టాలీవుడ్ ప్రముఖ నటుడు శివాజీ రాజా ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి, బి. రామరాజు(85) కన్నుమూశారు. వయోభారం, అనారోగ్య సమస్యలతో ఇవాళ ఉదయం మధురానగర్లోని తన స్వగృహంలో ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో రామరాజు అంత్యక్రియలు జరగనున్నాయి. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా విజయ్ దళపతి ‘తేరి’ మూవీకి రీమేక్ కాదని దర్శకుడు హరీష్ శంకర్ క్లారిటీ ఇచ్చాడు. మొదట రీమేక్గా భావించినా, తర్వాత కథను పూర్తిగా మార్చేశామని స్పష్టం చేశాడు. కథ, మాటలు, దర్శకత్వం తనవే అయినప్పుడు రీమేక్ అనడం సరికాదన్నాడు. ‘గబ్బర్ సింగ్’లోని అంశాలే ‘తేరి’లో కనిపించాయని, ఇప్పుడు తన సినిమానే రీమేక్ అనడంపై ఆయన అసహనం వ్యక్తం ...
తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బ జంటగా నటించిన ‘ఓం శాంతి శాంతి శాంతిః’ మూవీ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. తాజాగా ఈ సినిమా OTTలోకి వచ్చేసింది. ఇవాళ్టి నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. కానీ ఇది కేవలం ఆహా గోల్డ్ వినియోగదారులకి మాత్రమే అందుబాటులోకి వచ్చింది. మార్చి 4 నుంచి సాధారణ సబ్స్క్రైబర్స్కి అందుబాటులోకి రాబోతుంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీతో బన్నీ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో పాటు మరికొన్ని క్రేజీ ప్రాజెక్టులు ఆయన లైనప్లో ఉన్నాయి. దర్శకుడు సుకుమార్తో ‘పుష్ప 3’, తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్తో ‘AA23’ మూవీలు చేయనున్నాడు. అలాగే మలయాళ డైరెక్టర్ బాసిల్ జోసెఫ్తో ‘AA24’ మూవీ చేయనున...
2018లో సెన్సేషన్ సృష్టించిన ‘తుంబాడ్’ మూవీకి సీక్వెల్ రాబోతుంది. దర్శకుడు అనిల్ రాహి బర్వె తెరకెక్కించిన ఈ విజువల్ వండర్కు పార్ట్-2 సిద్ధమవుతోంది. తాజాగా ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర కోసం ‘సైంధవ్’ విలన్ నవాజుద్దీన్ సిద్ధిఖీని మేకర్స్ ఖరారు చేశారు. ఆయన రాకతో ఈ హారర్ థ్రిల్లర్పై అంచనాలు రెట్టింపయ్యాయి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘సలార్ 2’ మూవీ అప్డేట్స్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు నిర్మాత విజయ్ గుడ్న్యూస్ చెప్పాడు. ‘సలార్ 2’ అందరినీ ఆశ్చర్యపరుస్తుందని తెలిపాడు. త్వరలోనే మూవీ షూటింగ్ ప్రారంభిస్తామని వెల్లడించాడు. ఈ విషయం అభిమానులతో పంచుకోవడం ఆనందంగా ఉందన్నాడు. అలాగే, ఇండస్ట్రీలో ఉన్న గొప్ప దర్శకుల్లో ప్రశాంత్ నీల్ ఒకరని విజయ్ కితాబిచ్చాడు.
హీరోయిన్ దిశా పటానీ ప్రస్తుతం ‘అవరాపన్ 2’లో నటిస్తున్న విషయం తెలిసిందే. నితిన్ కక్కర్ దర్శకత్వంలో ఇమ్రాన్ హష్మీ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ మూవీ ఏప్రిల్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మలేసియాలో చివరి షెడ్యూల్ను పూర్తి చేయాలని చిత్రబృందం నిర్ణయం తీసుకుందట. దిశ, ఇమ్రాన్ల ప్రేమకు సంబంధించిన సన్నివేశాలు ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నట్లు తెలుస్తోంది.
సినిమా ఇండస్ట్రీలో కొత్త దర్శకుల పరిస్థితి దారుణంగా ఉంది. న్యూ టాలెంట్ను ప్రోత్సహిస్తామని పెద్దలు చెబుతున్నా, వాస్తవం మాత్రం భిన్నంగా ఉందని యువ దర్శకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రొడక్షన్ హౌస్లలో స్టోరీ లిజనర్స్ కొత్త వారిని కలవడానికి ఇష్టపడరని, అపాయింట్మెంట్ ఇచ్చి కూడా గంటల తరబడి వెయిట్ చేయించి ఆఖరి నిమిషంలో అబద్ధాలు చెబుతారని వాపోతున్నారు.
బాలీవుడ్ హీరో కార్తిక్ ఆర్యన్తో కలిసి శ్రీలీల మరో సినిమాలో నటించనున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు కబీర్ ఖాన్తో తెరకెక్కిస్తున్న మూవీలో శ్రీలీల ఎంపికైనట్లు సమాచారం. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో రూపొందిస్తున్న ఈ సినిమాలో కార్తిక్ కిక్ బాక్సింగ్ కోచ్ పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే చిత్రీకరణ ప్రారంభమైన ఈ మూవీ 2027లో విడుదలయ్యే అవకాశం ఉంది.
తమిళ స్టార్ హీరో, టీవీకే పార్టీ అధినేత విజయ్ను ’27’ నంబర్ సెంటిమెంట్ కలవరపెడుతోంది. గతేడాది SEP 27న కరూర్ తొక్కిసలాట, OCT 27న బాధితుల పరామర్శ, DEC 27న సినిమా ఆడియో లాంచ్ వివాదం.. ఇలా అన్నీ 27వ తేదీనే జరిగాయి. తాజాగా FEB 27న భార్య సంగీత 27 ఏళ్ల వివాహ బంధానికి స్వస్తి చెబుతూ విడాకుల పిటిషన్ వేయడం సంచలనమైంది. MAR 27న కోర్టులో ఏం జరగనుందోనని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.
ప్రముఖ బల్లితెర నటి దేవిప్రియ నిన్న తెల్లవారుజామున కారులో చెన్నై నుంచి తిరుచ్చి వైపు బయల్దేరారు. పెరంబలూరు వద్ద కారు టైరు పంక్ఛర్ కావడంతో డ్రైవర్ ముత్తుగణేష్(38) కారును రోడ్డు పక్కన ఆపి టైరు మారుస్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. కారులో ఉన్న ముత్తుగణేష్ అక్కడికక్కడే మృతిచెండాడు. దేవిప్రియ తృటిలో తప్పించుకున్నారు. ఆమె పీఏ దివాకర్ తీవ్రంగా గాయపడ్డాడు.
శరీరం తిరిగి శక్తిని పుంజుకోవడానికి రాత్రి పూట 7 నుంచి 8 గంటల నిద్ర అవసరం. సరైన నిద్ర లేకపోతే ఏకాగ్రత తగ్గడం, చిరాకు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. నిద్రపోయే ముందు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్కు దూరంగా ఉండటం వల్ల మంచి నిద్ర పడుతుంది. దీనితో పాటు, పడుకునే ముందు కాఫీ, టీ వంటి కెఫీన్ పానీయాలకు దూరంగా ఉండటం వల్ల మెదడు త్వరగా విశ్రాంతి పొంది గాఢ నిద్ర పడుతుంది.
ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం కారణంగా సినీ నటుడు మంచు విష్ణు దుబాయ్లో చిక్కుకుపోయాడు. ఈ నేపథ్యంలో, తన కుటుంబం సురక్షితంగా ఉన్నట్లు విష్ణు తాజాగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ఇప్పటికీ బాంబుల శబ్దాలు వినిపిస్తున్నప్పటికీ, ఇక్కడ జనజీవనం ప్రస్తుతం సాధారణంగానే ఉందంటూ ట్వీట్ చేశాడు. పరిస్థితులు చక్కబడిన వెంటనే వీలైనంత త్వరగా ఇండియాకు తిరిగి వస్తామని పేర్కొన్నాడు.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు’. బాక్సాఫీస్ వద్ద రూ.400 కోట్లకు పైగా వసూళ్లను సాధించిన ఈ చిత్రం, ఓటీటీలోకి వచ్చినప్పటికీ థియేటర్లలో తన జోరును కొనసాగిస్తుండటం విశేషం. ఏకంగా 109 కేంద్రాల్లో విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకున్న ఈ సినిమా.. ఇటీవల కాలంలో ఈ ఘనత సాధించిన ఏకైక చిత్రంగా సరికొత్త రికార్డు సృష్టించింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించిన చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఈ మూవీ ఈనెల 26న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో హరీష్ శంకర్ మాట్లాడుతూ.. ఇది ఏ సినిమాకు రీమేక్ కాదని స్పష్టం చేశాడు. కొత్త కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు వెల్లడించాడు. ఈ చిత్రంలో హీరోయిన్లుగా శ్రీలీల, రాశి ఖన్నా నటిస్తున్నారు.