రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాలో స్పెషల్ సాంగ్ చేస్తున్న శ్రుతి హాసన్ దాదాపు రూ.3.5 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు టాక్. జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో తెరకెక్కుతున్న ఈ పాట షూటింగ్ మరో రెండు రోజుల్లో పూర్తికానుందని తెలుస్తోంది. హైదరాబాద్ శివార్లలో ఏర్పాటు చేసిన ఓ భారీ సెట్లో ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. కాగా, ఈ మూవీ జూన్ 25న విడుదల కానున్న విషయం తెలిసిందే.
బాలీవుడ్ సూపర్ హిట్ చిత్రం ‘ఖల్ నాయక్’ (1993) సీక్వెల్గా ‘ఖల్ నాయక్ రిటర్న్స్’ తెరకెక్కబోతోంది. అయితే, మొదటి భాగానికి దర్శకత్వం వహించిన సుభాష్ ఘాయ్ (81 ఏళ్లు), ఈ సీక్వెల్కు తాను దర్శకత్వం వహించడం లేదని స్పష్టం చేశాడు. దీంతో ఈ భారీ ప్రాజెక్టును తెరకెక్కించే బాధ్యతను ఏ దర్శకుడు చేపడతారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
రామ్ చరణ్ హీరోగా, సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో ఒక చిత్రం తెరకెక్కబోతున్నట్లు ప్రచారం జరిగింది. అయితే, తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో చరణ్ స్థానంలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. కొన్ని అనివార్య కారణాల వల్ల చరణ్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒక పౌరాణిక గాథను విజువల్ వండర్గా ఈ చిత్రంలో ఆవిష్కరించబోతున్నారు.
రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న చిత్రం ‘పెద్ది’. ప్రస్తుతం ఈ సినిమా ఆఖరి షెడ్యూల్ జరుపుకుంటోంది. తాజాగా ఈ స్పెషల్ సాంగ్ చిత్రీకరణ హైదరాబాద్లో జరుగుతుండగా, దానికి సంబంధించిన కొన్ని విజువల్స్ లీక్ అయ్యాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, శృతి హాసన్ డాన్స్ రిహార్సల్స్ చేస్తున్న ఈ వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి.
వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆదర్శ కుటుంబం’. తాజాగా ఈ సినిమా షూటింగ్ అప్డేట్ వచ్చింది. మలక్పేట మెట్రో స్టేషన్లో కీలకమైన ఫైట్ సీక్వెన్స్ను పూర్తి చేసుకున్నట్లు చిత్ర బృందం తెలిపింది. కామెడీ-యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమా.. ఈ ఏడాది ఆగస్టు లేదా అక్టోబర్లో విడుదల కానుంది.
పాప్ లెజెండ్ మైఖేల్ జాక్సన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ ‘మైఖేల్’ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన కేవలం నాలుగు రోజుల్లోనే ఈ చిత్రం రూ. 2,000 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. మైఖేల్ జాక్సన్ మేనల్లుడు జాఫర్ జాక్సన్ను తెరపై చూస్తుంటే సాక్షాత్తు మైఖేల్ జాక్సనే మళ్లీ తిరిగి వచ్చాడా అన్నట్లుగా ఉందంటూ ప్రశంసల వర్షం కురుస్తోంది.
కమల్ హాసన్ నిర్మాణంలో రజినీకాంత్, ‘డాన్’ ఫేమ్ సిబి చక్రవర్తి కాంబోలో ‘తలైవార్ 173’ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో మలయాళ నటుడు బసిల్ జోసెఫ్ కీలక పాత్ర పోషించనున్నట్లు టాక్. ఇటీవల ఒక వేడుకలో త్వరలోనే ఓ పెద్ద తమిళ ప్రాజెక్ట్ గురించి ప్రకటిస్తానని బసిల్ చెప్పడంతో, అది రజినీ సినిమానే అని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. ఇందులో ఆయన రజినీకి కుమారుడిగా కనిపిస్తారని సమాచారం.
‘జననాయగన్’ లీకైన వెర్షన్ను చూస్తూ ఓ ఎన్నికల అధికారి అడ్డంగా దొరికిపోయాడు. అన్నా యూనివర్శిటీలో ఎన్నికల నిఘా విభాగంలో పని చేస్తున్న యువరాజ్ అనే వ్యక్తి, విధుల్లో ఉండగానే ఈ సినిమా పైరసీ వెర్షన్ను చూశాడు. ఈ ఫొటోలను అతడు SMలో పంచుకోగా.. అవి వైరల్ అయ్యాయి. దీంతో విధుల్లో నిర్లక్ష్యం, పైరసీని ప్రోత్సహించినందుకు అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వివాహ వేడుకలు అంగరంగ వైభవంగా మొదలయ్యాయి. ఏప్రిల్ 29న ఉదయం 11:13 గంటలకు తిరుమల పుణ్యక్షేత్రంలో కావ్యా రెడ్డితో ఆయన పెళ్లి జరగనుంది. సనాతన ధర్మ సంప్రదాయబద్ధంగా సాగే ఈ కళ్యాణం అనంతరం, మే 1న హైదరాబాద్లో సినీ, రాజకీయ ప్రముఖుల కోసం గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించనున్నారు. కొత్త జంటకు అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
అమెరికా, మెక్సికో ఎడారుల్లో నివసించే రోడ్ రన్నర్ ఒక విశిష్ట పక్షి. ఇది గంటకు 32 కి.మీ. వేగంతో పరిగెడుతూ పాములు, బల్లులను వేటాడుతుంది. ఎగరడం కంటే పరుగే దీనికి ఇష్టం. నీరు తాగకుండా ఆహారం ద్వారానే తేమను పొందే అద్భుత సామర్థ్యం దీని సొంతం. సూర్యరశ్మితో శరీరాన్ని వేడెక్కించుకుంటూ, ఎడారి పరిస్థితులను తట్టుకుని 7-10 ఏళ్లు జీవిస్తుంది. దీన్ని పట్టుకోవడం ఇతర జంతువులకు సవాలే.
NTR, ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న మూవీ ‘డ్రాగన్’. ఇది తండ్రీకొడుకుల ఎమోషనల్ పొలిటికల్ క్రైమ్ డ్రామా అని సమాచారం. రాజకీయ నేర సామ్రాజ్యంలో తండ్రికి జరిగిన అన్యాయానికి కొడుకు తీర్చుకునే ప్రతీకార కథాంశంతో ఇది రాబోతుందట. ‘నాన్నకు ప్రేమతో’ తరహా సెంటిమెంట్ను, నీల్ తన మార్క్ మాస్ ఎలిమెంట్స్తో ఇంటర్నేషనల్ లెవల్లో రా అండ్ రస్టిక్గా చూపించబోతున్నట్లు టాక్.
కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వంలో తరుణ్ భాస్కర్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన చిత్రం ‘గాయపడ్డ సింహం’. ఇప్పటికే టీజర్తో అంచనాలు పెంచిన ఈ సినిమా మే 1, 2026న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ పనులు పూర్తయ్యాయి. దీనికి సెన్సార్ సభ్యులు U/A సర్టిఫికెట్ జారీ చేశారు. ఇక ఈ సినిమాలో మానస చౌదరి, జేడీ చక్రవర్తి కీలక పాత్రలు పోషించారు.
రాజకీయ రంగప్రవేశంపై మంచు లక్ష్మి తాజాగా క్లారిటీ ఇచ్చింది. తనకు ప్రధాని మోదీని నేరుగా కలిసే సాన్నిహిత్యం ఉందని, ఎవరైనా రాజ్యసభ సీటు ఇస్తే ఎంపీగా బాధ్యతలు తీసుకుంటానని చెప్పింది. ఎన్నికల్లో పోటీ చేసేంత సమయం ప్రస్తుతం లేదని తెలిపింది. తన సేవా కార్యక్రమాలు చూసి చాలామంది రాజకీయాల్లోకి రావాలని కోరుతున్నారని, అందుకే భవిష్యత్తులో పాలిటిక్స్లోకి వచ్చే అవకాశం ఉందని పేర్కొంది.
నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబోలో వస్తున్న మూవీ ‘ది ప్యారడైజ్’. ఈ మూవీలోని ఫస్ట్ సింగిల్ ‘ఆయా షేర్’ ఇప్పటికే సెన్సేషన్ క్రియేట్ చేయగా, త్వరలో సెకండ్ సింగిల్ రాబోతున్నట్లు తెలుస్తోంది. నాని-కయాదు లోహర్ మధ్య సాగే ఈ మెస్మరైజింగ్ రొమాంటిక్ మెలోడీ మే 10న రిలీజ్ కానున్నట్లు సమాచారం. ఈ మూవీ ఆగస్టు 21, 2026న విడుదల కానుంది.