టాలీవుడ్ స్టార్ హీరో హనుమంతుడి గెటప్లో ఉన్న ఓ పాత ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. గుర్తుపట్టలేనంతగా ఉన్న ఈ ఫొటోలో ఉన్న నటుడు ఎవరై ఉంటారా? అంటూ అభిమానుల మధ్య పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. అయితే, ఈ ఫొటో చూస్తున్న మీకైనా ఆయన ఎవరో తెలిస్తే కామెంట్ చేయండి. ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ చేస్తారో చూద్దాం.
టాలీవుడ్ స్టార్ హీరో హనుమంతుడి గెటప్లో ఉన్న ఓ పాత ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. గుర్తుపట్టలేనంతగా ఉన్న ఈ ఫొటోలో ఉన్న నటుడు ఎవరై ఉంటారా? అంటూ అభిమానుల మధ్య పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. అయితే, ఈ ఫొటో చూస్తున్న మీకైనా ఆయన ఎవరో తెలిస్తే కామెంట్ చేయండి. ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ చేస్తారో చూద్దాం.
నేచురల్ స్టార్ నాని నటించిన ‘ది ప్యారడైజ్’ చిత్రంలోని ‘ఆయా షేర్’ సాంగ్ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఈ పాట యూట్యూబ్లో 1 మిలియన్ లైక్స్ సాధించి, నాని కెరీర్లోనే ఫాస్టెస్ట్ లిరికల్ సాంగ్గా నిలిచింది. అంతేకాదు దాదాపు 158 గంటల పాటు ట్రెండింగ్లో కొనసాగి పాన్ ఇండియా స్థాయిలో ప్రకంపనలు సృష్టిస్తోంది. నేచురల్ స్టార్ క్రేజ్ను ఇది మరోసారి చాటిచెప...
తమిళ హీరో విజయ్, త్రిషల రిలేషన్పై వస్తున్న వార్తలపై సింగర్ సుచిత్ర సంచలన వ్యాఖ్యలు చేసింది. వీరిద్దరి మధ్య సంబంధం ఉండొచ్చని, కానీ త్రిష విజయ్ని ప్రేమించడం లేదని పేర్కొంది. త్రిష ఉదయనిధి స్టాలిన్ను ప్రేమిస్తోందని, గతంలో త్రిష నిశ్చితార్థం రద్దు కావడానికి కూడా ఆయనే కారణమని పేర్కొంది. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు కోలీవుడ్లో దుమారం రేపుతున్నాయి.
‘ది కేరళ స్టోరీ’ చిత్ర టైటిల్ను మార్చాలంటూ హైకోర్టులో కొత్త పిటిషన్ దాఖలైంది. కేరళ పేరు వాడటం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆ రాష్ట్ర ప్రజలపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఒక రిటైర్డ్ టీచర్, మహిళా లాయర్ ఈ పిటిషన్ వేశారు. ఇది కేవలం ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకున్న ప్రచారమని పేర్కొన్నారు. సినిమా విడుదల తర్వాత ఈ వివాదం మళ్లీ తెరపైకి రావడం చర్చనీయాంశంగా మారింది.
‘పెద్ది’ మూవీ సెకండ్ సింగిల్ ‘రై రై రారా’ పాటపై మెగాస్టార్ చిరంజీవి పోస్ట్ పెట్టిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై దర్శకుడు బుచ్చిబాబు స్పందిస్తూ చిరుకి థ్యాంక్యూ చెప్పాడు. ‘ఆ రోజు నాకు ఇంకా గుర్తుంది. తీవ్ర జ్వరం ఉన్న చరణ్ ఎంతో గ్రేస్తో డ్యాన్స్ చేశాడు. షూటింగ్ ఆపేద్దామని చెప్పిన ఆయన వినలేదు. ఆ డెడికేషన్, ఆ ఆటిట్యూడ్ అన్నీ మీ నుంచి వచ్చినవే’ అంటూ రీట్వీ...
మెగాస్టార్ చిరంజీవి సోషియో ఫాంటసీ మూవీ ‘విశ్వంభర’ నుంచి అప్డేట్ వచ్చేసింది. ఏప్రిల్ 30, 2026న విడుదల కానున్న రామ్ చరణ్ ‘పెద్ది’ థియేటర్లలో ఈ చిత్ర ట్రైలర్ను ప్రదర్శించనున్నట్లు సమాచారం. నెక్స్ట్ లెవెల్ విజువల్స్తో రాబోతున్న ఈ ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలు పెంచుతోంది. ఇక ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని జూన్లో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
రానా దగ్గుబాటి, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబోలో భారీ యాక్షన్ మూవీ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. రానాకు ఉన్న పాన్ ఇండియా క్రేజ్ దృష్ట్యా ఈ కథ ఆయనకు సరిగ్గా సరిపోతుందని బోయపాటి భావిస్తున్నాడట. గతంలో రణ్వీర్ సింగ్కు అనుకున్న కథనే మార్పులు చేసి, అత్యున్నత సాంకేతికతతో తెరకెక్కించనున్నట్లు సమాచారం. ఇది రానా కెరీర్లోనే బిగ్గెస్ట్ మూవీ కానున్నట్లు టాక్.
నటి రష్మిక మందన్న పిల్లల గురించి చేసిన ఎమోషనల్ కామెంట్స్ వైరలవుతున్నాయి. ‘నేను ఇంకా తల్లిని కాలేదు, కానీ ఆ క్షణం కోసం ఎంతో ఇష్టంగా ఎదురుచూస్తున్నాను. నా పిల్లలను ఎంతో సురక్షితంగా, జాగ్రత్తగా చూసుకోవాలి. వారి కోసం యుద్ధం చేయాల్సి వచ్చినా సిద్ధంగా ఉండేంత ఫిట్గా ఉండాలనుకుంటున్నా’ అని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. పిల్లల పట్ల ఆమెకు ఉన్న ప్రేమ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
నటుడు రాఘవ లారెన్స్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కాంచన’ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమా మార్చి 13, 2026న మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా ఈ మూవీ రీ-రిలీజ్ ట్రైలర్కు డేట్ ఫిక్స్ అయింది. మార్చి 4న సాయంత్రం 6:03 గంటలకు ట్రైలర్ విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ మేరకు పోస్టర్ షేర్ చేశారు.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న ‘పెద్ది’ సినిమా నిడివిపై వస్తున్న వార్తలను చిత్ర యూనిట్ కొట్టిపారేసింది. సినిమా 3 గంటల పైగా ఉంటుందనే ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం షూటింగ్ తుది దశలో ఉందని, కేవలం ఫస్టాఫ్ మాత్రమే ఎడిటింగ్ పూర్తయిందని తెలిపింది. ఏప్రిల్ 30న సినిమాను విడుదల చేసేందుకు పనులు శరవేగంగా జరుగుతున్నాయని టీం క్లారిటీ ఇచ్చింది.
విజయ్ దేవరకొండను చూసి మొదట్లో భయపడ్డానని రష్మిక గతంలో చేసిన వ్యాఖ్యలు తాజాగా వైరల్ అవుతున్నాయి. ‘గీత గోవిందం’ షూటింగ్ సమయంలో కొత్త వ్యక్తులతో మాట్లాడటానికి బెరుకుగా ఉండేదని, అందుకే విజయ్తో నటించేటప్పుడు ఆందోళన పడ్డానని పేర్కొంది. విజయ్ చాలా కూల్ అని, అతని వల్ల సెట్లో పాజిటివ్ వాతావరణం ఉంటుందని చెప్పింది. ప్రస్తుతం వీరిద్దరూ ‘రణబాలి’ చిత్రంలో నటిస్తున్నారు.
టాలీవుడ్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వెడ్డింగ్ రిసెప్షన్ మార్చి 4న హైదరాబాద్లోని తాజ్ కృష్ణాలో వైభవంగా జరగనుంది. సాయంత్రం 7 గంటలకు మొదలయ్యే ఈ వేడుకకు భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఆహ్వానితులకు పంపిన ‘వన్ టైమ్ క్యూఆర్ కోడ్’ స్కాన్ చేస్తేనే లోపలికి అనుమతిస్తారు. ఆహ్వానం లేని వారు రావొద్దని నిర్వాహకులు కోరారు. ఇక ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు.
జీ 5లో స్ట్రీమింగ్ అవుతోన్న ‘డాటర్ ఆఫ్ ప్రసాద్రావు: కనబడుటలేదు’ వెబ్సిరీస్ రికార్డులు సృష్టిస్తోంది. రాజీవ్ కనకాల, ఉదయభాను ప్రధాన పాత్రల్లో కృష్ణ పోలూరు తెరకెక్కించిన ఈ థ్రిల్లర్, కేవలం 75 గంటల్లోనే 75 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ సాధించి బ్లాక్ బస్టర్గా నిలిచింది. తండ్రీకూతుళ్ల అనుబంధం, ఉత్కంఠభరిత కథనంతో ఈ సిరీస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
అక్కినేని నాగచైతన్య, దర్శకుడు కార్తీక్ దండు కాంబోలో ‘వృషకర్మ’ మూవీ తెరకెక్కుతోంది. తాజాగా ఈ మూవీ నుంచి గ్లింప్స్ రిలీజ్కు టైం, వేదిక ఖరారైంది. మార్చి 5న ఉదయం 10 గంటలకు HYDలోని ప్రసాద్ PCX స్క్రీన్ వేదికగా విడుదల కానుంది. ఈ విషయాన్ని తెలుపుతూ మేకర్స్ పోస్టర్ షేర్ చేశారు. ఇక మీనాక్షి చౌదరి ప్రధాన పాత్ర పోషిస్తుండగా.. అజనీష్ లోకనాథ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.