బాలీవుడ్ లెజెండరీ నటి మధుబాల బయోపిక్కు రంగం సిద్ధమైంది. సంజయ్లీలా భన్సాలీ నిర్మాణంలో జస్మిత్ కె.రీన్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. మధుబాల పాత్ర కోసం గతంలో పలువురు హీరోయిన్ల పేర్లు వినిపించినప్పటికీ, తాజాగా మలయాళ బ్యూటీ కళ్యాణి ప్రియదర్శన్ ఖరారైనట్లు టాక్. మధుబాల పాత్రకు అవసరమైన ఆ అమాయకత్వం, క్లాసిక్ అందం కళ్యాణిలో మెండుగా ఉన్నాయని భన్సాలీ బృందం భావిస్తోంది.
‘జన నాయగన్’ మూవీ లీక్పై విజయ్ దేవరకొండ స్పందిస్తూ ఆవేదన వ్యక్తం చేశాడు. కెరీర్ ఆరంభంలో తాను కూడా ఇలాంటి బాధను అనుభవించానని, ఇతరులకు హాని చేసేందుకు కొందరు ఎంతకైనా దిగజారుతారని విమర్శించాడు. బాధ్యులను గుర్తించకపోతే అది వ్యవస్థాగత వైఫల్యమేనన్న ఆయన, చిత్రబృందానికి తన మద్దతు ప్రకటించాడు. మనుషులు ఇంత కఠినంగా ఎలా ఉంటారో అర్థం కావడం లేదంటూ పోస్ట్ చేశాడు.
నేచురల్ స్టార్ నాని, కయాదు లోహర్ జంటగా నటిస్తోన్న మూవీ ‘ది ప్యారడైజ్’. ఇవాళ కయాదు బర్త్ డే సందర్భంగా మేకర్స్.. ఆమెకు విషెస్ చెబుతూ ఫస్ట్ లుక్ పోస్టర్ షేర్ చేశారు. ఇందులో ఆమె ‘సుబ్బలక్ష్మి’ పాత్రలో కనిపించనున్నట్లు తెలిపారు. ఇక దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తోన్న ఈ మూవీ ఆగస్టు 21, 2026న థియేటర్లలో సందడి చేయనుంది.
నేచురల్ స్టార్ నాని, కయాదు లోహర్ జంటగా నటిస్తోన్న మూవీ ‘ది ప్యారడైజ్’. ఇవాళ కయాదు బర్త్ డే సందర్భంగా మేకర్స్.. ఆమెకు విషెస్ చెబుతూ ఫస్ట్ లుక్ పోస్టర్ షేర్ చేశారు. ఇందులో ఆమె ‘సుబ్బలక్ష్మి’ పాత్రలో కనిపించనున్నట్లు తెలిపారు. ఇక దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తోన్న ఈ మూవీ ఆగస్టు 21, 2026న థియేటర్లలో సందడి చేయనుంది.
నేచురల్ స్టార్ నాని, కయాదు లోహర్ జంటగా నటిస్తోన్న మూవీ ‘ది ప్యారడైజ్’. ఇవాళ కయాదు బర్త్ డే సందర్భంగా మేకర్స్.. ఆమెకు విషెస్ చెబుతూ ఫస్ట్ లుక్ పోస్టర్ షేర్ చేశారు. ఇందులో ఆమె ‘సుబ్బలక్ష్మి’ పాత్రలో కనిపించనున్నట్లు తెలిపారు. ఇక దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తోన్న ఈ మూవీ ఆగస్టు 21, 2026న థియేటర్లలో సందడి చేయనుంది.
విక్కీ కౌశల్ హీరోగా ‘మడాక్ ఫిల్మ్స్’ నిర్మిస్తున్న భారీ చిత్రం ‘మహావతార్’. ఈ క్రేజీ ప్రాజెక్టులో కథానాయికగా శ్రద్ధాకపూర్ను చిత్రబృందం సంప్రదించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ కాంబినేషన్ సెట్ అయితే విక్కీ, శ్రద్ధ కలిసి నటిస్తున్న తొలి సినిమా ఇదే అవుతుంది. ఈ కొత్త జంట వెండితెరపై ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ రూపొందించిన మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’. మార్చి 19న రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో విజయం సాధించలేకపోయింది. తాజాగా ఈ మూవీ OTT రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. ప్రముఖ OTT సంస్థ నెట్ఫ్లిక్స్లో ఏప్రిల్ 16 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఇది అందుబాటులో ఉండనుంది.
అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ‘డెకాయిట్’ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చింది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ను మేకర్స్ ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు రూ.15కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టినట్లు పోస్టర్ షేర్ చేశారు. అటు ఓవర్సీస్లో కూడా 575K డాలర్లకుపైగా వసూళ్లు సాధించింది. ఇక షానీల్ డియో ఈ మూవీకి దర్శకత్వం వహించాడు.
‘డెకాయిట్’ మూవీతో మంచి రెస్పాన్స్ దక్కించుకున్న అడివి శేష్.. తాజాగా కొత్త ప్రాజెక్టును ప్రకటించాడు. ‘ది గర్ల్ఫ్రెండ్’ దర్శకుడు రాహుల్ రవీంద్రన్తో సినిమా చేయనున్నట్లు వెల్లడించాడు. ఇప్పటికే శేష్ కోసం రాహుల్ అదిరిపోయే కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇక ‘గూఢచారి 2’ మూవీ పూర్తయిన తర్వాత ఈ ప్రాజెక్టు స్టార్ట్ కానున్నట్లు సమాచారం.
వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న మూవీ ‘ఆదర్శ కుటుంబం’. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఒక ఆసక్తికరమైన అప్డేట్ బయటకు వచ్చింది. ఇందులో విలన్ పాత్ర కోసం ‘ధురంధర్ 2’ ఫేమ్ ఉదయ్ వీర్ సింధును మేకర్స్ ఎంపిక చేశారట. పలువురిని పరిశీలించిన తర్వాత, చివరకు మేకర్స్ ఉదయ్ వీర్నే ఫైనల్ చేసినట్లు సమాచారం.
దర్శకుడు రవిబాబు స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న విభిన్నమైన యాక్షన్ డ్రామా ‘రేజర్’. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్, డబ్బింగ్ పనులను ఆఖరి దశలో జరుపుకుంటోంది. వినూత్న కాన్సెప్ట్తో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. తాజాగా మేకర్స్ విడుదల తేదీని ఖరారు చేస్తూ, ఈ సమ్మర్ కానుకగా మే 8న గ్రాండ్ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.
మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో ఓ భారీ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ‘గోపీచంద్ 33’ అనే వర్కింగ్ టైటిల్తో రూపొందుతున్న ఈ మూవీ టైటిల్ గ్లింప్స్కు డేట్ ఫిక్స్ అయ్యింది. ఏప్రిల్ 13 గ్లింప్స్ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ పోస్టర్ షేర్ చేశారు. ఇక ఈ చిత్రానికి ‘భారత వర్ష’ అనే టైటిల్ను ఖరారు చేసినట్లు సమాచారం.
ఆది పినిశెట్టి నటించిన రివెంజ్ డ్రామా ‘శబ్దం’ OTTలో స్ట్రీమింగ్ అవుతోంది. జీ5లో కేవలం తమిళ్, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సినిమా తెలుగు వెర్షన్ తాజాగా అందుబాటులోకి వచ్చింది. ఇక అరివళగన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా 2025 ఫిబ్రవరి 28న థియేటర్లలో విడుదలై మిశ్రమ స్పందన తెచ్చుకుంది.
సినీ నిర్మాత సునీల్ నారంగ్కు ఆయన అకౌంటెంట్ భారీ టోకరా వేశాడు. బోగస్ ఖాతాల పేరుతో నిర్మాత వద్ద నుంచి ఏకంగా కోటి రూపాయలు కాజేశాడు. ఈ విషయాన్ని గుర్తించిన నిర్మాత జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిందితుడు విశ్వనాథ్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
‘కాంతార’ భూత కోల వేషధారణపై అనుచిత వ్యాఖ్యల వివాదంలో బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ వెనక్కి తగ్గాడు. కర్ణాటక హైకోర్టులో జరిగిన విచారణలో, భక్తుల మనోభావాలు దెబ్బతిన్నందుకు క్షమాపణ పత్రాన్ని సమర్పిస్తానని హామీ ఇచ్చాడు. తన సింధీ నేపథ్యం వల్ల ఈ సంప్రదాయాల విశిష్టత తెలియక పొరపాటు జరిగిందని, ఇది ఉద్దేశపూర్వకం కాదని తెలిపాడు. కోర్టు తదుపరి విచారణను ఏప్రిల్ 23కు వాయిదా వేసింది.