‘రణబాలి’ చిత్రంలోని విజయ్ దేవరకొండ, రష్మికల వెడ్డింగ్ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది. 1800ల నాటి సహజత్వం, మట్టి వాసన ఉట్టిపడేలా దీన్ని రూపొందించామని దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ తెలిపాడు. ఈ సీన్ వారి నిజ జీవిత వివాహంతో యాదృచ్ఛికంగా సరిపోలిందని, ఇది చూస్తుంటే వారి గత జన్మ పెళ్లి ఫొటోలా అనిపిస్తోందంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు.
‘కపుల్ ఫ్రెండ్లీ’ హిట్తో జోరుమీదున్న సంతోష్ శోభన్ వరుసగా 4 మూవీలను లైన్లో పెట్టాడట. యూవీ క్రియేషన్స్లో లక్ష్మణ్ కే కృష్ణ దర్శకత్వంలో ఆయన ‘మల్టీ యూనివర్స్ కామెడీ’ ప్రాజెక్ట్ చేయనున్నాడు. అలాగే రామ్ పసుపులేటితో ఒక ఫాంటసీ అడ్వెంచర్ మూవీకి సిద్ధమయ్యాడు. మరో రెండు క్రేజీ కథలు చర్చల దశలో ఉన్నాయి. విభిన్నమైన కాన్సెప్టులతో అలరించేందుకు సంతోష్ రెడీ అవుతున్నాడు.
పెళ్లిపై నటి త్రిష ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘సరైన వ్యక్తి దొరికితేనే పెళ్లి చేసుకుంటాను, లేదంటే ఒంటరిగా ఉండటానికైనా సిద్ధమే’ అని చెప్పింది. తొందరపడి తప్పుడు నిర్ణయం తీసుకుని విడాకుల వరకు వెళ్లడం ఇష్టం లేదని, జీవితాన్ని పంచుకోగలిగే మంచి భాగస్వామి కోసమే ఎదురుచూస్తున్నట్లు తెలిపింది. కేవలం ప్రేమలో పడటం కంటే, సంతోషకరమైన వైవాహిక జీవితమే తన లక్ష్యమని పేర్కొంది.
ఏపీ రాజధాని అమరావతిలో అంతర్జాతీయ స్థాయి ‘ఫిల్మ్ సిటీ’కి రంగం సిద్ధమవుతోంది. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ దాదాపు 500 ఎకరాల్లో హాలీవుడ్ హంగులతో దీని నిర్మాణానికి ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్ వస్తే పర్యాటకం, ఉపాధి పెరగడమే కాకుండా.. ఆంధ్రప్రదేశ్ సినిమా షూటింగ్లకు ప్రధాన కేంద్రంగా మారుతుంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
వరలక్ష్మీ శరత్కుమార్ స్వీయ దర్శకత్వంలో వస్తున్న ‘సరస్వతి’ మూవీ మార్చి 6న విడుదల కానుంది. HYDలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో రాధికా శరత్కుమార్ ఆసక్తికర విషయాలు పంచుకుంది. మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లినప్పుడు ఆయన స్వయంగా వేసి పెట్టిన ‘చిరంజీవి దోశ’ గురించి ఆమె గుర్తు చేసుకుంది. ఆ దోశ మల్లెపువ్వులా మెత్తగా ఉందని, అలాంటి రుచిని తానెక్కడా చూడలేదని తెలిపింది.
* సూర్య ‘సూర్య 46’ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ కాబోతుంది.* యష్ ‘టాక్సిక్’ నుంచి ఫస్ట్ సింగిల్ విడుదల అవుతుంది.* నాని ‘ది ప్యారడైజ్’ ఫస్ట్ సింగిల్ హిందీ, తమిళ వెర్షన్ రిలీజ్..?* రామ్ చరణ్ ‘పెద్ది’ సెకండ్ సింగిల్ రాబోతుంది.
తమిళ హీరో ధనుష్ ప్రధాన పాత్రలో దర్శకుడు విఘ్నేష్ రాజా కాంబోలో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్టు ‘కారా’. భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమా రిలీజ్ డేట్ను నిర్మాత ప్రకటించారు. 2026 ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు వెల్లడించాడు. ఇక ఈ సినిమ మమితా బైజు కథానాయికగా నటిస్తుండగా.. GV ప్రకాష్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
తమిళ స్టార్ విజయ్కు వ్యక్తిగత సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఇటీవల ఆయన భార్య సంగీత విడాకుల పిటిషన్ దాఖలు చేయగా, తాజాగా కుమారుడు జేసన్ సంజయ్ తీసుకున్న నిర్ణయం షాక్కు గురిచేస్తోంది. జేసన్ సోషల్ మీడియాలో తన తండ్రిని అన్ఫాలో చేసినట్లు సమాచారం. తండ్రి మద్దతుతో దర్శకుడిగా మారుతున్న జేసన్ ఇలా చేయడం విజయ్ కుటుంబంలో విభేదాలు తారాస్థాయికి చేరాయనే చర్చకు దారితీస్తోంది.
‘దువ్వాడ జగన్నాథం’లో అల్లు అర్జున్ పక్కన నటించే అవకాశంపై తన అనుభవాలను నటి హరితేజ పంచుకుంది. బన్నీ పక్కన స్లిమ్గా కనిపించాలని గట్టి నిర్ణయం తీసుకున్నానని చెప్పింది. అందుకోసం వరుసగా 15 రోజుల పాటు కేవలం లిక్విడ్ డైట్ మాత్రమే తీసుకున్నానని, సాధారణ ఆహారం పూర్తిగా మానేసి కష్టపడ్డానని తెలిపింది. ఈ క్రమశిక్షణతోనే తాను సినిమాలో పర్ఫెక్ట్గా కనిపించానని పేర్కొంది.
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. తాజాగా వారి పెళ్లికి సంబంధించిన సరికొత్త ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. రాయల్ డోలీలో రష్మిక ఎంట్రీ ఇవ్వగా, చేతిలో ఖడ్గంతో విజయ్ రాజసం ఉట్టిపడేలా కనిపించిన ఈ ఫొటోలు ఆకట్టుకుంటున్నాయి. ఇక మార్చి 4న హైదరాబాద్లో జరగబోయే వారి గ్రాండ్ రిసెప్షన్కు సినీ, రాజకీయ ప్రముఖులు భారీగా తరలిరానున్నారు.
‘టూరిస్ట్ ఫ్యామిలీ’ దర్శకుడు అభిషన్ జీవింత్ హీరోగా రాబోతున్న సినిమా ‘విత్ లవ్’. ఇటీవలే థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా తాజాగా OTTలోకి వచ్చేందుకు సిద్ధమైంది. దీని డిజిటల్ రైట్స్ను నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకోగా.. మార్చి 6 నుంచి పాన్ ఇండియా భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఇక ఈ చిత్రాన్ని దర్శకుడు మదన్ రూపొందించగా.. నటి అనశ్వర రాజన్ కథానాయికగా నటించింది.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో నటి సోనాల్ చౌహాన్ దుబాయ్లో చిక్కుకుంది. విమాన సర్వీసులు రద్దు కావడంతో ఆమె అక్కడే ఆగిపోయింది. ఈ క్రమంలో భారత్కు తిరిగి వచ్చేందుకు సాయం చేయాలని ప్రధాని మోదీకి ఆమె విజ్ఞప్తి చేసింది. ‘నేను సురక్షితంగా ఇంటికి చేరడానికి సహకరించండి’ అంటూ సోషల్ మీడియా వేదికగా కోరింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది.
హీరో నిఖిల్ తన అప్కమింగ్ ప్రాజెక్టులపై క్రేజీ అప్డేట్స్ ఇచ్చాడు. ఈ ఏడాది ఏకంగా మూడు సినిమాలు చేయబోతున్నట్లు ప్రకటించాడు. ప్రస్తుతం చేస్తున్న ‘స్వయంభు’తో పాటు, రామ్ చరణ్ నిర్మాణంలో ‘ఇండియా హౌస్’ అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నట్లు వెల్లడించాడు. వీటితో పాటు ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘కార్తికేయ-3’ కూడా లైన్లో ఉందని చెప్పి అభిమానుల్లో...
రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో వస్తున్న ‘పెద్ది’ చిత్రంపై క్రేజీ అప్డేట్ వచ్చేసింది! మార్చి 2న ఈ సినిమాలోని సెకండ్ సాంగ్ ‘రాయ్ రాయ్ రారా’ విడుదల కానుంది. ఈ పాటను స్వయంగా ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ పాడినట్లు టాక్. ఆయన గొంతులో వచ్చే పాటలు చార్ట్బస్టర్లే కాబట్టి, ఫ్యాన్స్లో అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈ భారీ చిత్రం ఏప్రిల్ 30, 2026న థియేటర్లలో సందడి చేయనుంది.
తమిళ స్టార్ సూర్య, దర్శకుడు వెంకీ అట్లూరి కాంబోలో ‘సూర్య 46’ సినిమా తెరకెక్కింది. తాజాగా ఈ సినిమా నుంచి సాలిడ్ అప్డేట్ వచ్చింది. మార్చి 2న ఉదయం 10:18 గంటలకు ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక ఈ సినిమాలో మమితా బైజు, రవీనా టాండన్ కీలక పాత్రలు పోషించగా.. GV ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందించాడు.