‘బేబీ’ చిత్ర దర్శకుడు సాయి రాజేష్ ఇండస్ట్రీ పోకడలపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ‘బేబీ’ విడుదలై ఉంటే సగం షేర్ కూడా వచ్చేది కాదని అన్నాడు. డబ్బులిచ్చి యూట్యూబ్ వ్యూస్, కామెంట్స్, ట్విట్టర్ ట్రెండ్స్ కొనుగోలు చేయడం వల్ల అసలైన ప్రజాభిప్రాయం తెలియడం లేదన్నాడు. ఈ ఫేక్ ప్రమోషన్ల వల్ల ప్రేక్షకులకు విరక్తి కలిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు.