రామ్ చరణ్, శ్రుతి హాసన్ కాంబోలో ‘పెద్ది’ మూవీ కోసం ఓ క్రేజీ స్పెషల్ సాంగ్ సిద్ధమవుతోంది. ఏప్రిల్ 26 నుంచి ఈ పాట చిత్రీకరణ ప్రారంభం కానున్నట్లు టాక్. గతంలో ‘ఎవడు’ చిత్రంలో వీరిద్దరి జోడీ సూపర్ హిట్ డ్యూయెట్స్తో మెప్పించగా, మళ్లీ ఇన్నాళ్లకి ఈ జోడీ ఒకే సాంగ్లో కనిపించడం విశేషం. ఈ స్పెషల్ సాంగ్ పాత మ్యాజిక్ని మించి మాస్ ఊపు తెస్తుందేమో చూడాలి.
ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న ఫౌజీ, స్పిరిట్, కల్కి 2 మూవీలపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, తాజాగా ‘స్పిరిట్’ షెడ్యూల్లో వచ్చిన చిన్న మార్పు ‘కల్కి 2’పై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ నెలలో జరగాల్సిన ‘స్పిరిట్’ షూటింగ్ రద్దు కావడంతో, ప్రభాస్ యూరప్ వెకేషన్కు వెళ్లాడట. దీంతో మేలో ‘స్పిరిట్’ కొత్త షెడ్యూల్ ప్లాన్ చేయగా, ‘కల్కి 2’ ష...
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రాకు మరో అరుదైన గౌరవం దక్కింది. గోల్డ్ హౌస్ సంస్థ ఆమెకు ‘గ్లోబల్ వాన్ గార్డ్’ పురస్కారాన్ని ప్రకటించింది. సినీ రంగంలో 25 ఏళ్ల ప్రస్థానం, ఆసియా-పాసిఫిక్, వెస్ట్రన్ ఇండస్ట్రీల మధ్య వారధిగా నిలిచినందుకు ఈ అవార్డు దక్కింది. మే 9న లాస్ ఏంజెల్స్లో జరిగే ‘గోల్డ్ గాలా 2026’ ఐదో వార్షికోత్సవ వేడుకలో ప్రియాంక ఈ సత్కారం అందుకోనుంది.
నేచురల్ స్టార్ నానితో సినిమా చేయడంపై దర్శకుడు తరుణ్ భాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నాని ఒక అద్భుతమైన నటుడని, ఆయనతో సినిమా చేయాలనేది తన చిరకాల కోరిక అని తెలిపాడు. నాని బాడీ లాంగ్వేజ్కు తగినట్లుగా ఒక పవర్ఫుల్, వైవిధ్యమైన కథను సిద్ధం చేస్తున్నట్లు చెప్పాడు. కేవలం కమర్షియల్ హంగులే కాకుండా, సరికొత్త అనుభూతిని పంచేలా ఈ చిత్రం ఉంటుందని అన్నాడు.
లావణ్య త్రిపాఠి, దేవ్ మోహన్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ మూవీ ‘సతీ లీలావతి’. మార్చి 6, 2026న విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా పడిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది. 2026 మే 8న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ చిత్రాన్ని తాతినేని సత్య తెరకెక్కించగా.. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందించాడు.
కమల్ హాసన్ నిర్మాణంలో రజినీకాంత్, ‘డాన్’ ఫేమ్ సిబి చక్రవర్తి కాంబోలో ‘తలైవార్ 173’ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాలో విలన్ పాత్రలో దర్శకుడు శంకర్ నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన కూడా ఇందుకు ఓకే చెప్పినట్లు సమాచారం. అంతేకాదు కమల్ హాసన్ కూడా ఇందులో ఓ కీలక పాత్రలో కనిపించనున్నట్లు టాక్. ఇక ఈ సినిమా 2027 సంక్రాంతికి విడుదల కానున్నట్లు తెలుస్తోంది.
డైరెక్టర్ బోయపాటి శ్రీను తదుపరి ప్రాజెక్ట్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అల్లు అర్జున్, సూర్య వంటి స్టార్ హీరోలతో మూవీలు చేస్తారని ప్రచారం సాగినా, ఇప్పటికీ అధికారిక స్పష్టత లేదు. తాజా సమాచారం ప్రకారం, ఆయన బాలీవుడ్ హీరో సన్నీ డియోల్తో ‘జాట్ 2’ లేదా మరో భారీ యాక్షన్ చిత్రం చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరో వారం రోజుల్లో దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
కన్నడ నటుడు ధ్రువ సర్జా నటించిన ‘కేడీ: ది డెవిల్’ మూవీ ట్రైలర్ యూట్యూబ్ నుంచి అదృశ్యం కావడం చర్చనీయాంశమైంది. సెన్సార్ బోర్డు ధ్రువీకరించని కంటెంట్ను పొరపాటున అప్లోడ్ చేయడమే దీనికి కారణమని నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్ తెలిపింది. తప్పును సరిదిద్ది, నిబంధనల ప్రకారం రివైజ్డ్ వెర్షన్ను త్వరలోనే విడుదల చేస్తామని పేర్కొంది. ఇక ఈ మూవీ ఏప్రిల్ 30న విడుదల కానుంది.
నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబోలో వస్తున్న ‘ది ప్యారడైజ్’ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ఈ చిత్రంలో నాని, మోహన్ బాబు మధ్య వచ్చే సన్నివేశాలు హైలైట్గా ఉండబోతున్నాయని సమాచారం. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో కీలక సీన్లను చిత్రీకరించగా, అవి అద్భుతంగా వచ్చాయని టాక్. థియేటర్లలో ఈ ఇద్దరి నటన వెండితెరపై మ్యాజిక్ క్రియేట్ చేయడం ఖాయమని తెలుస్తోంది.
ప్రముఖ కమెడియన్ సత్య హీరోగా, దర్శకుడు రితేష్ రానా కాంబోలో వస్తున్న చిత్రం ‘జెట్లీ’. 2026, మే 1న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. తాజాగా ఈ మూవీ సెన్సార్ పనులు పూర్తయ్యాయి. సెన్సార్ సభ్యులు ఈ మూవీకి U/A సర్టిఫికెట్ జారీ చేశారు. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇక ఇందులో మిస్ యూనివర్స్ ఇండియా-2024 రియా సింఘా హీరోయిన్గా నటించింది.
అర్జున్ సర్జా మూవీ ‘జెంటిల్ మెన్’పై హీరో రాజశేఖర్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఆ చిత్రంలో హీరోగా నటించమని మేకర్స్ తనను అడిగారని, అడ్వాన్స్ కూడా ఇచ్చేందుకు సిద్ధమయ్యారని తెలిపాడు. అయితే, ఆ సమయంలో తాను ‘అల్లరి ప్రియుడు’ సినిమా షూటింగ్లో బిజీగా ఉండటం వల్ల డేట్లు ఇవ్వలేకపోయానని, అందుకే ఆ ఆఫర్ను వదులుకోవాల్సి వచ్చిందని వివరించాడు.
ప్రభాస్ ‘డార్లింగ్’ రీ-రిలీజ్ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. మొదటి రోజే రూ.7 కోట్లకు పైగా గ్రాస్ సాధించిన ఈ చిత్రం, రెండో రోజు మరో రూ.2 కోట్లు రాబట్టి మొత్తం రూ. 9.36 కోట్లకు చేరుకున్నట్లు టాక్ నడుస్తోంది. కాజల్ కథానాయికగా, జీవీ ప్రకాష్ సంగీతం, ప్రభు, చంద్రమోహన్ కీలక పాత్రల్లో నటించిన ఈ క్లాసిక్ లవ్ స్టోరీ ఫ్యాన్స్ను థియేటర్లకు రప్పిస్తోంది.
నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబోలో వస్తున్న 111వ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ముందుగా చారిత్రక నేపథ్యం అనుకున్నా, ఇప్పుడు బాలయ్య పవర్ ఫుల్ గ్యాంగ్ స్టర్ రోల్లో కనిపించబోతున్నారట. ‘వీరసింహా రెడ్డి’ తర్వాత వస్తున్న ఈ మూవీలో ఆయన పాత్రకు డార్క్ షేడ్స్ ఉండటం విశేషం. వృద్ధి సినిమాస్ నిర్మిస్తున్న ఈ చిత్రం అభిమానులకు పక్కా మాస్ ఫీస్ట్ అని చెప్పొచ్చు.
అక్కినేని అఖిల్ ‘లెనిన్’ మూవీ విడుదల తేదీపై సస్పెన్స్ కొనసాగుతోంది. జూన్ 26న రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం, ‘పెద్ది’ సినిమా జూన్ 25న రాబోతున్నట్లు వార్తలు రావడంతో వాయిదా పడే ఛాన్స్ ఉంది. నిర్మాత నాగవంశీ ఈ పోటీని నివారించేందుకు జూలై చివరి వారం లేదా ఆగస్టు మొదటి వారానికి లెనిన్ విడుదలను మార్చాలని చూస్తున్నట్లు సమాచారం. దీనిపై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కుమార్తెపై సైబర్ వేధింపులకు పాల్పడిన వ్యక్తిని మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. అక్షయ్ కుమార్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ విభాగం నిందితుడిని పట్టుకుంది. వేధింపులపై ఆమె ధైర్యంగా తల్లిదండ్రులకు చెప్పడం వల్లే నిందితుడిని త్వరగా పట్టుకోగలిగామని ADG యశస్వి తెలిపారు. ప్రస్తుతం ఈ కేసుపై తదుపరి విచారణ కొనసాగుతోంది.