చిరంజీవి ‘మన శంకర వర ప్రసాద్ గారు’ జనవరి 12న విడుదల కానుంది. ఈ చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్లో రికార్డు స్థాయి వసూళ్లు సాధిస్తోంది. ముఖ్యంగా USలో కేవలం ప్రీ-సేల్స్తోనే 500K డాలర్ల మార్క్ను దాటి, చిరూ కెరీర్లోనే ఫాస్టెస్ట్ రికార్డును నెలకొల్పింది. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం మరిన్ని సంచలనాలు సృష్టించడం ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందిన ‘రాజాసాబ్’ చిత్రం నిన్న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, ప్రభాస్ క్రేజ్తో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 90 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. భారత్లోనే రూ.54 కోట్ల నెట్ కలెక్షన్లు రాబట్టినట్లు వెల్లడించాయి.
TG: కల్ట్ వెబ్ సిరీస్పై హైకోర్టులో విచారణ వాయిదా పడింది. మదనపల్లిలో జరిగిన యథార్థ ఘటన ఆధారంగా తెరకెక్కుతోన్న కల్ట్ వెబ్ సిరీస్ ఆపాలని పిటిషన్ దాఖలైంది. ఈ నేపథ్యంలో నటుడు రాహుల్ సిప్లిగంజ్, మెటా, ఫేస్బుక్, గూగుల్, కల్ట్ వెబ్సిరీస్ దర్శకుడు, బృందానికి కోర్టు నోటిసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
AP: మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రానికి టికెట్ ధరలు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. జనవరి 11న రాత్రి 8 గంటల ప్రీమియర్ షో టికెట్ ధరను GSTతో కలిపి రూ.500గా నిర్ణయించింది. అలాగే, జనవరి 12 నుంచి పది రోజుల పాటు సింగిల్ స్క్రీన్స్లో రూ. 100, మల్టీప్లెక్స్లలో రూ. 120 చొప్పున అదనంగా పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించింది.
‘రాజాసాబ్’ టికెట్ ధరల పెంపుపై ప్రభుత్వం జారీ చేసిన మెమోను తెలంగాణ హైకోర్టు రద్దు చేసిన నెంబర్ 120 ప్రకారం గరిష్ట టికెట్ ధర రూ.350కి మించడానికి వీల్లేదని కోర్టు స్పష్టం చేసింది. అయితే, ఈ తీర్పు కేవలం ఈ ఒక్క సినిమాకే కాకుండా, భవిష్యత్తులో విడుదల కానున్న అన్ని భారీ చిత్రాలకు వర్తిస్తుందని న్యాయస్థానం స్పష్టం చేసింది.
రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘రాజాసాబ్’ చిత్ర నిర్మాతలకు భారీ షాక్ తగిలింది. ఈ చిత్ర టికెట్ ధరలను పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన మెమోను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. పాత ధరలకే టికెట్లను విక్రయించాలని ఆదేశాలు జారీ చేసింది. అలాగే, పెద్ద సినిమాల విడుదల సమయంలో పదేపదే టికెట్ రేట్లు ఎందుకు పెంచుతున్నారంటూ TG ప్రభుత్వంపై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
దళపతి విజయ్ ‘జన నాయగన్’ సినిమాకు మరో భారీ షాక్ తగిలింది. ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్ జారీ చేయాలంటూ సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలపై, తాజాగా డివిజన్ బెంచ్ స్టే విధించింది. దీంతో సినిమా విడుదల మరింత ఆలస్యం కానుంది. కాగా, విజయ్ కెరీర్లో చివరి చిత్రమైన ‘జన నాయగన్’ను కావాలనే అడ్డుకుంటున్నారని ఆయన అభిమానులు సెన్సార్ బోర్డ్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
KGF స్టార్ యశ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘టాక్సిక్’. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే, తాజాగా విడుదలైన ఈ మూవీ టీజర్ రికార్డులు కొల్లగొడుతోంది. రిలీజైన 24 గంటల్లోనే 200 మిలియన్లకు పైగా వ్యూస్తో పాటు 5.5M లైక్స్ను సొంతం చేసుకుని యూట్యూబ్ను షేక్ చేస్తోంది.
తమిళ స్టార్ హీరో కార్తీ ‘వా వాథియార్’ సినిమాకు మద్రాస్ హైకోర్టు షాక్ ఇచ్చింది. రూ.21 కోట్ల బకాయిల వివాదంలో ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో నిర్మాత జ్ఞానవేల్ రాజా బకాయిలు చెల్లించేందుకు.. సినిమా హక్కులను బహిరంగ వేలం వేయాలని ఆదేశించింది. ఫైనాన్షియర్కు పూర్తి బకాయిలు చెల్లించే వరకు సినిమా విడుదల చేయొద్దని కోర్టు స్పష్టం చేసింది.
98వ ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం మార్చి 15న జరగనుంది. తాజాగా అకాడమీ విడుదల చేసిన ‘రిమైండర్ లిస్ట్’లో భారత్ నుంచి 4 మూవీలు స్థానం దక్కించుకున్నాయి. ఉత్తమ చిత్రం కేటగిరీలో కాంతార 1, మహావతార్ నరసింహ, తన్వి ది గ్రేట్, టూరిస్ట్ ఫ్యామిలీ నిలిచాయి. మరోవైపు భారత్ నుంచి అధికారికంగా పంపించిన హోమ్బౌండ్ మూవీ ‘ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్’ కేటగిరీలో టాప్ 15లో నిలిచింది.
తమిళ హీరో శివకార్తికేయన్ నటించిన ‘పరాశక్తి’ మూవీ జనవరి 10న రిలీజ్ కాబోతుంది. అయితే తెలుగులో కూడా విడుదల కావాల్సి ఉండగా వాయిదా పడే అవకాశం ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి మూవీల రద్దీ, థియేటర్ల లభ్యత తక్కువ ఉన్న కారణంగా జనవరి 23న ఈ మూవీ తెలుగు వెర్షన్ రిలీజ్ కాబోతున్నట్లు సమాచారం. ఇక 1960ల నాటి హిందీ వ్యతిరేక ఉద్యమ నేపథ్యంలో ఈ సినిమా రాబోతుంది.
TG: రాజాసాబ్ సినిమా టికెట్ రేట్ల పెంపుపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పదే పదే టికెట్ రేట్లు ఎందుకు పెంచుతున్నారని మండిపడింది. ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు మీ ఆలోచన మారడం లేదని ధ్వజమెత్తింది. మెమో ఇచ్చే అధికారికి నిబంధనలు తెలియదా? అని ప్రశ్నించింది. టికెట్ రేట్లు పెంచమని సంబంధిత మంత్రి కూడా ప్రకటించారని గుర్తుచేసింది.
ప్రభాస్ ‘రాజాసాబ్’ మూవీ నిర్మాతలు ఒక యూజర్ పోస్ట్ చేసిన నెగెటివ్ రివ్యూను తొలగించమని రిక్వెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అందుకోసం 150 డాలర్లు (సుమారు రూ.14,000) ఆఫర్ చేశారని ఆ యూజర్ ఆరోపించాడు. దానికి సంబంధించిన మెసేజ్ స్క్రీన్షాట్ను SMలో షేర్ చేస్తూ.. ‘ఏంటిది? నా రివ్యూను తొలగించడానికి డబ్బు ఆఫర్ చేస్తున్నారు. నేను దీన్ని అస్సలు డిలీట్ చేయను’ అని రాసుకొచ్చాడు.
కన్నడ స్టార్ యష్ నటిస్తోన్న ‘టాక్సిక్’ మార్చి 19న రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ మూవీలోని నటీనటుల పారితోషికంపై న్యూస్ బయటకొచ్చింది. ఈ మూవీ కోసం యష్ రూ.50కోట్లు, కియారా అద్వానీ రూ.15కోట్లు, నయనతార రూ.12-18కోట్లు, రుక్మిణి వసంత్ రూ.2-3కోట్లు, తారా సుతారియా రూ.2-3కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారట. ఇక ఈ సినిమా రూ.300కోట్లకుపైగా బడ్జెట్తో రూపొందుతోన్నట్లు సమాచారం.
ప్రభాస్ ‘రాజాసాబ్’ మూవీ ఇవాళ థియేటర్లలో విడుదలైంది. అయితే ఈ సినిమా బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ‘భూల్ భులయ్యా’ మూవీని పోలి ఉందని ప్రచారం జరుగుతోంది. తాజాగా దీనిపై మేకర్స్ స్పందించారు. అందులో నిజం లేదని నిర్మాత విశ్వప్రసాద్ తెలిపాడు. ఇది పూర్తి భిన్నమైన కథ అని, ప్రభాస్ కోసం కొత్త ప్రపంచాన్ని సృష్టించామని చెప్పాడు. ఇప్పటివరకూ ఇలాంటి కథ రాలేదని, విజువల్స్ కొత్తగా ఉంటాయన్నాడు.