కన్నడ నటుడు నిరంజన్పై బెంగళూరులో బీర్ బాటిళ్లతో దాడి జరిగింది. నటుడు యశస్ సూర్య ఇంటి నుంచి వస్తుండగా, ఇన్నోవాలో వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు ‘నువ్వు యాక్టర్ అయిన సరే.. ఇది మా ప్రాంతం’ అంటూ గొడవకు దిగి తలపై కొట్టారు. ఈ దాడిలో నిరంజన్ గాయపడగా, తన చేతి గడియారం కూడా పోగొట్టుకున్నట్లు ఆయన ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
‘డెకాయిట్’ సినిమా ప్రమోషన్స్లో మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘సరికొత్త కథలే నన్ను నటిగా ఆకర్షిస్తాయి. అందుకే డెకాయిట్ ఒప్పుకున్నాను. ఇందులో నేను సరస్వతిగా, అడవి శేష్ హరిగా కనిపిస్తాం. ఈ రోమియో జూలియట్లు డెకాయిట్స్గా ఎందుకు మారారో చెప్పే డ్రామా బాగుంటుంది. నన్ను నేనే ఆశ్చర్యపరచుకునే పాత్రలో నటించడం ఆనందంగా ఉంది’ అంటూ చెప్పుకొచ్చింది.
‘ధురంధర్ 2 వస్తోన్న ప్రశంసలపై కమెడియన్ జాకీర్ ఖాన్ సెటైర్లు వేశాడు. ఈ మూవీ విజయంపై బాలీవుడ్ ప్రశంసలన్నీ అబద్ధమని, అందరికీ లోలోపల అసూయగా ఉందని తెలిపాడు. స్క్రీన్ అవార్డ్స్ 2026 వేదికగా ఆయన మాట్లాడుతూ.. బయటకు ఇన్స్టా స్టోరీలతో పొగుడుతున్నా, ఈ సక్సెస్ను పరిశ్రమ వర్గాలు ఓర్వలేకపోతున్నాయన్నాడు. ప్రస్తుతం ఈ ఘాటు వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
సాయి తేజ్, వేద జలంధర్ జంటగా నటిస్తున్న విలేజ్ పీరియాడిక్ డ్రామా ‘తిమ్మరాజుపల్లి టీవీ’. మునిరాజు దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రాన్ని హీరో కిరణ్ అబ్బవరం నిర్మిస్తున్నాడు. ఏప్రిల్ 17న విడుదల కానున్న ఈ మూవీ సీడెడ్ హక్కులను SLN సినిమాస్ కైవసం చేసుకుంది. ప్రస్తుతం ఈ చిత్రంపై మంచి అంచనాలు నెలకొన్నాయి.
బాలీవుడ్ నటి కరిష్మా తన్న 42ఏళ్ల వయసులో తల్లి కాబోతుంది. భర్త వరుణ్ బంగేరాతో కలిసి దిగిన క్యూట్ ఫొటోలను షేర్ చేస్తూ ఈ శుభవార్త చెప్పింది. ఒక ఫొటోలో ‘MOM’, ‘DAD’ అని రాసి ఉన్న టోపీలు ధరించి ప్రత్యేకంగా కనిపించారు. ఈ వయసులో తొలి బిడ్డకు జన్మనివ్వబోతుండటంతో నెటిజన్లు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రస్తుతం ఈ ప్రెగ్నెన్సీ పోస్ట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తమిళ బుల్లితెర నటి సుభాషిణి చెన్నైలో ఆత్మహత్యకు పాల్పడింది. షూటింగ్ కోసం పోరూరులో ఉంటున్న ఆమె ఉరివేసుకుని చనిపోయింది. భర్త బిపిన్ చంద్రతో వీడియో కాల్లో ఉండగా కుటుంబ విషయమై గొడవపడి మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన తమిళ టీవీ పరిశ్రమలో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
ఈ వారం పలు సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాయి. ఏప్రిల్ 9న ‘పళ్లి చట్టంబి’, ఏప్రిల్ 10న ‘డెకాయిట్’, ‘LIK'(లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ) సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. మరోవైపు ఏప్రిల్ 10న జియో హాట్స్టార్లో ‘తాయ్ కిళవి’, అమెజాన్ ప్రైమ్లో ‘ఓ రోమియో’ సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి.
రామ్ చరణ్, బుచ్చిబాబు సాన కాంబోలో వస్తున్న రూరల్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ విడుదలకు ముందే సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను నెట్ఫ్లిక్స్ రూ. 130 కోట్లకు సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఒకవేళ సినిమా సూపర్ హిట్ అయితే సదరు సంస్థ మరో రూ. 20 కోట్ల బోనస్గా చెల్లించనుందట. చరణ్ గ్లోబల్ క్రేజ్కు ఇది నిదర్శనమని సినీ వర్గాలు తెలిపాయి.
వరుస ఫ్లాప్స్లో ఉన్న రామ్ పోతినేని, లోకేష్ కనగరాజ్ శిష్యుడి దర్శకత్వంలో ఒక పవర్ఫుల్ యాక్షన్ సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో రామ్ను కొత్తగా చూపించనున్నట్లు టాక్. దీనికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నాడట. రామ్ ఎనర్జీ, అనిరుధ్ మ్యూజిక్ కలిస్తే థియేటర్లలో పూనకాలేనని, ఈ చిత్రం రామ్కు గట్టి కమ్ బ్యాక్ ఇస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
దర్శకుడు రాజమౌళి అంతర్జాతీయ స్థాయి VFX స్టూడియోను ఏర్పాటు చేశాడు. ప్రస్తుతం ఆయన పర్యవేక్షణలో రూపొందుతున్న ‘వారణాసి’ మూవీకి సంబంధించిన సింహభాగం విజువల్ ఎఫెక్ట్స్ పనులు ఇక్కడే జరుగుతున్నాయి. మరికొన్ని అంతర్జాతీయ స్టూడియోలు కూడా దీనికి సహకరిస్తున్నాయి. రాజమౌళి విజన్, సొంత స్టూడియో సాంకేతికత తోడైతే విజువల్స్ అద్భుతమైన రేంజ్లో ఉండటం ఖాయమని సినీ వర్గాలు తెలిపాయి.
అల్లు అర్జున్, అట్లీ కాంబోలో రానున్న మూవీకి యుద్ధం సెగ తగిలింది. ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతల వల్ల దుబాయ్, అబుదాబి షూటింగ్ షెడ్యూల్స్ క్యాన్సిల్ అయినట్లు తెలుస్తోంది. దీంతో అట్లీ కొత్త లొకేషన్ల వేటలో పడినట్లు టాక్. ఇక బన్నీ బర్త్డే ఏప్రిల్ 8 నాడు టీజర్ వస్తుందని ఫ్యాన్స్ ఆశించినా, VFX పనులు ఆలస్యం కావడంతో కేవలం టైటిల్ అనౌన్స్మెంట్ మాత్రమే వచ్చే అవకాశం ఉందట.
‘ధురంధర్ 2’ భారీ విజయంతో నటి సారా అర్జున్ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. చిత్ర దర్శకుడు ఆదిత్య ధర్, హీరో రణ్వీర్ సింగ్లతో దిగిన ఫొటోలను షేర్ చేస్తూ.. ఈ సక్సెస్ క్రెడిట్ మొత్తం తెర వెనుక హీరోలకే దక్కుతుందని తెలిపింది. టీమ్ పడ్డ కష్టం, వారి నిబద్ధతే సినిమాకు వెన్నెముక అని, ఈ విజయాన్ని చిత్రబృందానికి అంకితం ఇస్తున్నట్లు సారా తన పోస్ట్లో పేర్కొంది.
రవి కిరణ్ కోలా దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటిస్తున్న మూవీ ‘రౌడీ జనార్ధన’. ఇందులో పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే ‘కూలీ’లో మెరిసిన పూజ, విజయ్తో కలిసి డ్యాన్స్ చేయనుండటం ఆసక్తిగా మారింది. ఇక ఈ మూవీ ఫ్లాష్బ్యాక్లో విజయ్ ఫుల్ యాక్షన్ మోడ్లో కనిపిస్తాడని, మూవీ మొత్తానికి ఈ యాక్షన్ సీన్లే ప్రధాన హైలైట్గా నిలుస్తాయని టాక్.
హైదరాబాద్ తారామతి బారాదరిలో ‘మోర్ దేన్ ఫ్రెండ్స్’ డ్రగ్ పార్టీ కలకలం రేపింది. పోలీసులు జరిపిన దాడిలో బాలీవుడ్ నటుడు అబ్దుల్ సర్వర్ సహా పలువురు పట్టుబడ్డారు. పరీక్షల్లో అబ్దుల్, మరో ఐదుగురు కొకైన్, గంజాయి వాడినట్లు తేలింది. సుమారు 300 మంది పాల్గొన్న ఈ పార్టీపై నార్కోటిక్స్ పోలీసులు కేసు నమోదు చేసి, డ్రగ్స్ సరఫరా మూలాలపై దర్యాప్తు ముమ్మరం చేశారు.
అఖిల్ అక్కినేని హీరోగా నటిస్తున్న ‘లెనిన్’ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. రాయలసీమ బ్యాక్డ్రాప్లో, చిత్తూరు నేపథ్యంలో సాగే ఈ మూవీ 2026, జూన్ 26న విడుదల కానుంది. ప్రస్తుతం అఖిల్ తన పాత్ర కోసం చిత్తూరు యాసలో డబ్బింగ్ చెబుతున్నాడు. ఇంకా ఘాట్ సీన్లు బ్యాలెన్స్ ఉన్నా, పోస్ట్ ప్రొడక్షన్ పనులను టీమ్ వేగవంతం చేస్తోంది. ఇందులో భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తోంది.