర్యవ్ దర్శకత్వంలో ఓ సినిమాకు సైన్ చేశాడు. తాజాగా విక్రమ్ కె కుమార్ చెప్పిన కథ నచ్చడంతో ఆయనతోనూ సినిమాకు సన్నాహాలు చేస్తున్నాడట. అయితే, తొలుత ఈ ప్రాజెక్ట్ నిర్మించాలనుకున్న యూవీ క్రియేషన్స్ తప్పుకోవడంతో, బాలీవుడ్ సంస్థ ‘మ్యాడ్డాక్ ఫిల్మ్స్’ నిర్మించే ఛాన్స్ ఉందనే చర్చ నడుస్తోంది.
మేము సినిమాల కోసమే ముఖాలకు రంగులు వేసుకుంటామని, నిజ జీవితంలో రంగులు మార్చమని ప్రముఖ నటుడు శివరాజ్ కుమార్ అన్నాడు. ‘పెద్ది’ సినిమా ప్రమోషన్లలో పాల్గొన్న ఆయన.. తనకు రాజకీయాలపై ఆసక్తి లేదని స్పష్టం చేశాడు. అలాగే తమిళనాడులో విజయ్ తరహాలోనే కర్ణాటకలో నటుడు ఉపేంద్ర రాజకీయాల్లోకి వస్తే ప్రజలు మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు.
దర్శకుడు సుకుమార్, DSPల క్రేజీ కాంబోకు బ్రేక్ పడనుందా? ఫిలింనగర్ టాక్ ప్రకారం అవుననే ప్రచారం సాగుతోంది. ‘ఆర్య’తో మొదలైన వీరి ప్రయాణం ‘పుష్ప 2’ వరకు విజయవంతంగా సాగింది. అయితే, వీరి మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయట. దీంతో సుకుమార్ తదుపరి ప్రాజెక్ట్ ‘RC 17’కి ఈ కాంబో దూరం కానుందని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది.
సిద్ధార్థ్, షామిలి జంటగా నటించిన క్లాసిక్ లవ్ స్టోరీ ‘ఓయ్’ మరోసారి థియేటర్లలో సందడి చేయనుంది. ఆనంద్ రంగ దర్శకత్వంలో డి.వి.వి దానయ్య నిర్మించిన ఈ చిత్రం 2009లో ఆశించిన విజయం సాధించనప్పటికీ, కాలక్రమేణా మంచి ఆదరణ పొందింది. గతంలో రీ-రిలీజ్లో అద్భుతమైన రెస్పాన్స్ రాగా, జూలై 18న ఈ సినిమాను మళ్లీ విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
సూపర్స్టార్ మహేష్ బాబు, దర్శకుడు సురేందర్ రెడ్డి కాంబినేషన్లో వచ్చిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘అతిథి’ ఈరోజు థియేటర్లలో గ్రాండ్గా రీ-రిలీజ్ అయ్యింది. 4K డిజిటల్ వెర్షన్తో సరికొత్తగా ముస్తాబైన ఈ సినిమాను చూసేందుకు అభిమానులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. మహేష్ యాక్షన్ పవర్హౌస్ పర్ఫార్మెన్స్తో థియేటర్లలో పండుగ వాతావరణం నెలకొంది.
జూన్ నుంచి టాలీవుడ్లో సినిమాల జోరు పెరగనుంది. ‘పెద్ది’తో ప్రారంభమై వరుస చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. వర్షాల సీజన్ అయినప్పటికీ జులై, ఆగస్టు నెలలపై మేకర్స్ కన్నేశారు. ఈ క్రమంలోనే శివ నిర్వాణ దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న ‘ఇరుముడి’ చిత్రాన్ని ఆగస్టులో విడుదల చేసేందుకు మైత్రీ మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తోంది. త్వరలోనే ప్రచార చిత్రాలు విడుదల కానున్నాయి.
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన స్పోర్ట్స్ యాక్షన్ చిత్రం ‘పెద్ది’. జూన్ 4న పాన్ ఇండియా లెవెల్లో విడుదలవుతున్న ఈ సినిమా, యూఎస్ ప్రీ సేల్స్లో రూ.6 లక్షల డాలర్ల మార్కును దాటింది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ చిత్రం ప్రీమియర్స్తోనే 1 మిలియన్ డాలర్ల గ్రాస్ సాధించే దిశగా దూసుకెళ్తోంది.
నటి నివేదా పేతురాజ్ మూడేళ్ల విరామం తర్వాత టాలీవుడ్లోకి పునరాగమనం చేస్తోంది. ఇప్పటికే వెంకటేశ్ ‘ఆదర్శ కుటుంబం’లో నటిస్తున్న ఆమె, తాజాగా చిరంజీవి-బాబీ కాంబినేషన్లో వస్తున్న క్రేజీ చిత్రంలో కీలక పాత్రకు ఎంపికైనట్లు సమాచారం. కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్లో ఆమె ముఖ్య పాత్ర పోషిస్తుందట. కాగా తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.