కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కుమారుడి వివాహ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి, కేటీఆర్ సందడి చేశారు. ఇద్దరూ ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుని, కాసేపు ముచ్చటించారు. అనంతరం నూతన వధూవరులను ఆశీర్వదించారు. రాజకీయ, సినీ రంగ ప్రముఖులు కలిసిన ఈ అరుదైన దృశ్యాలకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
భారతరత్న ఎం.ఎస్. సుబ్బలక్ష్మి గారి బయోపిక్ను ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్నాడట. మొదట ఈ పాత్రకు సాయి పల్లవిని అనుకున్నప్పటికీ, ‘రామాయణ’ వంటి చిత్రాలతో ఆమె బిజీగా ఉండటంతో కాల్షీట్ల సమస్య తలెత్తింది. దీంతో ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోగా, ఆ స్థానంలో కన్నడ నటి రుక్మిణి వసంత్ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
యష్ నటిస్తున్న ‘టాక్సిక్’పై నటి రుక్మిణి వసంత్ చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్గా మారింది. ఈ మూవీ కోసం తాను ఎంతో ఉత్సాహంగా ఉన్నానని, గీతూ మోహన్దాస్ సృష్టిస్తున్న ఆ కొత్త ప్రపంచాన్ని చూడాలని ఆత్రుతగా ఉందని పేర్కొంది. గీతూ తన సినిమాల్లో మహిళా పాత్రలను చాలా పవర్ఫుల్గా డిజైన్ చేస్తారు. కాబట్టి ఈ మూవీలో రుక్మిణి పాత్ర ఎంతో విభిన్నంగా ఉండబోతోందని సమాచారం.
‘కర’లో హీరోయిన్గా మమితా బైజు ఎంపిక వెనుక ఉన్న ఆసక్తికర విషయాన్ని దర్శకుడు విఘ్నేష్ రాజా పంచుకున్నాడు. తొలుత చైత్ర జె. ఆచార్ను అనుకున్నా, ఆమె మరో సినిమా ‘మై లార్డ్’ లోనూ అదే తరహా లుక్లో ఉండటంతో రిస్క్ తీసుకోలేదన్నాడు. మమితా ఇప్పటివరకు చేసిన చురుకైన పాత్రలకు భిన్నంగా ఇందులో సీరియస్ రోల్ ఉంటుందని, ఆమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం తనను ఆశ్చర్యపరిచిందని తెలిపాడు.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, దర్శకుడు మేర్లపాక గాంధీ కాంబోలో వస్తున్న ‘కొరియన్ కనకరాజు’ చిత్రంపై అంచనాలు పెరుగుతున్నాయి. ఇందులో రితికా నాయక్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం రాశి ఖన్నాను ఎంపిక చేసినట్లు టాక్. గతంలో వరుణ్, రాశి కలిసి నటించిన నేపథ్యం ఉండటంతో వీరి కాంబో మళ్లీ సందడి చేయనున్నట్లు టాక్. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా సాగుతోంది.
బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ OCTలో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈసారి కంటెస్టెంట్ల కోసం మేకర్స్ భారీగా ఖర్చు చేస్తున్నారట. ముఖ్యంగా తేజస్విని గౌడ వారానికి రూ.6 లక్షలు, కావ్య శ్రీ రూ.5 లక్షల రెమ్యూనరేషన్ అందుకోనున్నట్లు సమాచారం. వీరిద్దరే దాదాపు రూ.1.60 కోట్లు వసూలు చేసే అవకాశం ఉంది. సామాన్యులతో పాటు క్రేజీ సెలబ్రిటీలతో ఈ సీజన్ మరింత రసవత్తరంగా ఉండనున్నట్లు టాక్.
సీనియర్ నటి ఆమని ఆసక్తికర విషయాలను పంచుకుంది. మెగాస్టార్ చిరంజీవి అంటే తనకు ఎంతో ఇష్టమని, ఆయన పక్కన హీరోయిన్గా నటించాలన్నది తన డ్రీమ్ తెలిపింది. అయితే ‘స్టాలిన్’లో చిరంజీవికి చెల్లెలి పాత్రలో నటించే అవకాశం వచ్చినా, తన డ్రీమ్ హీరోను అన్నయ్యగా చూడలేక ఆ ఆఫర్ను తిరస్కరించినట్లు పేర్కొంది. భవిష్యత్తులో ఆయన సరసన నటించే అవకాశం వస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపింది.
తమిళ హీరో ధనుష్, దర్శకుడు విఘ్నేష్ రాజా కాంబోలో రాబోతున్న ‘కారా’ మూవీ 2026 ఏప్రిల్ 30న విడుదల కానుంది. తాజాగా ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ ఫిక్స్ అయ్యింది. HYDలోని ట్రిడెంట్ హోటల్లో ఇవాళ సాయంత్రం 5 గంటలకు ఈ వేడుక స్టార్ట్ కానుండగా.. మెగా హీరో సాయి దుర్గా తేజ్ ముఖ్య అతిథిగా పాల్గొనున్నాడట. ఇక ఈ మూవీలో మమితా బైజు కథానాయికగా నటిస్తుండగా.. GV ప్రకాష్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
బిగ్బాస్ ఫేమ్ అషురెడ్డి, ఆమె కుటుంబంపై నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ధర్మేంద్ర అనే యువకుడి నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. రూ.3 కోట్ల విల్లాకు అడ్వాన్స్, 5 కిలోల బంగారం తీసుకుని, చివరకు పెళ్లికి నో చెప్పడంతో మోసపోయామని బాధితుడి తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.
తనపై వస్తున్న రూ.9.35 కోట్ల చీటింగ్ ఆరోపణలను అషురెడ్డి ఖండించింది. పెళ్లి పేరుతో తాను మోసం చేశానన్న వార్తల్లో నిజం లేదని, అవన్నీ అవాస్తవాలని స్పష్టం చేసింది. తన అనుమతి లేకుండా ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించింది. షేక్పేట్కు చెందిన వ్యక్తి ఫిర్యాదుతో కేసు నమోదైనట్లు వస్తున్న వార్తలపై ఆమె ఈ విధంగా ఘాటుగా స్పందించింది.
సినీ ఇండస్ట్రీలో OTT ఇప్పుడు సేఫ్టీ నెట్ కాదు.. ఒక సవాల్గా మారింది. స్టార్ పవర్తో సంబంధం లేకుండా పెర్ఫార్మెన్స్ బేస్డ్ డీల్స్ అమల్లోకి వచ్చాయి. అంటే బాక్సాఫీస్ వసూళ్లను బట్టే OTT రేటు ఖరారవుతుంది. థియేటర్లలో ఫ్లాప్ అయితే OTT పేమెంట్లో కోత విధిస్తున్నారు. రిలీజ్ ఆలస్యమైనా అగ్రిమెంట్లు రద్దవుతున్నాయి. ఈ రూల్స్ నిర్మాతలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి తన తదుపరి ప్రాజెక్ట్ కోసం సిద్ధమవుతున్నాడు. ‘అనగనగా ఒక రాజు’ ఘనవిజయం తర్వాత, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో ఆయన ఒక క్రేజీ సినిమా చేయబోతున్నాడట. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు తుది దశలో ఉన్నట్లు సమాచారం. ఈ చిత్రానికి నవీన్ భారీ పారితోషికంతో పాటు లాభాల్లోనూ వాటా అందుకోనున్నారట. ఈ ఏడాది ఆఖరున దీనిపై అధికారిక ప్రకటన రానున్నట్లు టాక్.
మంచు మనోజ్ హీరోగా హనుమరెడ్డి యక్కంటి దర్శకత్వంలో ‘డేవిడ్ రెడ్డి’ మూవీ శరవేగంగా సిద్ధమవుతోంది. బ్రిటిష్ వారిపై పోరాడిన ఓ యోధుడి కథాంశంతో వస్తున్న ఈ మూవీ ఫైనల్ కట్ చూశాక, కొన్ని కీలక సీన్లను రీషూట్ చేయాలని మేకర్స్ నిర్ణయించారు. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్ షూటింగ్లో మనోజ్ సహా చిత్ర తారాగణం పాల్గొనబోతున్నారట. ప్రస్తుతం దీని పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్కు కర్ణాటక హైకోర్టు షరతులతో కూడిన ఊరటనిచ్చింది. ‘కాంతార’ చిత్రంలోని దైవారాధనను అనుకరించి భక్తుల మనోభావాలు దెబ్బతీశారనే కేసులో.. నాలుగు వారాల్లోగా మైసూరు చాముండేశ్వరి అమ్మవారిని దర్శించుకోవాలని కోర్టు ఆదేశించింది. ఈ ప్రాయశ్చిత్తం తర్వాతే ఎఫ్.ఐ.ఆర్ కొట్టివేస్తామని స్పష్టం చేస్తూ, సెలబ్రిటీలు సంస్కృతిపై జాగ్రత్తగా ఉండాలని హితవు పలికింది.
టాలీవుడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వివాహం కావ్యారెడ్డితో ఈ నెల 29న తిరుమలలో జరగనుంది. ఇప్పటికే ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. సాయి శ్రీనివాస్ తన కుటుంబంతో కలిసి చిరంజీవి, నాగార్జున వంటి సినీ ప్రముఖులను, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని వ్యక్తిగతంగా కలిసి ఆహ్వాన పత్రికలు అందజేశారు. ఈ పెళ్లి వేడుకకు ఇండస్ట్రీ దిగ్గజాలు హాజరుకానున్నారు.