యష్ ‘టాక్సిక్’ విడుదలపై నీలి నీడలు కమ్ముకున్నాయి. 2026 జూన్ 4న విడుదల కావాల్సిన ఈ చిత్రం, ఓటీటీ డీల్ ఇంకా కుదరకపోవడంతో వాయిదా పడే అవకాశం ఉందట. గల్ఫ్ పరిస్థితుల వల్ల గతంలోనే మార్చి రిలీజ్ ఆగగా, ఇప్పుడు ఓటీటీ సంస్థలు ఆశించిన ధర ఇవ్వకపోవడం చర్చనీయాంశమైంది. దీంతో మేకర్స్ ఆగస్టు లేదా దసరా సీజన్ను పరిశీలిస్తున్నారట. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.
‘3 ఇడియట్స్’ సీక్వెల్ గురించి అమీర్ ఖాన్ కీలక అప్డేట్ ఇచ్చాడు. రాజ్కుమార్ హిరానీ ప్రస్తుతం దీని స్క్రిప్ట్పై పనిచేస్తున్నారని, మొదటి భాగం ముగిసిన 10 ఏళ్ల తర్వాత జరిగే కథతో ఇది రూపొందనుందని వెల్లడించాడు. అభిజిత్ జోషి సిద్ధం చేసిన ఈ కథలో హాస్యం, భావోద్వేగాలు అద్భుతంగా ఉన్నాయన్నాడు. మరోసారి రంచో పాత్రలో నటించేందుకు ఎంతో ఉత్సాహంగా ఉన్నట్లు చెప్పాడు.
ఏప్రిల్ 28 టాలీవుడ్ చరిత్రలో ఒక ‘గోల్డెన్ డే’. 1977లో ఈరోజు ఎన్టీఆర్ ‘అడవి రాముడు’ రిలీజై రూ.3 కోట్ల వసూళ్లతో ప్రభంజనం సృష్టించగా, 1994లో ‘యమలీల’ సంచలన విజయం సాధించింది. 2006లో మహేష్ బాబు ‘పోకిరి’ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాయగా, 2017లో ‘బాహుబలి-2’ ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా సత్తా చాటింది. బాక్సాఫీస్ హిట్లకు ఈ తేదీ ఒక కేరాఫ్ ...
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన సినిమాల షూటింగ్ త్వరగా పూర్తి చేసేందుకు కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇకపై ప్రతి ప్రాజెక్టుకు గరిష్టంగా 200 రోజులు మాత్రమే కేటాయించాలని డిసైడ్ అయ్యాడట. ఆ సమయంలోపు షూటింగ్ పూర్తి కాకపోతే, మరో సినిమాను కూడా పట్టాలెక్కించి రెండింటినీ ఒకేసారి పూర్తి చేయాలని భావిస్తున్నాడట. సినిమాలను సకాలంలో విడుదల చేయడమే లక్ష్యంగా ఆయన ఈ ప్లాన్ చేసినట్లు టాక్.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు బాబీ దర్శకత్వంలో క్రేజీ ప్రాజెక్టు రాబోతుంది. ‘మెగా 158’ అనే వర్కింగ్ టైటిల్తో తెరకెక్కనున్న ఈ సినిమాపై మేకర్స్ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు. ఈ మూవీకి సంబంధించిన లుక్ టెస్ట్ విజయవంతంగా పూర్తయినట్లు తెలుపుతూ ఫొటో షేర్ చేశారు. అది అద్భుతమైన ఆనందాన్ని కలిగించిందని పేర్కొన్నారు. ఇక ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.
కాజల్ అగర్వాల్, శ్రేయస్ తల్పడే ప్రధాన పాత్రల్లో నటించిన ‘ది ఇండియా స్టోరీ’. చెట్టన్ డీకే దర్శకత్వం వహించిన ఈ సినిమా 2026 జూలై 24న విడుదల కానుంది. వ్యవసాయంలో వాడే రసాయన పురుగుమందుల వల్ల కలిగే ఆరోగ్య సమస్యలను ఈ కథలో చర్చించారు. ఇందులో కాజల్ ధైర్యవంతురాలైన న్యాయవాదిగా కనిపించనుంది.
సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయకృష్ణ ఘట్టమనేని ‘శ్రీనివాస మంగాపురం’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం ఇంటెన్స్ క్లైమాక్స్ షూట్లో ఉంది. ఎండను సైతం లెక్కచేయకుండా జయకృష్ణ, విలన్ అజయ్ గ్యాంగ్ మధ్య కీలక యాక్షన్ సీక్వెన్స్ను చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్తో మొత్తం షూటింగ్ పూర్తికానుందట.
TG: తనపై నమోదైన చీటింగ్ కేసును కొట్టివేయాలని బిగ్బాస్ ఫేమ్ అషురెడ్డి హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసింది. పెళ్లి పేరుతో మోసం చేసిందన్న లండన్ టెక్కీ ఫిర్యాదును ఆమె ఖండించింది. తన వివరణ తీసుకోకుండానే పోలీసులు ఏకపక్షంగా కేసు పెట్టారని, తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని పేర్కొంది. వాస్తవాలు దాచి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.
తెలుగు సినీ చరిత్రను మలుపు తిప్పిన ‘పోకిరి’ (2006) విడుదలై నేటికీ 20 ఏళ్లు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన ఈ మూవీ రూ.10CR బడ్జెట్తో వచ్చి రూ.40CR షేర్ సాధించి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. మాఫియా వ్యక్తిగా కనిపించిన పండుగాడు అండర్కవర్ పోలీస్ అనే ట్విస్ట్, మహేష్ మేనరిజం, డైలాగ్స్ ఈ మూవీని ఆల్టైం క్లాసిక్గా నిలబెట్టాయి.
తాను దర్శకురాలిగా మారాలని అనుకుంటున్నానని నటి ఫరియా అబ్దుల్లా చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ‘నాకు నటనతో పాటు దర్శకత్వంపై ఆసక్తి ఉంది. గతేడాది నుంచి నేను కొన్ని కథలను రాస్తున్నాను. అందులో ఏదొక కథను పూర్తిగా రెడీ చేసి త్వరలోనే ఒక సినిమాకు దర్శకత్వం వహించాలని అనుకుంటున్నా’ అంటూ ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’ మూవీని తెరకెక్కిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ కొత్త షెడ్యూల్ కోసం రామోజీ ఫిలిం సిటీలో ఓ భారీ సెట్ని వేస్తున్నారట. అక్కడే ఇంటర్వెల్ను షూట్ చేయనున్నట్లు టాక్. అంతేకాదు ఈ సెట్లోనే ప్రభాస్పై మరికొన్ని యాక్షన్ సీన్స్ను చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీలో ప్రభాస్ సరసన త్రిప్తి డిమ్రి నటిస్తోంది.
అక్కినేని నాగార్జున, దర్శకుడు రా. కార్తీక్ కాంబోలో ‘కింగ్ 100’ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాను 2026 దసరా కానుకగా రిలీజ్ చేయాలని మేకర్స్ టార్గెట్ పెట్టుకున్నారట. ఇందులో భాగంగా జూన్ నాటికి షూటింగ్ను పూర్తి చేయాలని సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇక సాధారణ వ్యక్తి.. అసాధారణ స్థాయికి ఎలా ఎదిగాడనే కథతో రాబోతున్న ఈ మూవీలో నాగ్ రెండు పాత్రల్లో కనిపించనున్నట్లు టాక్.
ప్రభాస్, నాగ్ అశ్విన్ల భారీ విజువల్ వండర్ ‘కల్కి 2’ షూటింగ్ మే మొదటి వారం నుంచి HYDలో ప్రారంభం కానుంది. ఈ కొత్త షెడ్యూల్లో ప్రభాస్ పాల్గొనబోతున్నట్లు టాక్. మొదటి భాగంలో భైరవ, కర్ణ పాత్రలతో మెప్పించిన ఆయన, ఇందులో మరో కొత్త లుక్తో అలరించనున్నాడట. అమితాబ్, కమల్ హాసన్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు.
జూ. ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న ‘డ్రాగన్’ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో కీలక పాత్రలో సీనియర్ నటుడు రాజీవ్ కనకాల నటించనున్నాడు . ఈ విషయాన్ని ఆయన స్వయంగా ధ్రువీకరించాడు. మే 7 నుంచి ఆయన షూటింగ్లో పాల్గొననున్నట్లు టాక్. వచ్చే ఏడాది జూన్ 11న విడుదల కానున్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.