ఇన్స్టాగ్రామ్లో చాలామంది సబ్స్క్రిప్షన్ అనగానే అక్కడేదో బూతు కంటెంట్ ఉంటుందని భావిస్తున్నారు. అయితే తన దగ్గర మాత్రం అలాంటివి ఆశించొద్దని మలయాళ నటి అన్నా రేష్మ రాజన్ తెలిపారు. తన అకౌంట్లో సబ్స్క్రిప్షన్ మోడల్ను రెండేళ్ల క్రితమే ప్రారంభించానని.. సబ్స్క్రిప్షన్ వల్ల తన ఫోటోలు ముందుగానే వస్తాయని చెప్పారు.
‘లాల్సింగ్ చద్దా’ మూవీలో తనకంటే తన కుమారుడు జునైద్ ఖాన్ నటిస్తే బాగుంటుందని అనుకున్నట్లు అమీర్ ఖాన్ చెప్పాడు. జునైద్ నటనను చూసి ఆశ్చర్యపోయానని, అతన్నే హీరోగా తీసుకోవాలని నిర్మాతలను కోరినట్లు తెలిపాడు. కానీ వారు అంగీకరించలేదన్నాడు. అయితే షూటింగ్ సమయంలో జునైద్ నటననే స్ఫూర్తిగా తీసుకున్నానని, అది తనపై ఎంతో ప్రభావం చూపిందని పేర్కొన్నాడు.
నిఖిల్ సిద్ధార్థ్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్తో రూపొందుతున్న మూవీ ‘స్వయంభూ’. భరత్ కృష్ణమాచారి తెరకెక్కిస్తున్న ఈ మూవీలోని ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఖరారైంది. ‘రా రా ధీవర’ అంటూ సాగే ఈ పాటను ఏప్రిల్ 16న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఒక యోధుడి స్ఫూర్తిని చాటిచెప్పే విధంగా సాగే ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకోనుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
తమిళనాడులో స్టార్ హీరోలు రజినీకాంత్, ధనుష్ ఇళ్లకు బాంబు బెదిరింపులు రావడం కలకలం సృష్టించింది. డీజీపీ కార్యాలయానికి వచ్చిన ఈమెయిల్తో అప్రమత్తమైన పోలీసులు, బాంబు స్క్వాడ్తో కలిసి పోయిస్ గార్డెన్లో ముమ్మరంగా సోదాలు చేశారు. గంటన్నర తనిఖీల తర్వాత ఎటువంటి పేలుడు పదార్థాలు లభించకపోవడంతో అది ‘ఫేక్ కాల్’ అని తేల్చారు. దీంతో అభిమానులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యూచర్ లైనప్ ప్రస్తుతం టాలీవుడ్లో సెన్సేషన్ సృష్టిస్తోంది. ముఖ్యంగా ‘రాకా’ తర్వాత ఆయన ఎవరితో జతకట్టబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. ప్రశాంత్ నీల్తో సినిమా ఫిక్స్ అయినా, ఎన్టీఆర్ ప్రాజెక్ట్ వల్ల అది ఆలస్యమయ్యేలా ఉంది. నీల్ ఆ సినిమా రెండు భాగాలను పూర్తి చేశాకే బన్నీతో పని చేసే అవకాశం ఉన్నట్లు టాక్.
బాలీవుడ్ లెజెండరీ నటి మధుబాల బయోపిక్కు రంగం సిద్ధమైంది. సంజయ్లీలా భన్సాలీ నిర్మాణంలో జస్మిత్ కె.రీన్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. మధుబాల పాత్ర కోసం గతంలో పలువురు హీరోయిన్ల పేర్లు వినిపించినప్పటికీ, తాజాగా మలయాళ బ్యూటీ కళ్యాణి ప్రియదర్శన్ ఖరారైనట్లు టాక్. మధుబాల పాత్రకు అవసరమైన ఆ అమాయకత్వం, క్లాసిక్ అందం కళ్యాణిలో మెండుగా ఉన్నాయని భన్సాలీ బృందం భావిస్తోంది.
‘జన నాయగన్’ మూవీ లీక్పై విజయ్ దేవరకొండ స్పందిస్తూ ఆవేదన వ్యక్తం చేశాడు. కెరీర్ ఆరంభంలో తాను కూడా ఇలాంటి బాధను అనుభవించానని, ఇతరులకు హాని చేసేందుకు కొందరు ఎంతకైనా దిగజారుతారని విమర్శించాడు. బాధ్యులను గుర్తించకపోతే అది వ్యవస్థాగత వైఫల్యమేనన్న ఆయన, చిత్రబృందానికి తన మద్దతు ప్రకటించాడు. మనుషులు ఇంత కఠినంగా ఎలా ఉంటారో అర్థం కావడం లేదంటూ పోస్ట్ చేశాడు.
నేచురల్ స్టార్ నాని, కయాదు లోహర్ జంటగా నటిస్తోన్న మూవీ ‘ది ప్యారడైజ్’. ఇవాళ కయాదు బర్త్ డే సందర్భంగా మేకర్స్.. ఆమెకు విషెస్ చెబుతూ ఫస్ట్ లుక్ పోస్టర్ షేర్ చేశారు. ఇందులో ఆమె ‘సుబ్బలక్ష్మి’ పాత్రలో కనిపించనున్నట్లు తెలిపారు. ఇక దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తోన్న ఈ మూవీ ఆగస్టు 21, 2026న థియేటర్లలో సందడి చేయనుంది.
నేచురల్ స్టార్ నాని, కయాదు లోహర్ జంటగా నటిస్తోన్న మూవీ ‘ది ప్యారడైజ్’. ఇవాళ కయాదు బర్త్ డే సందర్భంగా మేకర్స్.. ఆమెకు విషెస్ చెబుతూ ఫస్ట్ లుక్ పోస్టర్ షేర్ చేశారు. ఇందులో ఆమె ‘సుబ్బలక్ష్మి’ పాత్రలో కనిపించనున్నట్లు తెలిపారు. ఇక దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తోన్న ఈ మూవీ ఆగస్టు 21, 2026న థియేటర్లలో సందడి చేయనుంది.
నేచురల్ స్టార్ నాని, కయాదు లోహర్ జంటగా నటిస్తోన్న మూవీ ‘ది ప్యారడైజ్’. ఇవాళ కయాదు బర్త్ డే సందర్భంగా మేకర్స్.. ఆమెకు విషెస్ చెబుతూ ఫస్ట్ లుక్ పోస్టర్ షేర్ చేశారు. ఇందులో ఆమె ‘సుబ్బలక్ష్మి’ పాత్రలో కనిపించనున్నట్లు తెలిపారు. ఇక దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తోన్న ఈ మూవీ ఆగస్టు 21, 2026న థియేటర్లలో సందడి చేయనుంది.
విక్కీ కౌశల్ హీరోగా ‘మడాక్ ఫిల్మ్స్’ నిర్మిస్తున్న భారీ చిత్రం ‘మహావతార్’. ఈ క్రేజీ ప్రాజెక్టులో కథానాయికగా శ్రద్ధాకపూర్ను చిత్రబృందం సంప్రదించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ కాంబినేషన్ సెట్ అయితే విక్కీ, శ్రద్ధ కలిసి నటిస్తున్న తొలి సినిమా ఇదే అవుతుంది. ఈ కొత్త జంట వెండితెరపై ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ రూపొందించిన మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’. మార్చి 19న రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో విజయం సాధించలేకపోయింది. తాజాగా ఈ మూవీ OTT రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. ప్రముఖ OTT సంస్థ నెట్ఫ్లిక్స్లో ఏప్రిల్ 16 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఇది అందుబాటులో ఉండనుంది.
అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ‘డెకాయిట్’ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చింది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ను మేకర్స్ ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు రూ.15కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టినట్లు పోస్టర్ షేర్ చేశారు. అటు ఓవర్సీస్లో కూడా 575K డాలర్లకుపైగా వసూళ్లు సాధించింది. ఇక షానీల్ డియో ఈ మూవీకి దర్శకత్వం వహించాడు.
‘డెకాయిట్’ మూవీతో మంచి రెస్పాన్స్ దక్కించుకున్న అడివి శేష్.. తాజాగా కొత్త ప్రాజెక్టును ప్రకటించాడు. ‘ది గర్ల్ఫ్రెండ్’ దర్శకుడు రాహుల్ రవీంద్రన్తో సినిమా చేయనున్నట్లు వెల్లడించాడు. ఇప్పటికే శేష్ కోసం రాహుల్ అదిరిపోయే కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇక ‘గూఢచారి 2’ మూవీ పూర్తయిన తర్వాత ఈ ప్రాజెక్టు స్టార్ట్ కానున్నట్లు సమాచారం.
వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న మూవీ ‘ఆదర్శ కుటుంబం’. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఒక ఆసక్తికరమైన అప్డేట్ బయటకు వచ్చింది. ఇందులో విలన్ పాత్ర కోసం ‘ధురంధర్ 2’ ఫేమ్ ఉదయ్ వీర్ సింధును మేకర్స్ ఎంపిక చేశారట. పలువురిని పరిశీలించిన తర్వాత, చివరకు మేకర్స్ ఉదయ్ వీర్నే ఫైనల్ చేసినట్లు సమాచారం.