తమిళనాడు ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ దూసుకుపోతోన్న వేళ, నిర్మాత బండ్ల గణేష్ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. హీరోయిన్ త్రిషను ట్యాగ్ చేస్తూ, ‘ఆ తిరుమల వెంకటేశ్వరుడి ఆశీస్సులతో మీ కల నిజం కాబోతోంది.. కంగ్రాట్స్ త్రిష’ అని పేర్కొన్నాడు. ఇది కేవలం నటుడు విజయ్ రాజకీయ విజయానికే కాకుండా, త్రిష పొలిటికల్ ఎంట్రీకి కూడా సంకేతమని నెటిజన్లు భావిస్తున్నారు.
తమిళనాడు ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ దూసుకుపోతోన్న వేళ, నిర్మాత బండ్ల గణేష్ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. హీరోయిన్ త్రిషను ట్యాగ్ చేస్తూ, ‘ఆ తిరుమల వెంకటేశ్వరుడి ఆశీస్సులతో మీ కల నిజం కాబోతోంది.. కంగ్రాట్స్ త్రిష’ అని పేర్కొన్నాడు. ఇది కేవలం నటుడు విజయ్ రాజకీయ విజయానికే కాకుండా, త్రిష పొలిటికల్ ఎంట్రీకి కూడా సంకేతమని నెటిజన్లు భావిస్తున్నారు.
ప్రభాస్, దర్శకుడు నాగ్ అశ్విన్ కాంబోలో రాబోతున్న ‘కల్కి 2’ షూటింగ్ దశలో ఉంది. తాజాగా ఈ సినిమా గురించి వినిపిస్తున్న ఒక ఆసక్తికరమైన అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మూవీ షూటింగ్లో ప్రభాస్ ఇవాళ జాయిన్ అయ్యాడట. ఈ షెడ్యూల్లో ఎక్కువగా నైట్ షూట్స్ ఉండబోతున్నాయట. ప్రభాస్ సుమారు వారం రోజుల పాటు ఈ కీలక షెడ్యూల్లో పాల్గొంటారని టాక్.
ప్రభాస్, దర్శకుడు నాగ్ అశ్విన్ కాంబోలో రాబోతున్న ‘కల్కి 2’ షూటింగ్ దశలో ఉంది. తాజాగా ఈ సినిమా గురించి వినిపిస్తున్న ఒక ఆసక్తికరమైన అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మూవీ షూటింగ్లో ప్రభాస్ ఇవాళ జాయిన్ అయ్యాడట. ఈ షెడ్యూల్లో ఎక్కువగా నైట్ షూట్స్ ఉండబోతున్నాయట. ప్రభాస్ సుమారు వారం రోజుల పాటు ఈ కీలక షెడ్యూల్లో పాల్గొంటారని టాక్.
టీవీకే అధినేత విజయ్ను ప్రశంసిస్తూ సెలబ్రిటీలు పోస్ట్లు పెడుతున్నారు. ప్రజలు ఎవరిని కోరుకుంటారో విజయం వారినే వరిస్తుందని మరోసారి రుజువైందని వరలక్ష్మి శరత్ కుమార్ పోస్ట్ పెట్టారు. ‘ఇది చారిత్రాత్మక విజయం. గతంలో ఇలాంటి గెలుపు లేదు.. భవిషత్తులో రాదు’ అని జీవి ప్రకాశ్ పేర్కొన్నాడు. ‘మీపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని చూస్తుంటే ఆనందంగా ఉంది’ అని టైగర్ ష్రాఫ్ ట్వీట్ చేశాడు.
తమిళనాడు ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన విజయ్ (TVK)కి నేచురల్ స్టార్ నాని అభినందనలు తెలిపాడు. ‘మొదట అనుమానించారు, ఇప్పుడు పట్టాభిషేకం చేశారు. ఇది మా ఇంట్లో (పవన్ కళ్యాణ్) మొదలై, ఇప్పుడు పొరుగు ఇంట్లోనూ (విజయ్) జరిగింది. ఒక అండర్ డాగ్ గెలవడం అబ్సల్యూట్ సినిమాలా ఉంది!” అంటూ ట్వీట్ చేశాడు. ప్రజల నమ్మకాన్ని విజయ్ నిలబెట్టుకుంటారని ఆకాంక్షించాడు.
అక్షయ్ కుమార్, టబుల ‘భూత్బంగ్లా’పై వస్తున్న రూమర్లపై దర్శకుడు ప్రియదర్శన్ తీవ్రంగా స్పందించాడు. అక్షయ్ జోక్యంతో టబు సీన్లు కట్ చేశారన్న వార్తలను ఆయన ఖండించాడు. ‘ఎడిటింగ్ నా బాధ్యత, అక్షయ్ ఎప్పుడూ జోక్యం చేసుకోలేదు. సినిమా చూశాకే నటీనటులు సంతృప్తి చెందారు. ఇలాంటి అబద్ధపు ప్రచారాలు చేసేవారు సిగ్గుపడాలి” అంటూ నెటిజన్ల విమర్శలపై ఆయన నిప్పులు చెరిగాడు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే సత్తా చాటుతూ గెలుపు దిశగా పరుగులు తీస్తోంది. దీంతో ఆ పార్టీ అధినేత విజయ్ను ప్రశంసిస్తూ నాని SMలో పోస్ట్ పెట్టాడు. ‘మొదట అందరూ ఈ పార్టీ గెలుస్తుందా అని సందేహించారు. కానీ, ప్రజలు దానికే పట్టంకట్టారు. మన రాష్ట్రంలోనూ గతంలో ఇలాంటి విజయమే నమోదైంది. విజయ్ విజయం సినిమాను తలపిస్తోంది. బహుశా ఇదేనేమో రాజకీయం అంటే’ అని పేర్కొన్నాడు.
తమిళనాడు ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ సంచలనం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో నటి త్రిష రాజకీయ అరంగేట్రంపై చర్చ మొదలైంది. విజయ్ రెండు చోట్ల గెలిస్తే, ఒక స్థానాన్ని వదులుకుని అక్కడ త్రిషను బరిలోకి దింపుతారనే ప్రచారం సాగుతోంది. ఇదే నిజమైతే ఆమె ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ఈ వార్త ఇటు సినీ, అటు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
రష్మిక మందన్నా తన సోదరి సిమ్రాన్ 13వ పుట్టినరోజు సందర్భంగా షేర్ చేసిన పోస్ట్ నెటిజన్ల మనసు గెలుచుకుంటోంది. ‘నువ్వు టీనేజ్లోకి అడుగుపెడుతున్నావు, ఎన్నో నేర్చుకుంటావు. కానీ నీ చిరునవ్వును, అమాయకత్వాన్ని మాత్రం ఎప్పటికీ కోల్పోవద్దు’ అంటూ అక్కగా విలువైన సలహా ఇచ్చింది. ఈ సందర్భంగా తన చెల్లెలితో చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు గడిపిన కొన్ని అరుదైన ఫొటోలను అభిమానులతో పంచుకుంది.
నటుడు రాజశేఖర్ తన వివాహ బంధం వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. మొదట శ్రీదేవి తనను పెళ్లి చేసుకోవాలని అడిగినా, కుల కట్టుబాట్ల వల్ల అది కుదరలేదని తెలిపాడు. ఆ సమయంలో జీవితతో ఈ విషయం చెప్పగా.. ‘నీ నిర్ణయం నీది, కానీ నువ్వు వేరొకరిని పెళ్లి చేసుకుంటే నేను మాత్రం జీవితాంతం ఒంటరిగానే ఉండిపోతాను’ అని ఆమె చెప్పిన మాటలు తనను కదిలించాయని ఆయన వెల్లడించాడు.
నందమూరి బాలకృష్ణ, కొరటాల శివ కాంబోలో ‘NBK 112’ మూవీ రాబోతుంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్లో హీరోయిన్గా విద్యాబాలన్, కీలక పాత్రలో సంజయ్ దత్ నటించనున్నట్లు సమాచారం. ఆగస్టులో షూటింగ్ ప్రారంభం కానుండగా, సోషల్ మెసేజ్ కలిగిన మాస్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం తెరకెక్కనుంది. దీనితో నందమూరి అభిమానుల్లో పండగ వాతావరణం నెలకొంది.
రామ్ చరణ్, బుచ్చిబాబుల ‘పెద్ది’ థియేట్రికల్ రైట్స్ కోసం భారీ పోటీ నెలకొంది. ముఖ్యంగా ఈస్ట్ గోదావరి హక్కుల కోసం నిర్మాతలు రూ. 13 కోట్లు కోట్ చేయగా, బయ్యర్లు రూ. 11 కోట్లు ఆఫర్ చేస్తున్నారట. మరోవైపు నెల్లూరు రైట్స్ రూ. 4 కోట్లు పలుకుతున్నట్లు టాక్. జూన్ 4న విడుదల కానున్న ఈ చిత్రం, గ్లోబల్ స్టార్ క్రేజ్తో ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.
మద్యం అలవాటుపై తన వ్యాఖ్యలను వక్రీకరించిన మీడియా సంస్థలపై నటి జాన్వీ కపూర్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘అమహా’ సంస్థ నిర్వహించిన పాడ్కాస్ట్లో ఆమె మాట్లాడిన మాటలను కొన్ని సంస్థలు తప్పుగా చిత్రించాయి. తన వ్యక్తిగత అనుభవాలను కేవలం అవగాహన కోసమే పంచుకున్నానని, వాస్తవాలను తెలుసుకోకుండా తప్పుడు ప్రచారం చేయవద్దని ఆమె కోరింది. ఈ మేరకు సదరు సంస్థలు కూడా వివరణ ఇచ్చాయి.
మెగాస్టార్ చిరంజీవి, త్రిష ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మూవీ ‘విశ్వంభర’. ఇవాళ త్రిష బర్త్ డే సందర్భంగా మేకర్స్.. ఆమెకు విషెస్ చెబుతూ ఫస్ట్ లుక్ పోస్టర్ షేర్ చేశారు. ఈ సినిమాలో ఆమె ‘అవని’ పాత్రలో కనిపించనున్నట్లు తెలిపారు. చేతిలో మంగళహారతి పట్టుకున్న త్రిష పోస్టర్ ప్రస్తుతం నెటిజన్లను ఆకట్టుకుంటోంది.